చిలకలూరిపేట నుండి గుంటూరు జాతీయ రహదారి పైనా తిమ్మాపురం వద్ద రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం వలన ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. తాజాగా ఆదివారం ( ఈ రోజు ) విజయవాడ నుండి ఒంగోలు వెళ్తున్న ట్రాలీ ఆటో తిమ్మాపురం వద్ద డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పొదిలికు చెందిన నరసయ్య (80) అక్కడే మృతి చెందారు. మిగిలిన వారికీ గాయాలవ్వగా వారిని హాస్పిటల్కు తరలించారు.
నిత్యం ఏదో ఒక ప్రమాదంతో ఆయా ప్రాంతః వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు. చిలకలూరిపేట నుండి గుంటూరు మధ్యలో తిమ్మాపురం జంక్షన్ వద్ద మాత్రమే రోడ్డు వెడల్పు తక్కువగా, ప్రమాదాలకు అనుకూలంగా ఉంటుంది. అధికారులు దీని పైనా ద్రుష్టి పెట్టి తగుచర్యలు తీసుకోవాలి అని ఆ ప్రాంతః వాసులు తెలిపారు.
No comments:
Post a Comment