కరోనా వలన రాష్ట్రం మొత్తం రెండు వారాలపాటు కర్ఫ్యూని విధించిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయానికి అనుసంధానంగా ఉండే దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు పూర్తి మినహాయింపు ఇవ్వకుండా సమయంలో మార్పులు చేసింది. రేపు అనగా సోమవారం నుండి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచుకోవచ్చు, అమ్మకాలు కొనసాగించవచ్చు అని తెలిపినది. కనుక రేపటి నుండి ఎరువులు మందుల దుకాణాలు, పురుగుల మందుల దుకాణాలు , వ్యవసాయ పనిముట్లు అమ్మే షాపులు, వాటిని రిపేరులు చేసే షాపులు 7 to 6 వరకు తెరుచుకోనున్నాయి.
కరోనా నియమాలు పాటిస్తూ అమ్మకాలు కొనసాగించాలి అని తెలియచేసారు.
No comments:
Post a Comment