చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
ఇక పైన రాష్ట్రంలో ప్రతి నెల ప్రతి ఇంటి నుండి నగరాలలో 120, మునిసిపాలిటీలలో 90, పంచాయితీలలో 60 రూపాయల వసూళ్లు - త్వరలో ఆమోదం
చిలకలూరిపేట - నిత్యం రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న తిమ్మాపురం ప్రాంతః ప్రజలు - తాజాగా మరొకరు మృతి
చిలకలూరిపేట - మందుబాబుల వికృత చేష్టలు
చిలకలూరిపేటలో కరొనతో మహిళా ANM మృతి
చిలకలూరిపేటలో ఫుల్ లాక్ డౌన్ దిశగా వర్తక సంఘాలు !!!
చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు
చిలకలూరిపేట ప్రజలకు మన న్యూస్ వెబ్సైటు కు 1లక్ష వ్యూస్ వచ్చిన సందర్భంగా అందరికి ధన్యవాదాలు
చిలకలూరిపేటలో కోవిడ్, నాన్ కోవిడ్ మృతుదేహాలు తరలించేందుకు ఛార్జీలు నిర్ణయించిన రవాణా శాఖ
చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు
చిలకలూరిపేట కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించిన తసీల్ధార్ సుజాత గారు
చిలకలూరిపేటలో ప్రముఖ వైద్యశాల అయిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సోమవారం నాడు తసీల్ధార్ సుజాత గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా గురించి, ఒకొక్క బెడ్ కు ఎంత వసూళ్లు చేస్తున్నారు. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పైన ఫిర్యాదులు రావటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తసీల్ధార్ సుజాత గారితో పాటుగా ఎంపీడీఓ, ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు
ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు
ఇలా చేస్తే చిలకలూరిపేటలో మరణాలను తగ్గించవచ్చు
పట్టణంలో రోజురోజుకి మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనా యువకులు, చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అందరిని తీసుకువెళ్లిపోతుంది. ఇది ఎలా ఉంటే ఏదో స్టేట్ గవర్నమెంటో , లేదా సెంట్రల్ గవర్నమెంటో సహాయం చేసే వరకు మనం వేచి చూస్తే మన అనుకున్న వాళ్లకు అందరూ దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. దీని కోసం ఒక చిన్న ప్లాన్ నచ్చితే పాటించండి.
చిలకలూరిపేటలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో ఆర్ధికంగా బలపడిన వాళ్ళు ఉంటారు, వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ ప్లాన్ అంతా ఆధారపడి ఉంటుంది. ప్రతి వార్డు కౌన్సిలర్ వాళ్ళ వాళ్ళ వార్డులలో ఆర్ధికంగా ఉన్న వాళ్ళ దగిర నుండి వార్డు మొత్తం మీద ధాతల రూపంగా డబ్బులు పోగుచేసి ( ఎవరిని ఇబ్బంది పెట్టకుండా). అన్నదానం, రక్త దానం, గోదానం, కన్నా ప్రాణ వాయువు దానం ముఖ్యం అని తెలియ చేయండి. ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు వార్డుకి 5 వచ్చేలా కొనాలి. మనం రోజుకి ఆక్సిజెన్ లేక పేట మొత్తం మీద 10 మంది చనిపోతున్నారు అనుకుందాం. 38 వార్డులు * 5 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు = 190 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు వస్తాయి. వీటి వల్ల చాలా మందిని రక్షించిన వాళ్ళము అవుతాము.
ఈ అంశాన్ని శాసనసభ్యురాలు గారికి కానీ, మునిసిపల్ కమిష్నర్ గారికి కానీ, ఛైర్మెన్ గారికి కానీ వివరించండి. తప్పుగా అనుకోకుండా మొన్న విజయోత్సవ ర్యాలీ ఖర్చు మొత్తం మునిసిపల్ బిల్లు పెట్టి ఆమోదించారు. అలాగే దీన్ని కూడా అలాగే చేసి వార్డుకి మునిసిపాలిటీ పరంగా 2 ఆక్సిజెన్ కాన్సన్ట్రేషన్లు ఇచ్చిన మిగిలినవి దాతల రూపంలో తీసుకొని వార్డులోని ప్రజలకు ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడినవాళ్ళం అవుతాం. ఎన్నికలలో చాల డబ్బు ఖర్చు చేస్తున్నాం, ఎన్నో ఎన్నో దానాలు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి.
రాష్ట్రంలో ఏ ప్రాంతం వారు అయిన ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాల ఆర్గనైజషన్స్, స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, కమిటీలు, చాలా ఉన్నాయి. వాళ్ల్లు అందరూ ఒకసారి ఈ ప్రయత్నం చేసి చూడండి.
ఒక్క వార్డు లో అయినా ఈ ప్లాన్ అమలు చేస్తారు అని ఆశిస్తూ - CHILAKALURIPET SPEED NEWS
చిలకలూరిపేట ASI శ్రీరాములు అనారోగ్యంతో మృతి
నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్
నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి !- చిలకలూరిపేట నోడల్ అధికారి గోపీనాయక్
చిలకలూరిపేట ( 52 ఎకరాలలో) టిడ్కో వసతి సముదాయం నందు కరోనా వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు గా ఉన్న వాళ్లు అందరూ ఉచితంగా సేవలు చేస్తుంటే, సామాజిక మాధ్యమాలలో ఎంట్రీ ఫీజు 1000 చెలించాలి అని అబద్దపు ప్రచారం చేస్తున్నారు అని డాక్టర్ గోపి నాయక్ గారు ఆవేదన వ్యక్తం చేసారు. నిస్వార్ధంగా పని చేస్తుంటే మా పైన ఈ అభియోగాలు ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలను సామజిక మాధ్యమాలలో ప్రచారం చేసేవారి పైన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారికి ఫిరియాదు చేసాము అని తెలియచేసారు. పగలు రాత్రి తేడా లేకుండా మంచి భోజన సదుపాయాలు, అందజేస్తున్నామని, కరోనా బారిన పడినవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలియచేసారు. అలాగే గతంలో 500 మందికి ఇక్కడ వైద్య సదుపాయాలు అందజేశాము, కానీ ఇప్పుడు 200 మందికి మాత్రమే అనుమతి అవి కూడా ఫుల్ అయ్యాయి అని తెలిపారు. త్వరలో ఇంకో 300 మందికి సదుపాయాలు ఎర్పాటు చేస్తాము అని తెలియచేసారు .
అలాగే కరోనా టెస్టు చేపించిన వారికీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ లో కానీ ID నెంబర్ ఇస్తారు. ఆ ID నెంబర్ ఉన్న వాళ్ళని అనుమతి ఇస్తున్నాము అని తెలిపారు. ప్రైవేట్ టెస్టులు చేసి ID నంబర్లు ఇవ్వకుండా గవర్నమెంట్ కు లెక్క చెప్పకుండా ప్రజల దగిర డబ్బులు ఎక్కువగా దండుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.