నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట
చిలకలూరిపేట:- నేడు జరగబోయే బంద్ కు తాము సహకరించమని చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట అధ్యక్షులు కూనాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు ప్రకటించిన బంద్ అది వారి వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా ఉన్న కారణంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించుట సహేతుకంగా లేనందున మేము బంద్ కు మద్దతు తెలియపర్చుటలేదు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులు అనేక వ్యాపార మరియు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నందువలన, ఈ బంద్ వలన సమాజానికి సరైన ఉపయోగం లేనందున చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట వారు ఈ బంద్ కు సహకరించుట లేదు అని చిలకలూరిపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు.
No comments:
Post a Comment