రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు
ఆంధ్రప్రదేశ్ :- మంగళవారం నాడు ఏపీ బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. మంగళవారం సాయంత్రం సమయంలో మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయాన్ని YSRCP కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా రేపు అనగా బుధవారం నాడు ఏపీ రాష్ట్ర బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. మంగళగిరి తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల టిడిపి ప్రధాన కార్యాలయాలపై దాడికి యత్నించడంతో పాటు టిడిపి నేత పట్టాభి ఇంటిని ధ్వంసం చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం విఫలం అయిందని మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంగళగిరి జాతీయ రహదారిపై టిడిపి కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment