చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం
గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్
చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త
చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త
ఆయుష్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రిలీజ్ చేసిన మందు - ఆయుష్ -64
ఇప్పుడు మన చిలకలూరిపేట నందు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయుష్ సంస్థ వారు చిలకలూరిపేట యందు మందు పంపిణీకి 6 సెంటర్లలో సిద్ధం చేసారు. అందులో పట్టణంలో 3 సెంటర్లు , నియోజకవర్గం గ్రామాలలో 3 సెంటర్లలో పంపిణి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. వాటి వివరాలు
1) భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం, సుబ్బయ్యతోట - 9885790079
2) ఎ బి.వి.పి మురారి , చౌత్ర సెంటర్, ఆంజనేయ స్వామి గుడి రోడ్ - 9121733191
3) వెల్లంపల్లి శ్రీరాములు ( రాము), పాత పోలీస్టేషన్ రోడ్ , వినాయక గుడి ప్రక్కన - 9848421251
4) అమృత వాటర్ ప్లాంట్, గణపవరం - 9494847172
5) వేగ్నేశ్న అంజిరాజు, యడ్లపాడు - 7799662347
6) భవనం శ్రీనివాసరెడ్డి, చిరుమామిళ్ల - 9989546954
పైన తెలుపబడిన సెంటర్ల నందు ఉచితంగా మందు ఇవ్వబడును. 18-60 సంవత్సరాల వయసు మధ్య వారికే ఈ మందు, అలాగే మెడిసిన్ కావలిసిన వారు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకు రావాలి. అల్లోపతి, హోమియోపతి వాడే వారు కూడా ఈ మెడిసిన్ వాడ వచ్చు. ఈ మందు వాడటం వలన కరోనా నుండి ప్రాణాలతో బయట పడవచ్చు.
అయితే గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, క్యాన్సర్ , గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు , దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిన ఉన్న వారు అర్హులు కారు, అనర్హులు
గమనిక :- కరోనా వచ్చినవారి కుటుంబసభ్యులు, బంధువులు ఎవరినా వచ్చి ఈ మందు తీసుకువెళ్లొచ్చు. కరోనా రోగులకు అనుమతి లేదు. మాస్క్ పెట్టుకొని రావలెను.
భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ గుడిపల్లి భూషయ్య గారు దానికి సంబంధించి రిలీజ్ చేసిన పత్రాన్ని చూడండి.
చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు
ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు
చిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు
చిలకలూరిపేటలో రోజుకి 300 నుండి 350 నో మాస్క్ కేసులు నమోదు అవుతున్నాయి - పట్టణ పోలీస్
ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర
చిలకలూరిపేట - ఆర్ధికంగా చితికిపోయి ఉన్నాము - వ్యాపారాలు లేక కమిషన్ షాపులకి డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపిస్తుంది
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు 31-05-2021 సోమవారం
చిలకలూరిపేట - కరోనా తీవ్రతని లెక్కచెయ్యకుండా పోదు పొద్దునే ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పట్టణ ప్రజలు
ఆనందయ్య కరోనా ముందుకున ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - కరోనా బాధితులు కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, బంధువులకు అనుమతి
చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2
చిలకలూరిపేట మునిసిపల్ కౌన్సిల్ సమావేశ ముఖ్యంశాలు పార్ట్ - 2
కౌన్సిల్ సమావేశం లోని ముఖ్యంశాలు 2 వ పార్ట్
* చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు అంశం మళ్లీ ఒకసారి పరిశీలించాలి అని కొత్త కుమారి,శివ కుమారి గారు కోరారు. రఫాని గారు ఈ అంశం పైనా మళ్లీ చర్చించుకుందాం అని తెలిపారు.
* 37వ వార్డ్ కౌన్సిలర్ శివ కుమారి గారు మాట్లాడుతూ మంచినీటి చెరువుకు ఫెన్సింగ్ వేపించాలి అని తెలిపారు. చెరువులో చేపలు పట్టటం, స్నానం చెయ్యటం చేస్తున్నారు, అలాగే జంతువులు గేదెలు అందులో దిగితున్నట్లు తెలిపారు.
* 100% వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలి అని చర్చించారు
* రాబోయే కాలంలో పట్టణ శివార్లు అయిన జాలయ్య కాలనీ, AMG వెనుక, భావనారుషి నగర్, పసుమర్రు నందు గార్బజి కలక్టర్ ( చేత పోగు చేసే పాయింట్స్ ) ఏర్పాటు చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అక్కడి నుండి జిందాల్ కంపెనీ కి పంపుతున్నట్లు తెలిపారు.
* పండరీపురం కందిమళ్ల రెండవ గేట్ నందు పైప్ లీకేజీ, వాటర్ రంగు మార్పుల పైనా చర్చించారు.
* రోడ్లు, డ్రైనేజీలు, శానిటైజేషన్, కొన్ని ప్రాంతాలలో పందుల వలన సమస్యలు, త్రాగునీరు, పారిశుద్యం [పైన చర్చించారు.
* అమృత్ స్కీమ్ పధకం కోసం 30 కోట్ల రూపాయల బ్యాంకు లోన్ కి వెళ్ళాం అని. వాటి వలన త్రాగు నీరు సమస్య ఉండదు అని తెలిపారు.
* త్రాగు నీరు, శానిటైజేషన్ , పారిశుద్యం కొరకు బడ్జెట్ నందు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
* పట్టణంలోని అన్ని బోరుబావుల మరమ్మతులు, ప్రధాన కాల్వలలోని పూడిక తదితర అంశాలపైనా చర్చించారు.