మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp
Showing posts with label చిలకలూరిపేట న్యూస్. Show all posts
Showing posts with label చిలకలూరిపేట న్యూస్. Show all posts

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - 2021-2022 విద్య సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ కు వచ్చేశాయి. మంగళవారం సాయంత్రం సమయంలో పాఠ్యపుస్తకాలు తీసుకొని APSRTC కార్గో వాహనం RVSCVS హైస్కూల్ కి చేరాయి. ఇక్కడ నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపినీ చేయనునంట్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ( MEO ) ఎల్. లక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ నాకు చేరుకున్నాయి. ఇక్కడ నుండి త్వరలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండు సంవత్సరాలు చదువుకి దూరం అయ్యారు. ఈ సంవత్సరం అయిన కరోనా తగ్గి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలి అని కోరుకుందాం. 

https://chilakaluripetspeednews.blogspot.com/





































Share:

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్

చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి...  -  ఇద్దరు నిందితులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు. 

 నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా  ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.

కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.   

































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు మొత్తం 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి

మార్కండేయనగర్ లో - 3

సాలిపేట లో - 1

పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

వేలూరు గ్రామంలో - 1

రాజాపేట గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 















































Share:

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ అతి సమీపంలో పేకాట నిర్వహిస్తునట్లు వచ్చిన సమాచారంతో టౌన్ SI అజయ్ బాబు దాడులు నిర్వహించారు. హనుమయ్యమ్మ సత్రం పక్కనే ఉన్న విగ్నేశ్వరా కారు ట్రావెల్స్ వద్ద ఈ పేకాట నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 మొబైల్స్, 3500 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారి పైన కేసు నమోదు చేసారు.  

























Share:

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు

2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో  - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు 

https://chilakaluripetspeednews.blogspot.com/`

చిలకలూరిపేట - 2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 450 పోస్టులు రిలీజ్ చేసింది. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నో రోజులుగా SI ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే మీరు వదిలిన పోస్థులను సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యాము అని అంటున్నారు. అందులో మన చిలకలూరిపేట పట్టణంలోని కొంత మంది అభ్యర్థులు ఏమి అంటున్నారో చూదాం. 

మనోహర్ నాయుడు :- నా పేరు మనోహర్, గత ఎన్నిక ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి ఇయర్ 6000 పోస్టులు భర్తీ చేస్తూ 4 సంవత్సరాలలో 24000 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. నేను బ్యాంకు ఎంప్లాయ్ పోలీస్ జాబ్ కోసం అని జాబ్ వదిలేసి పోలీస్ అవ్వటం కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుంటున్న, అయితే మొన్న జాబ్ క్యాలెండర్లో 450 పోస్టులు చూసి తీవ్ర నిరాశకిగురి అయ్యాను, అటు జాబ్ లేక  ఇటు పోలీస్ జాబ్ పైన నమ్మకం లేక సతమతం అవుతున్నాను.

కిరణ్ :- నా పేరు కిరణ్ హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్న, 8 లక్షల మందికి 450 పోస్టులు ఏంటి అసలు 13 జిల్లాలకు ఎన్ని కానిస్టేబుళ్లు, ఎన్ని SI పోస్తులు వస్తాయి. అసలు దీనికన్నా కూడా పోస్టులు వదలకపోవటమే మంచిది. 6000 పోస్టులు అన్నారు ఇక్కడ మాత్రం 450 వదిలారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. 

శంకర్ నాయక్ :- అన్ని వదిలేసి పోలీస్ జాబ్ పైన ద్రుష్టి పెట్టి కష్టపడుతుంటే మీరు రిలీజ్ చేసిన పోస్టులు చూసి మా ఆశలు పైన నీళ్లు చల్లినట్లు ఉంది. 

అమానుల్లా :- జగన్ వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టుకొంటున్నారు. మాలాంటి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారు. దయ చేసిన జీవో ని మార్చి మళ్లీ కొత్త జీవోలో మినిమమ్ 5000 పోస్టులు అయిన నిరుద్యోగులకు అందించండి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి. 

రవికాంత్ :- మేము ఎంత కష్టపడినా 450 పోస్టులు 8 లక్షల మంది రాస్తే అందులో మనకి రావటం అంటే కష్టం. పోస్టుల సంఖ్య పెంచండి. 

 ఇలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోజు మంచినీటి చెరువు పైనా , చెరువు రోడ్డు, CR కాలనీ పార్క్, బొప్పూడి - చిలకలూరిపేట రోడ్డు, గొర్రెల సంత రోడ్డులో రన్నింగ్ చేస్తున్న కష్టపడుతుంటారు మన పేట అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు తగిన పోస్టులు రిలీస్ చేసి వారి భవిషత్ మంచి బాటలు వెయ్యాలి అని కోరుకుందాం. 
 













































































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 21-06-2021,సోమవారం నాడు మొత్తం 10 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట మండల గ్రామంలో 9 కేసులు నమోదు అయ్యాయి. 

మురికిపూడి గ్రామంలో - 9 

మురికిపూడి గ్రామంలో రెండు కుటుంబాలలో ఈ తొమ్మిది కేసులు నమోదు అయ్యాయి. ఒక కుటుంబంలో 5 మరో కుటుంబంలో 4 గా నమోదు అయ్యాయి. 



చిలకలూరిపేట పట్టణంలో 1 కేసు నమోదు అయింది. 

సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యింది. 






























Share:

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సినీ నటుడు శివాజీ - గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహన కోసం స్వగ్రామంలో వ్యాక్సిన్ తీసుకుంటున్నాను 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - సినీ నటుడు శివాజీ చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామం అయిన గణపవరం నందు పీహెచ్సి నందు సోమవారం మధ్యాహ్నం నాడు వాక్సిన్ తీసుకున్నారు. వివరాలోకి వెళ్తే  శివాజీ స్వగ్రామం చిలకలూరిపేట నియోజకవర్గం అయిన నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామం అయితే గ్రామాలలో వ్యాక్సిన్ పైన అవగాహనా పెంచటం కోసం ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ తీసుకునట్లు అయన తెలిపారు. సోమవారం రోజున మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ కీర్తి మయూరి గారు శివాజీకి వ్యాక్సిన్ వేశారు. అనంతరం డాక్టర్ గోపీనాయక్ తో మాట్లాడి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి అని కరోనా నుండి ప్రాణాలతో బయటపడాలి వ్యాక్సిన్ ఒక్కటే మనకి ఆయుధం అని తెలిపారు. 





















































Share:

సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు

సోమవారం రోజు ఎండ దెబ్బకి విలవిల లాడిన చిలకలూరిపేట పట్టణ వాసులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ రోజు పట్టణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరింది.ఉదయం సాధారణ ఉష్ణోగ్రతతో మొదలై మధ్యాహ్నం అయ్యే సరికి 40 డిగ్రీలకు చేరింది. ఈ రోజు నుండి కర్ఫ్యూ సమయం తగ్గించిన ప్రజలు ఎవరు రోడ్ల పైన కనపడలేదు. NRT సెంటర్ , చౌత్ర,మార్కెట్ సెంటర్లు ఎండ దెబ్బకి బోసిపోయాయి. ఈ రోజుకి మాత్రం 40 డిగ్రీలు రేపటి నుండి మూడు రోజుల పాటు వరుసగా 39,38,37 డిగ్రీలు తరువాత నుండి ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. 


















































Share:

చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు

చిలకలూరిపేట పట్టణంలో ప్రధాన రహదారిలో డిస్కో లైట్లను తలపిస్తున్న వీధి లైట్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్ నుండి పాత పశువుల సంత వరకు ఉన్న రహదారి మధ్య ఉండే స్ట్రీట్ లైట్స్ డిస్కో లైట్లను తలపించాయి. ఆదివారం నాడు సాయంత్రం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. పూర్తిగా ఆగిపోయిన కానీ ఎలాగో వెళ్తాము కానీ ఎలా వెలుగుతూ ఆగుతూ ఉంటే రోడ్ల పైన వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఒక వాహనదారుడు తెలిపాడు. అతను చిలకలూరిపేట నుండి కావూరి గ్రామం వెళ్తుండగా ఎదురుగా గేదె రావటంతో తృటిలో ప్రమాదం తప్పింది అని తెలిపారు. 

డిస్కో లైట్లను తలపిస్తున్న రోడ్డుకి సంబందించిన వీడియో 

















































Share:

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన

చిలకలూరిపేటలో సుప్రీం కోర్టు జడ్జి లావు నాగేశ్వరావు గారి పర్యటన 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం నాడు సుప్రీం కోర్టు జెడ్జి లావు నాగేశ్వరావు గారు పర్యటించారు. పట్టణంలోని సుభాని నగర్ నందు ఉన్న లాహిరి పిల్లల హాస్పిటల్ నందు తేళ్ల సుబ్బారావు గారు ఏర్పాటు చేసిన చిన్న వేడుకలలో అయన పాల్గొన్నారు. లావు నాగేశ్వరావు గారి స్వగ్రామం పెదనందిపాడు కావటంతో చిలకలూరిపేటతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు.నాగేశ్వరావు గారి పర్యటనతో ఆ ప్రాంతం అంతా పోలీస్ బందోబస్తుతో నిండిపోయింది. 
























































































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 20-06-2021,ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 3 కేసులు నమోదు అయ్యాయి. వాటిలో వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కేసులు  నమోదు అయ్యాయి 

కొమరవల్లి పాడు లో - 2

మద్ది నగర్ లో -1

చిలకలూరిపేట మండల గ్రామాల ప్రాంతాలలో ఎటువటిని కేసులు నమోదు కాలేదు 























Share:

చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం

చిలకలూరిపేట - అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన MLA - ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాం

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అమీన్ సాహేబుపాలెం ST కాలనిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను MLA విడదల రజిని పరామర్శించారు. MLA రజిని మాట్లాడుతూ ఇలాంటి అగ్ని ప్రమాద జరగటం చాల దురదృష్టకరం అని, ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సమయంలో ఆమె బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి 5000 రూపాయల చొప్పున ఆరు కుటుంబాలకు 30,000 రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంలో MLA తో పాటుగా గ్రామా పార్టీ అధ్యక్షుడు గుర్రం ఉపేంద్ర , మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రామా సర్పంచ్ కామినేని లలిత , కాట్రగడ్డ మస్తాన్ , వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు 

































 
Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం - బూడిదపాలైన 6 గుడిసెలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని అమీన్సాహెబ్పాలెం గ్రామము  నందు అగ్ని ప్రమాదం సంభవించింది. అమీన్సాహెబ్పాలెం ST కాలనీ లోని రామయ్య అని వ్యక్తి నీరు కాగబెట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. నీరు కాగబెట్టుకుంటుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి రామయ్య గుడిసె తగలబడింది. వెంటనే పక్కనే ఉన్న గుడిసెలకు అంటుకున్న నిప్పు రవ్వలు మొత్తం 6 గుడిసెలు బూడిదపాలైయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు ఈలోపే చాల ఆస్థి నష్టం జరిగింది. రమేష్, వెంకటేశ్వర్లు, చెంచమ్మ, నాగమలేశ్వరరావు యొక్క గుడిసెలు తగలబడ్డాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాధచాయలు అలుముకున్నాయి. 




























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 19-06-2021 శనివారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 19-06-2021 శనివారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 19-06-2021 శనివారం నాడు మొత్తం 14 కేసులు నమోదు అయ్యాయి. వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 3 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

సుధా వారిపాలెం లో - 1

రెడ్ల బజార్ లో - 1

పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామంలో 11 కరోనా కేసులు నమోదు అయ్యాయి 

గోవిందపురం గ్రామంలో - 2

వేలూరు గ్రామంలో - 3

ఎడవల్లి గ్రామంలో - 2

మురికిపూడి గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 






































































Share:

చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి

చిలకలూరిపేట - RTC బస్టాండ్ వద్ద రోడ్డు ఆక్సిడెంట్ - ఒకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని RTC బస్టాండ్ వద్ద రోడ్ ఆక్సిడెంట్. బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తి ని గుంటురు నుండి చిలకలూరిపేట వెళ్తున్న లారీ గుద్దటంతో ఆ వ్యక్తి లారీ ముందు చక్రం కింద పడి నడుము భాగం నుజ్జు నుజ్జు అయింది. స్థానికుల సమాచారం తో అక్కడికి వచ్చిన మార్టూరు 108 వాహనం గాయపడిన వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మార్గం మధ్యలో అయన మరణించినట్లు తెలిపారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు 















































Share:

చిలకలూరిపేట - ప్రత్తిపాటి విలేకర్ల సమావేశానికి కౌంటర్ గా వెంటనే విలేకర్ల సమావేశం ఎర్పాటు చేసిన వైస్సార్సీపీ నాయకులు

చిలకలూరిపేట - ప్రత్తిపాటి విలేకర్ల సమావేశానికి కౌంటర్ గా వెంటనే విలేకర్ల సమావేశం ఎర్పాటు చేసిన వైస్సార్సీపీ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ప్రత్తిపాటి వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో యార్డు చెర్మన్ బొల్లెద్దు చిన్న,మునిసిపల్ చెర్మన్ రఫాని,తలహ ఖాన్ పాల్గొన్నారు. 

ముందుగా యార్డు చెర్మన్ చిన్న మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గురించి విమర్శించే అర్హత నీకు లేదు అని, ఎడవల్లి భూముల గురించి మాట్లాడాలి అనే మొదటిగా వారికీ క్షమాపణ చెప్పాలి అని. మీరు అధికారంలో ఉన్నపుడే దళితుల పైనా దాడులు జాగాయి. చీరాల రోడ్డులో, పోలిరెడ్డిపాలెం నందు చర్చిలను కూల్చింది మీరే ఎస్.సి లకు మొదటి నుండి మీరు చేసిన అన్యాయాన్ని మర్చిపోరు అని, మీరు చేసిన అన్యాయాలకు మొదటి నుండి అడ్డుకట్ట వేస్తుంది వైస్సార్సీపీ ప్రభుత్వం అని, ఖచ్చితంగా సీఎం గారు ఇచ్చిన హామీ మేరకు ఎడవల్లి రైతులకు న్యాయం చేస్తాం అని తెలిపారు. 

మునిసిపల్ చెర్మన్ రఫాని మాట్లాడుతూ అక్రమం గురించి మీరు మాట్లాటం సిగ్గుచేటు అని, మీరు అధికారంలో ఉన్నపుడు అక్రమాలను పాతుకుపోయేలా చేసారు. మా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మీరు చేసిన అక్రమాలను కూకటివేళ్లతో సహా పీకివేయటానికి మాకు రెండు సంవత్సరాలు పట్టింది అని, మేము గెలిచినా వెంటనే MLA రజిని గారు మొదటిగా పేకాట సామ్రాజ్యం అయిన CR క్లబ్ మూసివేశం అని సొంత పార్టీ వాళ్లు అయినా అక్రమాలకు, పేకాట లాంటి వాటిలలో పాల్పడిన కఠిన చర్యలు తప్పవు అని రజిని గారు తెలిపారు అని గుర్తుచేశారు. జరిగిన మునిసిపల్ ఫలితాలు, రాబోవు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రజిని గారి పాలనకు నిదర్శనం అని తెలిపారు 
















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామంలో 18-06-2021,శుక్రువారం నాడు మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి. వాటా వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి . 

ఎం.వి నారాయణ పురంలో - 1

వెంగళరెడ్డి నగర్ లో  - 1

సుబ్బయ్యతోట లో - 1

సుగాలని కాలనీ లో - 1

మద్ది నగర్ లో - 2 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామంలో ఈ రోజు ఎలాంటి  కరోనా కేసు నమోదు కాలేదు 



































Share:

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట - స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు

అక్రమాలకు అడ్డాగా చిలకలూరిపేట -  స్థానిక నేత దళిత భూములు పైన ఎందుకు మౌనంగా ఉన్నారు - ప్రత్తిపాటి పుల్లారావు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - మాజీ మినిష్టర్ ప్రత్తిపాటి పుల్లారావు ఏంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో నేను అధికారంలో ఉన్నపుడు ఎన్నిక ప్రచారంలో దళిత భూముల విషయంలో తన పైన విమర్శలు చేసిన జగన్ మోహనరెడ్డి  ఈ రోజు అధికారంలో ఉండి అదే దళిత భూములను ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. స్థానిక నాయకులు నేతలు కూడా దీని పైనా మౌనం వహించటం ఏంటని, అలాగే దీని పైనా జగన్ మోహన రెడ్డి స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని దిని పైనా పోరాటం చేస్తాం అని తెలిపారు. అలాగే చిలకలూరిపేట అధికారం అడ్డం పెట్టుకొని అక్రమ దందా సాగిస్తున్నారు అని 175 నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా అక్రమ మద్యం,పేకాట, గుట్కా వ్యాపారాలకు కేరాఫ్ గా మార్చారు, ఎక్కడో పక్క జిల్లా పోలీసులు ఇక్కడ అక్రమ గుట్కాలు పట్టుకునే వరకు ఎక్కడ పొలిసువారు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. 

సెంట్రల్ గవర్నమెంట్ జర్నలిస్ట్ లను ఫరంట్ లైన్ వర్కర్లుగా గుర్తించినా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అని , మరణించిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల ఆర్ధిక నష్టం చెలించాలి అని డిమాండ్ చేసారు.  












































Share:

చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు

చిలకలూరిపేటలో రేపు 19-06-2021,శనివారం విధ్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 19-06-2021 శనివారం నాడు మద్దినగర్ నందు ఫీడర్ మరమ్మతుల కారణంగా మధ్యాహం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్దినగర్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, బాలాజీ సినిమాహాల్ రోడ్డు,వెంగళరెడ్డి నగర్,వెంకటప్పయ్య కాలనీ,వెంకటాచారి నగర్,దాసరి కాలనీ,శ్రీనివాస కాలనీ,క్రిస్టియన్ కాలనీ,కొమరవెల్లిపాడు,చీరాల రోడ్డు,రహమత్ నగర్, ఈ ప్రాంతాలలో వారికీ విధ్యుత్ అంతరాయం ఏర్పడును 


















































Share:

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం

చిలకలూరిపేట - బడ్డీ కొట్టుని కూడా వదలని దుండగులు - లక్ష రూపాయల ఆస్థి నష్టం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలోని పండరీపురం 10 వ లైన్ లో గత రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి మా రిపోర్టర్ అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. అది అగ్ని ప్రమాదం కాదు అని గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి చర్యలకు పాల్బడ్డారు అని బాధితులు తెలిపారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆరికట్ల నరసమ్మ అనే 60 సంవత్సరాల మహిళా పొట్టకూటి కోసం అని చిలకలూరిపేట పండరీపురం 10వ లైన్ నందు బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకు సాగిస్తుంది. బుధవారం రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమె బడ్డీకొట్టు తగలబడటం చూసి ఆమెకు సమాచారం అందించే లోపే బంకు మొత్తం కాలిపోయేది. గత మూడు నెలల క్రితం 20 వేల రూపాయలతో చిన్న పాక నిర్మించుకున్నారు. బంకు లోని సరుకులు సామానులు, బంకు తో కలిపి లక్ష రూపాయల ఆస్థి నష్టం జరిగినట్లు ఆమె చెప్పి కన్నీరుమున్నీరు అయ్యారు. ముసలదానిని ఎవరిపైన ఆధార పడకుండా ఇలా బ్రతుకుతుంటే ఎవరో కావాలి అని ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. గతంలో కూడా ఇలాగే రెండు సార్లు బంకు తాళాలు పగులగొట్టిన ఘటనలు ఉన్నాయి అలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలి అని ఆమె కోరారు. అసలే కరోనా కష్ట కాలం మళ్ళి ఈ ఘటనతో నేను ఎలా బతకాలి అని ఆమె బాధపడ్డారు. అధికారులు చొరవతీసుకుని ఆమెకు ఆర్ధిక సాయం చెయ్యాలి అని స్థానికులు కోరారు 















































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.