ముస్లిం సోదరుల ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసము సంధర్బముగా పట్టణములోని గోవెల్ బ్యాటరీస్ చిలకలూరిపేట యాజమాన్యం అయిన బొబ్బిళ్ళ ( నిమ్మకాయల ) ప్రసాదు గారి ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. 150 మందికి వారానికి సరిపడా కూరగాయలు, ఉల్లిపాయలు, 2 కేజీల బాసుమతి రైస్, నూనె పాకెట్స్, ఇతర పదార్ధాలు అందజేశారు. ఈ సంధర్భంగా ప్రసాదు గారు మాట్లాడుతూ కరోనా కారణముగా ఈ సంవత్సరం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకోవాలి. సాయంత్రం ప్రార్థన సమయాలలో మాస్క్ ధరించాలి అని కరోనా నియమాలు పాటిస్తూ పండుగని జరుపుకుందాం అని తెలిపారు. పట్టంలోని రామకృష్ణ థియేటర్స్ పక్కనే ఉన్న గోవెల్ బ్యాటరీస్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదు గారు, నాయుడు హనుమంతురావు గారు మరియు ప్రసాదు గారి మిత్రులు, పట్టణంలోని బైక్ మెకానిక్స్ ,కారు మెకానిక్స్ పాల్గొన్నారు.
Home »
» చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
చిలకలూరిపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన గోవెల్ బ్యాటరీస్ నిమ్మకాయల ( బొబిళ్ళ ) ప్రసాదు గారు
No comments:
Post a Comment