అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నాయకుడిని తిడుతున్నవాళ్ళని వదిలేసి వైద్యధికారులు ప్రకటించిన వైరస్ గురించి మాట్లాడిన చంద్రబాబు పైనా కేసు పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము - ప్రత్తిపాటి
చంద్రబాబు నాయుడి పైన పెట్టిన కేసును తీవ్రంగా ఖండిస్తున్నాము- పుల్లారావు , వివరాల్లోకి వెళ్తే
N - 440K అనే ప్రమాదకర కరోనా వైరస్ ఏపీలో కనిపించింది అని చంద్రబాబు నాయుడు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అని ప్రతిపక్షనేత చంద్రబాబు గారి పైన కేసు నమోదు చేసారు. అయితే రాష్ట్రంలో రెమిడీసీవర్ , ఆక్సిజెన్ సమకూర్చటంలో విఫలం అయిన జగన్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మార్చటానికి కేసులు పెట్టి వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు.
3 సార్లు ముఖ్యమంత్రి అయిన 40 సంవత్త్సరాలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని మీడియాలో ఒక మంత్రి ఇష్టం వచ్చినట్లు అసభ్యపదజాలంతో దూషిస్తున్న వారిని వదిలివేసి , వైద్యాధికారులే కొత్త వైరస్ ఏపీలో ఉన్నది అని ధ్రువీకరించిన వార్త ప్రస్తావన చేసిన చంద్రబాబునాయుడు పైన కేసు పెట్టటం ఏంటని ప్రశ్నించారు. ఆక్సిజెన్ లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వారి పైన ద్రుష్టి పెట్టాలి అని తెలిపారు.
No comments:
Post a Comment