చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు
చిలకలూరిపేట: ఏఎంజి, ఫార్ కార్నర్స్, వేద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ గారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిలకలూరిపేట లోని జాతీయ రహదారి పక్కన ఉన్న జాన్ డేవిడ్ గారి సమాధి వద్ద కుటుంబ సభ్యులు, AMG ఫార్ కార్నర్స్, వేద సంస్థల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాన్ డేవిడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెస్సి యస్ బర్నబాస్ మాట్లాడుతూ... డాక్టర్ జాన్ డేవిడ్ ఏర్పాటుచేసిన స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కష్టాల్లో ఉన్న ఉన్న లక్షలాది మంది ప్రజానీకం సేవలు అందుకుంటున్నారని అన్నారు. గొప్ప మానవతావాది జాన్ డేవిడ్ అని అన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేసిన అపర భగీరథుడు జాన్ డేవిడ్ అని కొనియాడారు. జాన్ డేవిడ్ ఆశయ సాధనకు తమ వంతు కృషి కొనసాగిస్తామని అన్నారు.
జాన్ డేవిడ్ గారు ఒక పార్టీకి ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తిగా కాకుండా పట్టణంలోని ప్రతి ఒక్క ఒక ఇంటికి మంచి నీటి కష్టం లేకుండా చేసినటువంటి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పట్టణంలోని అన్ని ఏరియాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉంది అంటే దానికి కారణం జాన్ డేవిడ్ గారు.