మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే

టిడిపి - జనసేన అభ్యర్థులు వీరే :-


టీడీపీ అభ్యర్థులు :-

ఆముదాలవసల - కూన రవికుమార్

ఇచ్చాపురం - బెందాళం అశోక్

టెక్కలి - అచ్చెన్నాయుడు

రాజాం - కొండ్రు మురళీమోహన్

అరకు - దొన్ను దొర

కురుపాం - జగదీశ్వరి

పార్వతీపురం - విజయ్ బొనెల

సాలూరు - గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి - బేబీ నాయన

గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం - పూసపాటి అదితి

నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు

పాయకరావుపేట - వంగలపూడి అనిత

విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ - గణబాబు

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు

పి గన్నవరం - మహాసేన రాజేష్

కొత్తపేట - బండారు సత్యానందరావు

మండపేట - జోగేశ్వరరావు

రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం - చినరాజప్ప

తుని - యనమల దివ్య

అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ఆచంట - పితాని సత్యనారాయణ

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు

ఉండి - మంతెన రామరాజు

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ

చింతలపూడి - సొంగా రోషన్ కుమార్

తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు

నూజివీడు - కొలుసు పార్థసారథి

ఏలూరు - బడేటి రాధాకృష్ణ

గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ - వెనిగండ్ల రాము

పెడన - కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర

పామర్రు - కుమార్ రాజా

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్

జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య

నూజివీడు - కొలుసు పార్థసారథి

నందిగామ - తంగిరాల సౌమ్య

తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి - నారా లోకేష్

పొన్నూరు - ధూళిపాళ్ల నరేందర్ కుమార్

బాపట్ల - నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు

చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ - జీవీ ఆంజనేయులు

మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి

రేపల్లె - అనగాని సత్యప్రసాద్

ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు

పర్చూరు - ఏలూరి సాంబశివరావు

సంతనూతలపాడు - బీఎన్ విజయ్‌కుమార్

అద్దంకి - గొట్టిపాటి రవికుమార్

ఒంగోలు - దామచర్ల జనార్థనరావు

కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి

కొండెపి - డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

కావలి - కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు - పాశం సునీల్ కుమార్

సూళ్లూరు పేట - విజయ శ్రీ

ఉదయగిరి - కాకర్ల సురేష్

కడప - మాధవి రెడ్డి

రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల - బీటెక్ రవి

మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ రెడ్డి

శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్ రెడ్డి

కర్నూలు - టీజీ భరత్

పాణ్యం - గౌరు చరితా రెడ్డి

నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్

బనగానపల్లె - బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

పత్తికొండ - కేఈ శ్యాంబాబు

కొడుమూరు - దస్తగిరి

రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు

ఉరవకొండ - పయ్యావుల కేశవ్

తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి

శింగనమల - బండారు శ్రావణి శ్రీ

కళ్యాణ దుర్గం - అమిలినేని సురేంద్రబాబు

రాప్తాడు - పరిటాల సునీత

మడకశిర - సునీల్ కుమార్

హిందూపురం - నందమూరి బాలకృష్ణ

పెనుకొండ - సవితమ్మ

తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి

పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి - గాలి భాను ప్రకాష్

గంగాధర నెల్లూరు - బీఎం థామస్

చిత్తూరు - గురజాల జగన్‌మోహన్

పలమనేరు - అమర్‌నాథ్ రెడ్డి

కుప్పం - నారా చంద్రబాబునాయుడు


జనసేన అభ్యర్థులు :-

నెల్లిమర్ల- లోకం మాధవి

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్ - పంతం నానాజీ

తెనాలి-నాదెండ్ల మనోహర్

రాజానగరం - బత్తుల బలరామ కృష్ణ

Share:

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

టిడిపి - జనసేన మొదటి జాబితా విడుదల ప్రత్తిపాటి పోటీ ఎక్కడ నుంచి అంటే ?......

గత కొంత కాలంగా బిజెపి పొత్తు విషయమై జాప్యం చేస్తున్న నేపథ్యంలో జనసేన - టిడిపి అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఈరోజు చంద్రబాబు - పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి పేరును పత్తిపాటి పుల్లారావు గా ప్రకటిస్తూ భిన్నాభిప్రాయాలకు తెరదించారు. స్థానికంగా చిలకలూరిపేటలో భారీగా పట్టు ఉన్న ప్రత్తిపాటికే చిలకలూరిపేట టిడిపి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. గత కొంతకాలంగా జనసేన - తోటరాజ రమేష్ తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా ప్రత్తిపాటిని ఎంపిక చేసినందుకుగాను టిడిపి కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.

Share:

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బ్రేకింగ్ న్యూస్ :- రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాసి నందిత సికింద్రాబాద్ నుండి బాసరకు వెళ్తున్న సమయంలో పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై డివైడర్ను ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం నల్గొండ బీఆర్ఎస్ సభకు వెళ్లి వస్తుండగా చర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి హోం గార్డెన్ ఢీకొనడంతో అతను అక్కడక్కడ మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు పది రోజుల సమయంలో ఈ యాక్సిడెంట్ లో చనిపోవడంతో నియోజకవర్గం ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి 19 న లాస్య తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2023 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. లాస్య మృతి పట్ల పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.

Share:

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

ఫీజు కట్టని విద్యార్థులకు కూడా హాల్ టికెట్లు పంపిణీ చేయండి - చిలకలూరిపేట AISF

చిలకలూరిపేట :- త్వరలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయం రానున్నటంతో చిలకలూరిపేట లోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంవత్సరకాలం మొత్తం కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఆర్థిక స్తోమత వలన ఫీజులు కట్టకపోతే వారికి హాల్ టికెట్లు నిలిపివేయకుండా విద్యార్థులకు అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆర్థికపరమైన చిక్కుల వలన వెనక్కి వెళ్ళకూడదు అని, అలాగే ప్రభుత్వం తల్లి ఖాతాలో కాకుండా విద్యార్థుల పాఠశాలల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చట్టం తీసుకురావాలని దీని ద్వారా విద్యార్థులు చదువుకి ఆటంకం కలగకుండా విద్యా దీవెన సక్రమంగా స్కూళ్లకు మరియు కాలేజీలకు చేరుతుందని వారు కోరారు. ఇలా చేయడం వలన హాల్ టికెట్లు, విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారని వారు తెలిపారు. విద్యార్థులకు కాలేజీలలో, స్కూల్లలో హాల్ టికెట్లు పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్ మేకపోతుల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ సాయి నాయక్, బొంత భగత్ సింగ్, సహాయ కార్యదర్శి పృద్వి, త్రిపురం సురేంద్ర మరియు మండాది ఫణి పాల్గొన్నారు.

వేగంగా వార్తలను పొందటం కోసం క్రింది లింకు పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట - ACB అధికారుల దాడి - 55,000రూ..లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి

చిలకలూరిపేట:- మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో కరెంట్ కనెక్షన్ కోసం చిలకలూరిపేట రూలర్ ఏపీ సీపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్ రావు నాయక్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు 55,000 లంచం అడగగా బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే రంగంలోకి దిగిన ACB అధికారులు లంచం తీసుకుంటుండగా ప్రకాష్ రావు నాయక్ ను పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్ మత్తె, డీఎస్పీ సత్యానంద్ రైడ్ లో పాల్గొన్నారు. లంచాలకు పాడుపడుతున్న అధికారుల సమాచారాన్ని తమతో పంచుకోవాలని వారు తెలిపారు.


మరిన్ని వార్తలు వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి వాట్స్అప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/GJSIoeRYDkBLAgjWVh6RlO

Share:

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట - ఆక్రమించిన రోడ్డును తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం - రహదారి ఆక్రమణ బాధితుల సంఘం

చిలకలూరిపేట :- గత కొన్ని రోజులుగా వివాదాస్పదమైన గొర్రెల మండి నుండి పసుమర్తి డొంక రోడ్డు వ్యవహారం ఉద్యమ రూపం దాల్చింది. పసుమర్రు గ్రామ సర్వేనెంబర్ 16/A కి సంబంధించిన స్థలం వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హార్ట్ టాపిక్ గా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మామ అయిన విడుదల లక్ష్మీనారాయణ గతంలో గొర్రెల మండి వెనుక ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారని తనకు సంబంధించిన స్థలంలో అతాను గోడ కట్టుకున్నట్లు వారికి సంబంధించిన వ్యక్తులు తెలియజేస్తున్నారు. అయితే అతనికున్న స్థలం కాకుండా ముందు వైపు ఉన్న రోడ్డును కూడా ఆక్రమించి దానిపై గోడను నిర్మించారని, ఇప్పటికే గొర్రెల మండి పక్క నుండి పసుమర్తి గ్రామానికి తారు రోడ్డు శాంక్షన్ అయినా కూడా పనులు జరగపోవడానికి కారణం ఈ ఘటనేనని, దీనివల్ల గ్రామ అభివృద్ధికి కుంటుపడుతుందని రహదారి ఆక్రమ బాధితుల సంఘం తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే కోటి రూపాయలు ఇస్తే కానీ రోడ్డు వదలను విడుదల లక్ష్మీనారాయణ బాధితులకు తెలిపినట్లు వారు తెలియజేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్షం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేడు చిలకలూరిపేట మరియు పసుమర్తి గ్రామ ప్రజలు సుమారు 100 మంది ఆక్రమించిన రోడ్డు వద్ద టెంటును ఏర్పాటు చేసి దీక్షను చేపట్టారు. వీరితో పాటుగా అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఈ ఆక్రమించిన రోడ్డుని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు. 

వేగంగా వార్తలను పొందడం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5


Share:

చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

చిలకలూరిపేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సం

https://chilakaluripetspeednews.blogspot.com/search?updated-max=2021-03-21T10:15:00-04:00&max-results=14&reverse-paginate=true&m=1

చిలకలూరిపేట టౌన్ :- పట్టణంలోని సుభాని నగర్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని సుభాని నగర్ నందు లహరి పిల్లల హాస్పిటల్ రోడ్డులోని జండా చెట్టు ఎదురుగా ఉన్న పటాన్ సుభాని అనే వ్యక్తి ఇంట్లో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పఠాన్ సుభాని మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విజయనగరంలోని ఉరుసు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఇది అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి సమయంలో తలుపులు పగలగొట్టి 25 వేల రూపాయలు నగదు, బంగారు దుద్ధులు, వెండి పట్టీలు దొంగిలించి పారిపోయారు. తెల్లవారుజామున తలుపులు తెరిచి ఉండటానికి గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో సామాన్లు అన్ని కింద పడేసి ఉండటానికి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వార్తలను వేగంగా పొందడం కోసం కింది ఉన్న లింకు పై క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/J2vrGMuayZKE5sIllmiJr5

Share:

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం - చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ యూనియన్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు లో జరిగిన సిద్ధం సభలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీకృష్ణకు తీవ్రమైన గాయాలయ్యాయి. సిద్ధం సభను న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై ఇలాంటి దాడి చేయడంతో ప్రజా సంఘాలు, ఆంధ్ర జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేశాయి. 

 రాప్తాడు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై జరిగిన దాడిని చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ నందు కలకత్తా, చెన్నై జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి కెమెరామెన్ పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ వరకు జర్నలిస్టులు అందరూ ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ మస్తాన్ వలికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే  ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పుల్లగూర భక్తవత్సలరావు మాట్లాడుతూ రాప్తాడు లో సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై దాడి చేయడం జగన్ ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్య అన్నారు. ఇండియాలోనే ఫోర్త్ ఎస్టేట్ అని పిలవబడే మీడియాకి ఈ రోజున వైయస్ జగన్ పాలనలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని దీనిపై వెంటనే ముఖ్యమంత్రి స్పందించి దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తవత్సలరావు తెలిపారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభలో స్వయానా మీడియాపై దాడి జరిగితే దీనికి ముఖ్య మంత్రి బాధ్యత వహించి వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఈనాడు విలేఖరి పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏపీడబ్ల్యూజే తరఫున మస్తాన్ వలీ డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు  అన్నలదాసుశేషగిరిరావు, సెక్రటరీ షేక్.అబ్దుల్ సత్తార్, ఏపీడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లాబక్షు,ఎలక్ట్రాన్ మీడియా కార్యదర్శి మల్లాల కోటేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎన్.బాబ్జీరావ్, నారాయణస్వామి ఆంధ్రజ్యోతి,  పోపూరి వెంకట్రావు,  షేక్.ఫక్రుద్దీన్,ఆలపాటిఆంజనేయులు, కుప్పం.కళ్యాణ్ చక్రవర్తి చుక్కా. విజయ్ కుమార్, విజయ్, ఉప్పల.బాలు, బొందలపాటి.వాసు , మురళి , దాసు, జగదీష్, సిద్ధిక్, నారాయణస్వామి,సలాసం శ్రీనివాసరావు,వెంకట్రావు,జరుగుల శ్రీనివాసరావు, మనోజు, మరియు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share:

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

చిలకలూరిపేట - మద్యం మత్తులో కత్తులతో దాడి ఒకరి పరిస్థితి విషమం

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట టౌన్ మద్యం మత్తులో కత్తులతో దాడి చేసుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సంజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన సంగుల శివ బాల(26), తాటికొండ వంశీ(26) అనే యువకులు కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. గతంలో వంశీ సోదరుడిని పై శివ బాల దాడి చేసిన ఘటనను గుర్తుతెచ్చుకొని పాత కక్షల నేపథ్యంలో వంశీ మద్యం మత్తులో విచక్షణను కోల్పోయి దగ్గరలో ఉండే చికెన్ సెంటర్ దగ్గర నుండి కత్తిని తీసుకొని శివబాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మద్యం మత్తులో ఉన్న శివబాల పై మెడపై, తలపై, చేతివేళ్లపై తీవ్రమైన గాయాలై రక్తస్రావంతో అపస్మార్క స్థితిలోకి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఘటనను అడ్డుకొని శివబాలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించిన వైద్య సిబ్బంది బాధితుడిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించమని తెలిపారు. అపస్మార్క స్థితిలో ఉన్న శివబాలను మెరుగైన వైద్య చికిత్స కై పట్టణంలోని ఆర్కే ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. శివ బాల పరిస్థితి విషమంగా ఉందని స్నేహితులు తెలిపారు. ఘటనకు కారకుడైన వంశీ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న టౌన్ సిఐ, ఎస్ఐ పోలీసు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

Share:

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

నరసరావుపేట బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్


పల్నాడు జిల్లా :- భారీ ర్యాలీతో చిలకలూరిపేట మీదుగా కోటప్పకొండను చేరుకొని ప్రత్యేక పూజలు అనంతరం నరసరావుపేట చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్న మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ..

నా నియోజకవర్గం వదిలి పెట్టి వస్తున్నప్పుడు బాధ వేసింది. పల్నాడు గడ్డపై అడుగుపెట్టిన వెంటనే గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను సరైన చోటుకు పంపించాడనుకున్నాను. నా జీవితంలో అనేక కష్టాలు, బాధలున్నాయి. నాకు మీసం తిప్పాలని ఉంది. మా నెల్లూరులో మీసం తిప్పితే రౌడీ అంటారని రాజకీయ నాయకులు చెప్పారు, కాని పల్నాడు వచ్చిన తర్వాత మీసం తిప్పుతా, పంచె కట్టుకుంటా  నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా. జగనన్న కోసం తల తెగుతుందన్నా ముందుకే వెడతా. రాష్ట్రంలో ఎక్కడైనా ఓడి పోయే సీటు ఉంటే అక్కడికి వెళ్ళమన్నా వెళతాను. నెల్లూరు నాకు సెట్ అవ్వదు అంటారు. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న పల్నాడుకే నన్ను పంపించారు. గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారని టిడిపి వాళ్ళు అన్నారు. మా గొర్రెల, బర్రెల పాలు అమ్ముకునే వేల కోట్లు సంపాదించిన విషయం భువనేశ్వరి గుర్తుపెట్టుకోవాలి. నేను గొర్రెలు కాసిన వారసత్వం నుండే వచ్చానని గర్వంగా చెప్పుకుంటాను. నన్ను పెంచుతారో తెంచుతారో మీ చేతుల్లో ఉంది. నా రాజకీయ భవిష్యత్ మీ చేతిలో పెడుతున్నాను. నేను వదిలి పెట్టిన సీటును మైనార్టీకి ఇచ్చారు. నెల్లూరు చరిత్రలో మైనార్టీకి సీటు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

తిరిగి సిఎంగా జగన్ చూసే వరకూ అందరి కలిసి పని చేయాలని, టిడిపి ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే అరవై రోజుల్లో తేల్చుకుందామని ఆయన తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో ఎంపి తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాం అని జోస్యం చెప్పారు.

 ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి, సత్తనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ...

సింహపురి నుండి నూతన ఉత్సాహం నర్సరావుపేటకు వచ్చిందని, జలవనరుల శాఖ సీటును రాంబాబుకు వదిలి పెట్టు అని జగన్మోహన్ రెడ్డి అంటే  వదిలి పెట్టిన విశ్వాస పాత్రుడు అనిల్ అని ఆయనను కొనియాడారు, అలాగే ఇక్కడ సీటు వదిలి పెట్టి గుంటూరు వెళ్ళు అంటే పార్టీనే వదిలి పెట్టిన విశ్వాస ఘాతకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అని ధ్వజమెత్తారు. నరసరావుపేట లోక్ సభ లో ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ తో అనిల్ ను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. బిసి లకు సీటు ఇస్తామంటే పార్టీ మారిన ద్రోహులకు బిసిల ఓటు అడిగే హక్కు లేదు అని, ఏడు రథాలను నడిపించిగల శ్రీ కృష్ణుడు అనిల్ అని, ఈ రథం కింద అందరూ నలిగిపోవాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.

పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ....

"చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా బిసిలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారా. మహిళలు గడప దాటకుండానే అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అందించింది అని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లా లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు అసెంబ్లీ అభ్యర్థులతో పాటు లోక్ సభ అభ్యర్థి అనిల్  ను గెలిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ...

చంద్రబాబుకి అనిల్ కుమార్ పంపి జగన్ కౌంటర్ ఇచ్చారని, తానా తందానా అయిపోయిందయ్య కృష్ణయ్య. అనిల్ కుమార్ యాదవ్ తో కాదు నాతో పెట్టుకో చాలు కృష్ణ అంటూ ఎంపీ లావు కృష్ణ పై కామెంట్స్ చేశారు. అలాగే తోలు తీస్తాం అంటూనారు ఎవరికి తీస్తారు తాట.35 మంది కాపులకు టికెట్స్ జగన్ ఇచ్చారు గుర్తుపెట్టుకో పవన్. నువ్వు 35 టికెట్స్ తెచ్చుకోకపోతే పవన్ కల్యాణ్ కు కాపులు తోలు వలుస్తారు అటు ఆయన ధ్వజమెత్తారు.

Share:

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట - పెళ్లిలో సెల్ ఫోన్లు చోరీ - పట్టుకొని దేహశుద్ధి చేసిన మహిళలు

చిలకలూరిపేట టౌన్:-  సెల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయిన దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన చిలకలూరిపేటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే గణపవరం చెందిన మాధవి తన కుటుంబంతో కలసి చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేశా కళ్యాణ మండపంలో వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. వివాహం జరుగుతుండగా తమ సెల్ఫ్ ఫోన్ చోరీకి గురయ్యాయని గమనించిన వారు పెళ్లికి హాజరైన బంధువులతో విషయాన్ని పంచుకున్నారు. పెళ్లికి హాజరైన వారిలో మొత్తం ఐదు సెల్ ఫోన్లు దొంగిలించబడినట్లు సమాచారం. సదరు మహిళా సెల్ ఫోన్ చోరీకి గురైందని బాధతో రాత్రి 11 గంటలకు సమయంలో కుటుంబంతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. చిలకలూరిపేట, గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు సమీపంలో ఇద్దరి యువకులు అనుమానాస్పదంతో ఉండటంతో గమనించి సోదా చేయగా వారి వద్ద దొంగిలించిన సెల్ ఫోన్లు గుర్తించారు. విషయాన్ని గమనించిన ఒక దొంగ వారిని నెట్టివేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారిపోయాడు. మిగిలిన ఇంకొక దొంగని కాళ్లు చేతులు కట్టివేసి దేహశుద్ధి చేసి ఆరా తీయగా నరసరావుపేటకు చెందిన రామూగా తెలిపాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు దొంగని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాత్రి సమయంలో దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మహిళలను స్థానికులు అభినందించారు. రాత్రి సమయంలో మహిళ అని అధైర్యం పడకుండా ధైర్యంగా దొంగలను ఎదిరించి పట్టుకున్నారు.

Share:

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

ఈనెల 14న చిలకలూరిపేటకు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

చిలకలూరిపేట:- న‌ర‌స‌రావుపేట‌ పార్లమెంట్ వైయ‌స్సార్‌సీపీ ఇన్ చార్జ్ గా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారికి  ఈనెల 14వ తేదీ బుధ‌వారం ఘన స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు జ‌ల‌వ‌న‌రుల‌శాఖామంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు న‌ర‌స‌రావుపేట మునిసిప‌ల్ గెస్ట్ లో బుధ‌వారం మీడియా స‌మావేశంలో జ‌లవ‌న‌రుల శాఖా మంత్రి అంబటి రాంబాబు, వైస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, చిలకలూరిపేట వైయ‌స్సార్ సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్ నాయుడు వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మంత్రివ‌ర్యులు అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ నరసరావుపేట పార్లమెంట్ కు బీసీ అభ్యర్థిని కేటాయించడం సీఎం జ‌గ‌న్  తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమ‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు ప‌రిధిలో అభ్య‌ర్థుల మార్పులు అయిపోయాయ‌ని.. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కులు పోటీ చేయ‌బోతున్నార‌ని తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. అందుకే పార్లమెంట్ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకు రావడం జ‌రిగింద‌ని వివ‌రించారు. 

      ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14న నరసరావుపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు మరియు పార్టీ సానిభూతిపరులకు పిలుపునిచ్చారు. న‌రసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ సభను  ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారటే మాటపై నిలిచే వ్యక్తి అని ఎన్నడు లేని విధంగా నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీకి కేటాయించడం గొప్ప విషయం అని అన్నారు..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ గారిని అత్యధిక‌ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019లో మాదిరిగానే 2024లో కూడా జిల్లాలోని 7నియోజకవర్గలు విజయం సాధించ బోతున్న‌ట్లు చెప్పారు.

 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ల్లెల రాజేష్‌నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీ బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు అనిల్‌కుమార్ యాద‌వ్‌ నెల్లూరు నుండి రోడ్డు మార్గాన బ‌య‌లుదేరుతార‌ని తెలిపారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని అడ్డరోడ్డు సెంట‌ర్ కు చేరుకుంటార‌న్నారు. అక్క‌డ త‌న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనిల్‌కుమార్ యాద‌వ్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లక‌నున్న‌ట్లు చెప్పారు. 2:30 గంట‌ల‌కు కోట‌ప్పకొండలో త్రికోటేశ్వ‌రుని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 4 గంట‌ల‌కు కోట‌ప్ప‌కొండ నుంచి బ‌య‌లుదేరి న‌ర‌స‌రావుపేట మండ‌లం పెట్లూరివారిపాలెం చేరుకుంటార‌న్నారు. అక్క‌డ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి స్వాగ‌తం పలకనున్నారు. అక్క‌డి నుంచి న‌ర‌స‌రావుపేట‌ ప‌ల్నాడు బ‌స్‌స్టాండ్ సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భ వ‌ద్ద‌కు చేరుకుంటార‌ని తెలిపారు. స్వాగ‌త ర్యాలీ, బ‌హిరంగ స‌భ‌కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, సానుభూతి ప‌రులు పెద్ద ఎత్తున హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.

Share:

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న మల్లెల రాజేష్

♦️🕉️🕉️♦️ *శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకల్లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు*  చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డు పక్కన శ్రీనివాసానగర్ కొత్త వాటర్ ట్యాంకు వద్ద వేంచేసియన్న శ్రీ జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ  వేడుకలుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు గారు ఆదివారం హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజేష్ నాయుడు గారు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

చిలకలూరిపేట:-  పట్టణంలోని పెదనందిపాడు మారుతీ నగర్ నందు వేంచేసి ఉన్న జ్వాలాముఖి పోలేరమ్మ తల్లి దేవస్థానం తృతీయ వార్షికోత్సవ వేడుకలుకు వైయస్సార్సీపి నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి పట్టణ క్లస్టర్ 1 అధ్యక్షులు పఠాన్ తలహాఖాన్, వైయస్సార్సీపీ నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, పంగులూరి వెంగళ రాయుడు, బేరింగ్ మౌలాలి, గుంజి వీరాంజనేయులు,  దేవాలయ కమిటీ సభ్యులు తోకల నాగరాజు దాసరి శివకోటయ్య, పాలపర్తి అంజమ్మ, పాలపర్తి విమలమ్మ, దేవరకొండ ఏడుకొండలు, దేవరకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share:

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

34వ ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

చిలకలూరిపేట:-  నేడు చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ప్రత్తిపాటి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. గుంటూరు - శంకర్ కంటి ఆసుపత్రి వారి జిల్లా అంగత్వ నివారణ సంస్థ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచిత బీపీ మరియు షుగర్ టెస్టులను చేసి ఆరోగ్య పరిస్థితి మరియు స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆపరేషన్ చేసే రోజును వారికి ఇస్తారు. అనంతరం ఆయా రోజులలో చిలకలూరిపేట నుండి గుంటూరు శంకర ఆసుపత్రికి ఉచిత బస్సు సౌకర్యంతో ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తారని టిడిపి నాయకుడు తెలిపారు. వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సదుపాయం ఏర్పాటు చేశారు.

Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.