చిలకలూరిపేట నియోజకవర్గం :- 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
చిలకలూరిపేట నియోజకవర్గం 40 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్ సత్తా పార్టీ నాయకులు
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐకు అందజేసిన లోక్ సత్తా పార్టీ నాయకుపాల్గొన్నారు.
చిలకలూరిపేట:- రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ సీఐ రాజేశ్వరరావుకు లోక్ సత్తా పార్టీ నాయకులు అందజేశారు.
* కళ్యాణి సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, నరసరావుపేట సెంటర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురు, విధిగా ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
* వేకువజాము వేళలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నందున విధిగా ఆయా వేళల్లో పైన పేర్కొన్న నాలుగు ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు విధులలో ఉండే లాగున ఏర్పాటు చేయాలి.
* రోజు రోజుకి ఇబ్బడిముబ్బడిగా ట్రాఫిక్ పెరుగుతున్నందున విధిగా చిలకలూరిపేట కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలి.
* డ్రైవర్ల వ్యక్తిగత అవసరాల కోసం వాహనాల పార్కింగ్ ను ఊరి చివరన స్థలాన్ని కేటాయించడం కానీ, మరేదైనా నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలను నిలుపుకొనుటకు అవకాశం కల్పించాలి.
* సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురై పాడైనందున మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవలయును.
* వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు నరసరావుపేట సెంటర్, కళ్యాణి సెంటర్ లలో నడిచి రోడ్డు దాటే వారికోసం ప్రత్యేకముగా నాలుగు వైపుల నుండి రోడ్డు దాటు అవకాశం కల్పించాలి.
* తిమ్మాపురం సెంటర్ నుండి గణపవరం వాగు వరకు డివైడర్ పై మొక్కల కుండీలు ఏర్పాటు, లేదా ఏదైనా ఒక రేకును వాహనాల లైటింగ్ ఒకదాని మీద ఒకటి పడకుండా ఏర్పాటు చేయాలి.
* హైవే పెట్రోలింగ్ వారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షించ గలగాలి.
* చిలకలూరిపేట హైవే పై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున, రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పనిచేసే వారితో రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలి.
* ఆగి ఉన్న లారీలను 'ఢీ' కొట్టడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో వేకువజాము వేళల్లో లారీలను హైవేపై ఆపకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
పై సూచనలను కలిగిన వినతిపత్రాన్ని సిఐ రాజేశ్వరరావుకు కు అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు మాదాసు భానుప్రసాద్
లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్
ఈ కార్యక్రమంలో మురికిపూడి ప్రసాద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పటేల్, సాంబయ్య, శిఖాకొల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు
చిలకలూరిపేట:- రేషన్ డీలర్లు ఖాళీ బియ్యం గోతాలను బయట విక్రయిస్తే వారిపై కేసు నమోదు చేస్తాము - డిప్యూటీ తాసిల్దారు నాగమల్లేశ్వరరావు
చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-202 శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 09-10-2021 శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
బొబ్బిలి సత్యనారాయణ వీధి - 1
సుధా వారి పాలెం - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను
చిలకలూరిపేట:- హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ రాజేశ్వరరావు - ప్రతి నెల నా వంతు సాయాన్ని అందజేస్తాను
చిలకలూరిపేట రోష్ని సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐ.వి బాధిత పిల్లలకు ప్రతినెల పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టౌన్ సిఐ రాజేశ్వరరావుగారి చేతుల మీదగా పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని తెలిపారు. అలాగే తన వంతు సాయాన్ని ప్రతి నెల అందజేస్తానని తెలిపారు. మంచిగా చదువుకొని పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేసే ప్రాంతాలు
చిలకలూరిపేట: రేపు అనగా 09-10-21 రెండోవ శనివారం నరసరావుపేట 132/33 కేవీ సబ్ స్టేషన్ , నరసరావుపేట ఫీడర్ మరమత్తులు కారణంగా
నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ వారిపాలెం, కనపర్రు, బసికాపురం, మైనంపాడు, కొత్తపాలెం ST కాలనీ, ఇర్లపాడు,ఎండుగుంపాలేం, బుక్కా పురం, రాజుగారి పాలెం,గున్నవారిపాలెం, గోవిందపురం, కొత్తపాలెం గ్రామాలకు గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు , మరియు చిలకలూరిపేట మండలంలోని కావూరు గ్రామంలోని పరిశ్రమల తో పాటు
మద్దిరాల, పసుమర్రు, బొప్పూడి సబ్ స్టేషన్ లో మరమత్తులు కారణంగా చిలకలూరిపేట రూరల్ మండల. పరిధిలోని మద్దిరాల, పోతవరం,రా జాపేట, యడవల్లి, మురికిపూడి, తాతపూడి, ఈటి,కట్టుబడివారిపాలెం, గోపాలం వారి పాలెం, బోప్పూడి,బోప్పూడి హైవే,రామచంద్రాపురం, చిన పసుమర్రు, గుదేవారి పాలెం, మనుకొండవారిపాలెం, మిట్టపాలెం, కొత్తపాలెం, నాగబైరవారిపాలెం, గొరంట్లవారిపాలెం, దండమూడి, ఉప్పలపాడు గొట్టిపాడు గ్రామాలకు గృహ, వాణిజ్య, పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు సి.హెచ్. రాంభోట్లు, డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.
నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన
నా పై MPTC కుట్రలు,వేధింపులకు పాల్పడుతున్నాడు - చిలకలూరిపేట మహిళ వాలంటీర్ ఆవేదన
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలోని ఒకటో వార్డు మహిళ వాలంటీర్ పై ఎంపీటీసీ వేధింపులకు పాల్పడుతున్నారు అని సదరు మహిళ వాలంటీర్ సీఎం జగనన్నకు ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. తన పేరు చెవుల యామిని నాదెండ్లలో ఒకటో వార్డు వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నానని.అయితే అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ అయినా గుడికందుల ఎల్లారావు తనపై కుట్రలు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. దళిత వర్గానికి చెందిన తాను టిటిసి పూర్తి చేసి వాలంటర్ పనిచేస్తూ వచ్చే ఐదు వేల జీతంతో ఇంట్లో వాళ్ళ పై ఆధారపడకుండా డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు. తల వాలంటరీ ఈ పోస్ట్ ను తీసివేసి తన స్థానంలో ఎంపీటీసీ ప్రియురాలి కుమార్తెను వాలంటరీ చేయాలనే ఉద్దేశంతో తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఉద్దేశంతో తాను సరిగ్గా పని చేయట్లేదు సమయానికి స్పందించలేదు అనే అభియోగాలతో సంతకాలు సేకరించి ఎంపీటీసీ తనపై కుట్ర పూరితంగా ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు.
వీడియో కోసం క్రింద చూడండి
చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని
చిలకలూరిపేట - 1319 డోక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ - MLA విడుదల రజిని
చిలకలూరిపేట:- 1319 డ్వాక్రా సంఘాలకు వైయస్సార్ ఆసరా రెండో విడత చక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడదల రజినితో పాటుగా వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. 11 సెప్టెంబర్ 2020 న మొదటి విడతగా చెక్కులు పంపిణీ చేయగా రెండో విడతగా శుక్రవారం నాడు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1319 సంఘాలకు 10 కోట్ల 86 వేల 788 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ జగనన్న పాదయాత్రలో ప్రజల కష్టాలను చూస ఆర్థికంగా ముందుకు వెళ్లటం కోసం డోక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారని అని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని, కమిషనర్ రవీంద్ర, మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, మెప్మా సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-202 బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో నేడు 06-10-2021 బుధవారం నాడు మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి.
వాటి వివరాలు.
RTC బస్టాండు సమీపంలో - 2
సుబ్బయ్యతోట లో - 1 గా నమోదు అయ్యాయి.
మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని
మహిళలకు లబ్ది చేకూర్చే ప్రభుత్వం మన ప్రభుత్వం - MLA విడుదల రజిని
చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని గణపవరం గ్రామం సొసైటీ బ్యాంకు ఆవరణలో మంగళవారం డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏకంగా 50 గ్రూపులకు రూ.5 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపవరం సొసైటీ బ్యాంకు పరిధిలో గణపవరం, అప్పాపురం, కనపర్తి, ఇర్లపాడు, ఆవిశాయపాలెం గ్రామాలు ఉన్నాయని, ఈ ఐదు గ్రామాల్లో కలిపి మొత్తం 563 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడిచే జీడీసీసీబీలోనే వీరంతా రుణాలు పొందాలనే గొప్ప సంకల్పంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా రుణాలకు అత్యల్ప వడ్డీ కేవలం 9 శాతం వసూలు చేసేది ఒక్క జీడీసీసీ బ్యాంకు మాత్రమేనని, ఇతర బ్యాంకులు 11, 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని వివరించారు. అందుకే డ్వాక్రా గ్రూపులు సొసైటీ బ్యాంకులకు మారడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గణపవరం గ్రామంలో ఈ విషయంలో విజయం సాధించగలిగామని చెప్పారు. ఈ పరిధిలోని దాదాపు 100 గ్రూపులను ఇప్పటికే ఇతర బ్యాంకుల నుంచి గణపవరం సొసైటీ బ్యాంకుకు మార్చగలిగామని పేర్కొన్నారు. ఇది నిజంగా మానిమేటర్ల కష్టానికి ప్రతిఫలమని చెప్పారు. సొసైటీల్లో డ్వాక్రా గ్రూపులకు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇస్తారని చెప్పారు. మహిళలు ఎంత అడిగితే అంత రుణం మంజూరయ్యేలా తాను జీడీసీసీ బ్యాంకు చైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు వరంలాంటి పాలన అందుతోందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీని చేసి చూపుతున్న ప్రభుత్వం తమదన్నారు. ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా తొలి విడత నగదును గతేడాది మహిళామ తల్లులకు అందిందని చెప్పారు. రెండో విడత డబ్బులు కూడా రేపు గురువారం రోజున ఆడపడుచులకు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణాలపై ఏటా వడ్డీ కూడా జమ చేస్తోందని చెప్పారు. ఇప్పటికే రెండేళ్లకు కలిపి రూ.2,200 కోట్లకుపైగా వడ్డీని తమ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందజేసిందన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇలా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కూడా మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నాయని చెప్పారు. రేషన్ కార్డులు సైతం మహిళల పేరుతోనే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇస్తున్న ఇళ్ల స్థలాలు, కడుతున్న ఇళ్లు అన్నీ మహిళల పేర్లతోనే ఉంటున్న విషయం మనందరికీ గర్వకారణమని తెలిపారు.
మా ప్రభుత్వ హయాంలో రూ.20.23 కోట్ల నిధులు
గణపవరం సొసైటీ అధ్యక్షుడు కాట్రు రమేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సొసైటీ నుంచి రూ.20.23 కోట్లు అందజేసినట్లు తెలిపారు. తమ త్రిసభ్య కమిటీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల రుణాలు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,కొమరవల్లి పాడు సొసైటీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, కౌన్సిలర్లు తులం సుధాకర్,పిల్లి సాగర్,ఆదం వలి నాయకులు కెల్లంపల్లి సుందరరావు, గాలి బుచ్చయ్య,బొప్పూడి రామారావు,బొంతా ప్రభుదాస్,మలిశెట్టి సుబ్బారావు,మండలనేని వెంకటేశ్వర్లు,ఆముదాలపల్లి అంజి,మరియు పలువురు పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో పిడుగుపాటు - ఇద్దరికి తీవ్రగాయాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం కారుచోల గ్రామం వద్ద పిడుగుపాటు వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారుచోల పరిధిలోని పొలాల్లో మిర్చి పంటలు కలుపు తీస్తున్న ఇద్దరు మహిళలకు నాలుగడుగుల దూరంలో పిడుగు పడటంతో నందిగం రావమ్మ కవిత అనే అత్తా కోడలు గాయాల పాలయ్యారు.
పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు
పెట్రోల్ & డీజిల్ భగభగ - గ్యాస్ సిలిండర్లపై మళ్లీ బాదుడు
06-10-2021 అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు రాకెట్ లాగా ఆకాశంలో దూసుకు వెళ్తుంటే దానికి తోడు తాజాగా వంట గ్యాస్ LPG పై 15 రూపాయలు పెంచుతున్నట్లు పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై 25 రూపాయలు కమర్షియల్ 19 కేజీల సిలిండర్లపై 43 రూపాయలు పెంచారు. అయితే తాజాగా డొమెస్టిక్ సిలిండర్లపై 15 రూపాయలు పెంచుతున్నట్లు తెలిపాయి. ఇటు పెట్రోల్ డీజిల్ పై 33 పైసలు పెంచుతున్నట్లు ఇంధన శాఖ తెలియజేశారు. పెరిగిన సిలిండర్ల ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ పెరిగే, పెట్రోల్ & డీజిల్ గ్యాస్ సిలిండర్ల ధరలు వలన సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి
భర్త మరణ వార్త విని గుండెపోటుతో భార్య మృతి
గంగవరపు చిన్న పాపారావు (61) అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందిన వార్త విని భార్య రమాదేవి (57) గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే ! ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబటిపూడి గ్రామానికి చెందిన చిన్న పాపా రావు & రమాదేవి భార్యాభర్తలు. అయితే గత కొంత కాలంగా పాపారావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం పాపారావు చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఈరోజు పాపారావు తీవ్ర అస్వస్థతకు గురిఅవ్వటంతో వెంటనే కూతురు అల్లుడు పాపారావును గుంటూరులోని హాస్పటల్కు తరలించారు. అప్పటికే పాపారావు మార్గమధ్యంలోనే మృతి చెందారు. దీంతో కుమార్తె తండ్రి మరణ వార్తను తల్లికి ఫోన్లో చెప్పడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెనూ స్థానిక హాస్పటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. తండ్రి చనిపోయిన రెండు గంటల్లో తల్లి చనిపోవడంతో కూతురు కన్నీరు మున్నీరయ్యారు.
*Advertisement*
పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావు
చిలకలూరిపేట... పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా రోడ్డుకిరువైపులా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు - టౌన్ సిఐ రాజేశ్వరరావు
మంగళవారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అర్బన్ సిఐ రాజేశ్వరరావు పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాత పశువుల సంత నుండి చౌత్ర సెంటర్ వరకు ఉన్న డబల్ రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వాహనాలను పార్క్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉండే హోటళ్లు ఇతర దుకాణాలకు వచ్చేవారు వారి వాహనాలను ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా పార్క్ చేయటం వలన ట్రాఫిక్ సమస్య కలుగుతుందని అందువలన తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలి అని తెలిపారు.