చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు.
చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు.
మన్యం దొర అల్లూరి సీతారామరాజు & వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సెంటర్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు పట్టణ నాయకులు.బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన అల్లూరి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పారు. ఆనాడు అల్లూరి లాంటి వారి చేసిన ప్రాణ త్యాగాలకు ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అని తెలిపారు.అలాగే వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం అయన చేసిన చర్యలను తలుచుకున్నారు. ఈ కార్యక్రమాలలో వైస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీ అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య గారు మరియు రోటరీ క్లబ్ సభ్యులు మరియు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం గారు అల్లూరికి కి ఘన నివాళి అర్పించారు. అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపర్తి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి తన్నీరు రామారావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ వంకాయలపాటి వంశీ మరియు ఇతర పార్టీ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహ వ్యవస్థాపకులు వేగేశ్న అంజి రాజు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొని నివాళులర్పించారు.
చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు
చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు
ఆదివారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు వైస్సార్సీపీ పట్టణంలో చేస్తున్న చర్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.57 సంవత్సరాల చరిత్ర ఉన్న చిలకలూరిపేట మునిసిపాలిటీ ఆస్తులను బ్యాంకులకు తాకట్టుపెట్టాన్ని వైస్సార్సీపీ చేతకాని తనంగా అభివర్ణించారు. అలాగే గాంధీ పార్కు మరియు పార్కు బయటఉన్న మునిసిపల్ కాంప్లెక్స్ లను తాకట్టు పెట్టటం సిగ్గు చేటు అని తెలిపారు. పార్క్ మరియు కంప్లెక్సలను బ్యాంకులో 50 కోట్లకి తాకట్టు పెడదాం అని అడిగితే దానికి సదరు బ్యాంకు అధికారులు వ్యాల్యూవేషన్ వేసి 30 కోట్లు మాత్రమే ఇస్తాము అని తెలపగా 30 కోట్ల రూపాయలకి తాకట్టు మాకు సమ్మతమే అని తెలిపారు అని విశ్వసనీయత సమాచారం అని తెలిపారు.పట్టణంలో ఎంత మంది MLA , మినిస్టర్ అయిన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సమీకరించారు కానీ ఇలా ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు.మునిసిపల్ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాని చెట్టు క్రింద నిర్వహించామని అన్నారు. అలా మునిస్పల్ ఆస్తులన్నీ అమ్మిన తరువాత మనుషులను కూడా తాకట్టు పెట్టండి అని అన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తూ ఇలా మునిసిపల్ ఆస్తులన్నీ తాకట్టు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఎలాంటి కార్యకలాపాలన్నీ విరమించుకోవాలి. లేదు అంటే ఉద్యమం చేసి ఆస్తులను కాపాడుకుంటాం అని తెలిపారు.ఈ సమావేశంలో 8 మంది టీడీపీ కౌన్సిలర్లు,టీడీపీ నాయకులూ పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 04-07-2021,ఆదివారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
సుబ్భయతోట లో - 1
జాకిర్ హుస్సేన్ వీధి లో - 3
గుర్రాల చావిడి లో - 3 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు 10 లక్షలు చోరీ
చిలకలూరిపేట పట్టణంలో 10 లక్షల రూపాయల నగదు చోరీ జరిగింది.వివరాలలోకి వెళ్తే పట్టణంలోని మార్కెట్ సెంటర్ నందు మణికంఠ ట్రేడర్స్ అనే బియ్యం మిల్లు యజమాని అర్వపల్లి కాశీవిశ్వేశ్వరావు అనే వ్యక్తి తన మిల్లు ఎదురుగా ఉండే బియ్యం స్టోర్ చేసుకునే గౌడాన్ నందు రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు 11లక్షల 50 వేల రూపాయలను బీరువాలో దాచాడు.అయితే రైతుల వద్ద బియ్యం కొనుగోలుకు డబ్బులు కోసం అని ఆదివారం నాడు గౌడాన్ తెరవగా అందులో బీరువా పగలగొట్టి అందులోని కొంత డబ్బులు క్రింద ఉండటాన్ని గమనించిన సదరు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన CI,SI లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గౌడాన్ వెనుక వెంటిలేషన్ తొలగించి అందులోకి ప్రవేశించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.క్లూస్ టీమ్ పిలిపించి ఆధారాలు పరిశీలిస్తునట్లు తెలిపారు. పోలీస్ అధికారులు.
పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
పట్టణంలోని పలు చేపల విక్రయాల వ్యాపారుల పైనా కేసులు నమోదు - తూనికల, కొలతలశాఖాధికారి అల్లూరయ్య
చిలకలూరిపేట పట్టణంలో పలు చేపల విక్రయ వ్యాపారుల పైనా దాడులు నిర్వహించారు అధికారులు.తూనికల,కొలమానాల అధికారులు పట్టణంలో చేపల అమ్మకాల కొలతలతో తేడాలు జరుగుతున్నట్లు చాల ఫిర్యాదులు అందాయి అని అందుకే ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు.కొలతలతో అవినీతి పాల్పడేవారి పైనా కేసులు నమోదు చేసారు. 5గురి పైన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వారం ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తాం అని ముద్రలు లేని ఎలక్ట్రిక్ కటాలను వినియోగిస్తే వారిపైన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ దాడులలో కొలతలు, తూనికల శాకాధికారి అల్లూరయ్య ఇతర సిబ్బంది పాల్గిన్నారు .
చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేట - నరసరావుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది.మండల పరిధిలోని కావూరు గ్రామం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కావూరు గ్రామానికి చెందిన బైక్,కారు ఢీ కొట్టటం వలన బైక్ పైన వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. కారు స్వల్పంగా దెబ్బతినగా. ద్విచక్ర వాహనదారులు మాత్రం తీవ్ర గాయాలపాలయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న 108 సిబంది అక్కడికి చేసుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట - నియోజకవర్గంలో రోజు రోజుకు పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు - కొత్తగా 4 గ్రామాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న మూలంగా అధికారులు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా తీవ్రతను తగ్గించాలి అని సూచించారు. ఇప్పటికే యడ్లపాడు మండలంలో 3 కంటైన్మెంట్ జోన్లు ఉండగా కరోనా విస్తృతి పెరుగుతున్న రీత్యా మరో 4 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. యడ్లపాడు మండలం యడ్లపాడు గ్రామం, కొండవీడు, కొత్తపాలెం, లింగారావుపాలెం గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు గా ఇన్సిడెంట్ కమాండర్ తహసీల్దార్ జ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. ఆయా గ్రామాలలో ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే అత్యవసరంగా బయటకు రావాలి అని తెలిపారు. ప్రజలందరు సహకరించాలి అని కోరారు. అలాగే కరోనా నియమాలు పాటించని వారిపైన ఖఠినమైన చర్యలు, కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట,యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి.
చంద్రవరం గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 1
చిరుమామిళ్ల గ్రామంలో - 2
సంక్రాంతిపాడు గ్రామంలో - 2
సాతులూరు గ్రామంలో - 1
గిరిజవోలు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 1 కేసు నమోదు అయింది.
తిమ్మాపురం గ్రామంలో - 1 గా నమోదు అయింది.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 2
వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 03-07-2021,శనివారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
తూర్పుమలపల్లి లో - 1
విశ్వబ్రాహ్మణ కాలనీ లో - 1
శివాలయం వీధి లో - 1 గా నమోదు అయ్యాయి.
Use MASK & Sanitizers and keep Social-Distance
చిలకలూరిపేట - MLA రజినికి మినిష్టర్ ఇవ్వాలి - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
చిలకలూరిపేట - MLA రజినికి మినిష్టర్ ఇవ్వాలి - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
చిలకలూరిపేట పట్టణానికి శుక్రవారం రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పట్టణానికి విచ్చేసారు. ముందుగా పొట్టిశ్రీరాములు కాంప్లెక్స్ వద్ద బీసీ సంఘ నాయకులూ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సంఘాలు మొత్తం ఏకమై మన హక్కులను మనం కాపాడుకోవాలి అని తెలిపారు. అలాగే చిలకలూరిపేటలో అనుకోకుండా రావలసి వచ్చిన అప్పటికి అప్పుడు ఎంత మంది రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. అలాగే ఎప్పుడు అయిన ఉద్యమానికి పిలుపునిస్తే పట్టణాన్ని స్థంబింప చేసేంతగా ఆక్టివ్ గా ఉన్నారు మీరు అందరూ అని అన్నారు.బీసీ సంఘ నాయకులు,కూరగాయల మార్కెట్ కమిటీ ఆయనకు సన్మానం చేసారు.
అనంతరం వైస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు అయ్యారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి బీసీ లకు పూర్తి న్యాయం చేస్తున్నారు అని.దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వం సొంతం అని తెలియజేసారు.రేపు జగన్ క్యాబినెట్ విస్తరణలో MLA రజిని గారికి మినిస్టర్ ఇస్తే రాష్ట్రం లోనే కాదు దేశంలో ఉన్న బీసీలు అందరూ ఆనందిస్తారు అని తెలిపారు.రజిని మేడంకు ఏపీలోనే కాదు తెలంగాణాలో కూడా చాల ఫాలోయింగ్ ఉంది, చాల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అని కొనియాడారు.
వీడియో :-
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధి - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు మొత్తం 14 కేసులు నమోదు అయ్యాయి
యడ్లపాడు మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి.
లింగారావుపాలెం గ్రామంలో - 1
కొండవీడు గ్రామంలో - 2
యడ్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి.
రాజుగారిపాలెం గ్రామంలో - 1
నాదెండ్ల గ్రామంలో - 1
ఎండుగుంపాలెం గ్రామంలో - 2
సాతులూరు గ్రామంలో - 1
చంద్రవరం గ్రామంలో - 2
సంక్రాంతిపాడు - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 02-07-2021,శుక్రవారం నాడు మొత్తం12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి.
సాంబశివనగర్ లో - 1
సుగాలికాలని లో - 1
జాకీర్ హుస్సేన్ వీధి లో - 2
సౌదాఘర్ వీధిలో - 2
సుబ్బయ్యతోటలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు ననమోదు అయ్యాయి.
వేలూరు గ్రామంలో - 4
గోవిందపురం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష
అంతరిక్షంలోకి వెళ్లనున్న మన గుంటూరు జిల్లా వాసి బండ్ల శిరీష
జులై 11వ తేదీన అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అంతరిక్ష నౌక బయల్దేరనుంది. అయితే ఆ సంస్థ అందులో ప్రయాణించటానికి నలుగురిని ఎంచుకుంది అందులో మన తెలుగు అమ్మాయి అయిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష ఒకరు.ఆమె కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ఇలా అంతరిక్షయానం చెయ్యటం పట్ల ప్రతి తెలుగువారు గర్వపడుతున్నారు. అల్ ది బెస్ట్ ఫర్ హ్యాపీ జర్నీ
చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిచే కోవిడ్ వారియర్ అవార్డు పొందిన - మన చిలకలూరిపేట డాక్టర్ కొల్ల అమర్
చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారిచే కోవిడ్ వారియర్ అవార్డు పొందిన - మన చిలకలూరిపేట డాక్టర్ కొల్ల అమర్
చిలకలూరిపేట - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను మన చిలకలూరిపేట ప్రగతి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ - కొల్ల అమర్ గారికి కోవిడ్ వారియర్ అవార్డు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద 6 అవార్డులు ప్రకటించగా ఒకటి మన చిలకలూరిపేట అమర్ గారికి వరించటం వారి చేసిన సేవకు ప్రతిబింబిస్తుంది. ప్రగతి హాస్పిటల్ కొల్ల రాజమోహనరావు గారి సేవ దృక్పధం వారి వారసత్వంగా అమర్ కూడా అలాంటి సేవ చెయ్యటంలో ముందుంటారు అని హాస్పిటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేసారు.