మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

చిలకలూరిపేట పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి



చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరికీ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి ఇప్పటివరకు విద్యుత్ బకాయిలను చెల్లించాలని అంటే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నందు చెల్లించేవారు. కానీ ఇప్పటి నుండి విద్యుత్ బకాయిలు చెల్లించాలి అంటే పట్టణంలోనే కెబి రోడ్ లో ఉన్న ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ నందు చెల్లించాలని.. డిఈఈ అశోక్ కుమార్ తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరారు.

Share:

చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి

చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో నివాసం ఉంటున్న ఒరిస్సాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రం భద్రం గ్రామానికి చెందిన రమేష్ మాలిక్ సర్వేశ్వర్ మాలిక్ లు గ్రామంలోని ఒక కంపెనీలో పని పనిచేస్తూ గణపవరం గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ నందు అద్దెకు ఉంటున్నారు. అయితే రమేష్ మాలిక్ కు శనివారం ఉదయం చాతి నొప్పి రావడంతో సర్వేశ్వర మాలిక్ దగ్గర్లో ఉన్న మెడికల్ షాప్ నందు గ్యాస్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రమేష్ హాలిక్ కు ఇచ్చాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న రమేష్ మాలిక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందాడు. విషయం గమనించిన సదరు సర్వేశ్వర్ మాలిక్ మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తూ పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది గమనించిన రమేష్ మాలిక్ బంధువైన ప్రమోద్ మాలిక్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసు వారు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం వచ్చిన నివేదిక ఆధారం ప్రకారం రమేష్ మాలిక్ను పథకం ప్రకారం చంపబడ్డాడ లేదా నిజంగానే అనారోగ్యంతో మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది.



Share:

రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?

రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం చనిపోయిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నారు. అయితే హైదరాబాదు అమీర్పేట లోని తన సొంత గ్రామంలో ఉంటున్నారు. ప్రతిరోజు ఇంటి బయట ఉన్న వరండాలో కూర్చొని పేపర్ తిరగేయటం, శ్రేయోభిలాషులతో కలిసి వారితో ముచ్చటించడం అలవాటు. అదేవిధంగా ఈరోజు ఉదయం అలాగే వరండాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు రోశయ్య ని చూసి అవాక్కయ్యారు. ఆయన నోటి నుండి రక్తస్రావం అవ్వటంతో పాటుగా అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన వారు హుటాహుటిన బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పటల్ కు తరలించారు. హాస్పటల్ లోని డాక్టర్లు చెప్పిన సమాచారం మేరకు ఆయన హాస్పిటల్ కి వచ్చే మార్గమధ్యంలోనే మరణించారని వారు తెలిపారు. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ని వివిధ పార్టీ నాయకులు తో పాటు తమిళనాడు , కర్ణాటకలోని ప్రభుత్వాలు కూడా ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Share:

ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు

ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత పేర్లను పెట్టుకోవటం పై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ లోని జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకంగా పేర్లు పెట్టుకోవడం పై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్మృతి ఇరానీ స్పందించారు.

జగనన్న గోరుముద్ద, జగనన్న పాల వెల్లువ, వైయస్సార్ సంపూర్ణ పోషణ అనే పలు పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం పై ఆమె స్పందిస్తూ ... కేంద్ర ప్రభుత్వాల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వాల సొంత పేర్లను & నచ్చిన పేర్లను పెట్టుకోవడం కుదరదని అలాగే MP రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు. అలాగే దీనిపైన నివేదిక కోరింది.



Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మృతి చెందారు. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన ఆయన స్వతంత్ర సమరయోధుడు గా ఎన్.జి.రంగా కు శిష్యునిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించి అనూహ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ కు 2009 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1968,1974,1980, 2009 సంవత్సరాలలో MLC గా ఎన్నికయ్యారు. 1989, 2004 లలో చీరాల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 సంవత్సరంలో నరసరావుపేట నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సంవత్సరంలో కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2011 నుండి 2016 వరకు తమిళనాడుకు గవర్నర్గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కు 15వ సీఎంగా, తమిళనాడుకు 31వ గవర్నర్గా పని చేశారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ అండ్ బి, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 15 సార్లు అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి మన కొణిజేటి రోశయ్య. రాజకీయ భీష్ముడుగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.



Share:

భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?

భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కోవిడ్ తీవ్రత తగ్గుతుంది అనుకొనే సమయంలో సడన్ గా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రజలను భయపెడుతుంది. గత వేరియంట్ లతో పోలిస్తే ఇది త్వరగా వ్యాపిస్తుందని హడావిడి ఎక్కువైంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నుండి విదేశాల నుండి భారత్ కి వచ్చిన వారిని పరీక్షించగా తాజాగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ ఉన్నట్లుగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరి కర్ణాటక బెంగళూరు ప్రాంతంగా తెలుస్తోంది. అయితే వీరిలో లక్షణాలు మాత్రమే ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తమై ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అధికారులు తెలిపారు. విదేశాల నుండి వచ్చేవారికి కచ్చితంగా ఆర్ టి పి సి ఆర్ చేయాలని ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయితే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని వారు తెలిపారు. ఏది ఏమైనా నా గత రెండు వేరియంట్లలో వలన జనజీవనం అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ మాస్కులు ధరించి కొత్త వేరియంట్ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Share:

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అఖండ మూవీ రివ్యూ :-  3 / 5

చాలా రోజుల తర్వాత పెద్ద హీరో సినిమా సినిమా ధియేటర్ లో సందడి చేయటంతో చిలకలూరిపేట లోని వి సెల్యూలాయిడ్ థియేటర్స్ అన్నీ పండుగ వాతావరణం నెలకొన్నది.

 ఇక సినిమా విషయానికొస్తే బోయపాటి తన మార్క్ ని చూపించాడు. సినిమాలోని క్యారెక్టర్స్ ను హై లెవెల్ ఓల్టేజితో చూపించటం బోయపాటికే సాధ్యం. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటికి తోడుగా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఒక రేంజిలో ఉంటాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందనే చెప్పాలి. బాలకృష్ణ మాస్ ఎలిమెంట్స్ , డైలాగ్స్, ఫైట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైట్ సీన్స్, బాలకృష్ణ డాన్స్ ప్రేక్షకులకు ఉల్లాసాన్ని తీసుకొస్తాయి.శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ తో విలన్ పాత్రకు కొత్త రూపం తీసుకుని వచ్చాడు . తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు చితక కొట్టేసాడు హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అందం అభినయంతో ఆకట్టుకుంది పూర్ణ కూడా తన అందంతో నటనతో ఆకట్టుకుంది జగపతి బాబు తన పరిధి మేరకు మెప్పించాడు.

 మైనస్ పాయింట్ :- కథ సాగదీత

 చివరకు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది. చిలకలూరిపేట ప్రజలు అఖండ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ క్రింది వీడియోలో చూడండి.


Share:

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన పెడవల్లి అనిల్ (26) యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని అనంతరం జాతీయ రహదారి పక్కనే ఉన్న అమృత మినరల్ వాటర్ ప్లాంట్ వెనుక ఉన్న ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. ఉదయం అటుగా వెళ్తున్న బాటసారులు జీవచ్ఛవంలా పడి ఉన్న మృతదేహాన్ని చూసి అనిల్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు అనిల్ విజయవాడలోని రాజకీయ నాయకుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నారని బంధువులు తెలిపారు‌.



Share:

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా పంపే విషయంలో పొరపాటు చేస్తున్నారని స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలలలో మాత్రమే పంపాలని ఆయన తెలిపారు. అయితే కొందరు పెన్షనర్లు ముందుగానే లైఫ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ ద్వారా పంపుతున్నారని, అవి చెల్లవని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కూడా కొందరు పెన్షనర్లు గడువు కంటే ముందే లైఫ్ సర్టిఫికెట్లను పంపడంతో అవి చెల్లక, వారు కొన్ని నెలలపాటు పెన్షన్ పొందలేకపోయారు ఆయన వివరించారు.




Share:

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

24/11/2021 to 28/11/2021 వరకు భారీ వర్షాల కారణంగా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

గుంటూరు జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి  విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారి ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా 24/11/2021 నుండి 28/11/2021 వరకు భారీ వర్షం సూచికల వలన ప్రజలందరూ అప్రమత్తమై బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని... లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తమై చిన్నపిల్లలను నీటి ప్రవాహానికి దూరంగా ఉంచుతూ .. వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాలలో జాగ్రత్తలు వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.



Share:

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట మద్యం దుకాణంలో చోరీ

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని వేలూరు రోడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చోరీలో 2.32 లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ సీఐ భాష చోరీ జరిగిన  ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఆ దుకాణానికి బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఉద్యోగ భద్రతకై చోరీ జరిగిన మొత్తాన్ని చెల్లించాడు.




Share:

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్

చిలకలూరిపేట :- తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు యాక్సిడెంట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారి సమీపంలోని లక్కీ రోడ్ లైన్స్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి విజయవాడ వెళుతున్న ఇందు బస్ ట్రావెల్స్ తెల్లవారుజామున గం 4:15 ఈ సమయంలో జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనకు ముఖ్యకారణం డ్రైవర్ నిద్ర మత్తు వలన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన లో ఐదుగురికి స్వల్ప గాయాలు అవగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఒక హుటిన ఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందించి తీవ్రగాయాలైన చంద్రమోహన్, కటారి సురేష్ బాబులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.



Share:

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

ఓడరేవు - చిలకలూరిపేట - పిడుగురాళ్ల హైవే పనులు త్వరగా మొదలు పెట్టాలని గడ్కరిని కోరాం - చిలకలూరిపేట పర్యటనలో రాజ్యసభ సభ్యుడు G V L నరసింహారావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంతాలలో పర్యటిస్తూ ఆయా ఏరియాలలో ఉండే సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు సోమవారం నాడు చిలకలూరిపేటలో పర్యటించారు రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు. పట్టణంలోని బిజెపి నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణానికి ప్రభుత్వం అనేక నిధులను కేటాయించిందని ముఖ్యంగా చిలకలూరిపేట బైపాస్ పనులు త్వరగా పూర్తిచేయాలని.. ఆలస్యానికి గల కారణాలను రాష్ట్ర మంత్రులతో చర్చించి త్వరగా బైపాస్ పనులు పూర్తిచేయాలని.. అలాగే చీరాల ఓడ రేవు నుండి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట, పిడుగురాళ్ల వరకు బైపాస్ పనులను త్వరగా మొదలు పెట్టాలని కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని కోరామని.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత పథకం కింద సుమారు 180 కోట్ల రూపాయలను కేటాయించిందని దానిద్వారా పట్టణంలోని అన్ని ఏరియాలకు త్రాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని.. అలాగే ప్రధానమంత్రి  ఆవాస్ యోజన కింద 4500 ఇళ్లను కేటాయించామని కానీ వాటిని ఇంకా అర్హులకు అందలేదని వాటిపై చర్చిస్తామని ఆయన తెలిపారు. అలాగే పట్టణంలోని పలు సమస్యలపై ఆయన చర్చించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పట్టణంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సందర్శించారు.



Share:

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

అయ్యప్ప మాల ధారణ ఎప్పుడు చేయాలి ? ఎప్పుడు చేయకూడదు ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు.

2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.

5. పెదతండ్రులు , పినతండ్రులు , పెద్దతల్లులు , పినతల్లులు , గతించినచో 3 పక్షములు (45  రోజులు) మాల ధరించరాదు.

6. సోదరులు , పుత్రులు , మేనత్తలు , మేనమామలు , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) గతించినచో  41 దినములు  మాల ధరించరాదు. 

7. కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినెలు , మరుదులు , బావలు , బావమరుదులు  గతించినచో 30 దినములు (1 నెలపాటు) మాల ధరించరాదు.

8. మనవాళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు   గతించినచో 21 దినములు  మాల ధరించరాదు.

9. ఇంటిపేరు గలవారు , రక్తసంబంధీకులు గతించినచో  21 దినములు  మాల ధరించరాదు.

10. వియ్యాలవారు , దూరపుబంధువులు గతించినచో 13 దినములు మాల ధరించరాదు.

11. ఆత్మీయులు , మిత్రులు  గతించినచో 13 దినములు (దుఃఖము అనుష్ఠించి) మాల ధరించరాదు.

12. ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికాలము సూతకముండును కావున మాల ధరించరాదు.          దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు గతించినచో 6 నెలలు సూతకముండును , కావున మాల ధరించరాదు.

13. పైన తెలిపిన వారిలో ఎవరు గతించినను వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టివారికి కుడా ఏదాడి సూతకముండును. కావున అట్టివారు ఏడాది కాలము మాల ధరించరాదు.

14. తల్లి , భార్య , కూతురు , కోడలు , మరదళ్ళు , సోదరి , మున్నగువారు 7 నెలల గర్భిని అయినచో మాల ధరించి దీక్ష తీసుకొనరాదు , ఏలనగా దీక్షలో ఉండగా     వారు (7వ నెల , 8వ నెల , 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకము వస్తుంది , కావున మాలను విసర్జన చేయవలసి వచ్చును. అందువలన మాల ధరించరాదు.

15. మాల ధరించి దీక్షలో ఉండగా కన్నకూతురు రాజ్వరాలు అయితే ఆ వార్త వినగానే తాను ఎన్ని దినములు దీక్ష ముగించినానను , వెంటనే దీక్ష విరమించి , గురుస్వామి ద్వారా మాల విసరర్జించి , మాలను కడిగి , దేవును వద్ద వుంచి , పై సంబరాలలో పాల్గొని , కూతురుకి న్యాయము చేకూరునట్లు తన కర్తవ్యాన్ని ఆచరించాలి. అదియే అయ్యప్పకు ఆనందదాయకము , భక్తులకు శ్రేయదాయకం.

16. దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన గతించినను ఆ వార్త తెలియగానే  మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవలయును , అలా కాక మాలో మాకు మాటలు , పలకరింపులు , రాకపోకలు అసలే లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకముతో పావన శబరిగిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు ఆదేశించి యున్నారు , కావున శుభాశుభ  సూతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి,మాల విసర్జించి,శబరియాత్ర చేసి సద్గురునాధుడైన శబరిగిరీశుని అనుగ్రహము పొందుటకు ప్రయత్నించవలయును.

17. కుటుంబములో శుభసూతకము లేదా అశుభసూతకము కలిగి మద్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు,తదుపరి వెంటనే మాల వేసుకొనక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి మండలకాలము అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశము ఉంటేనే మరల మాల ధరించవలయును,అలా వీలుకాని పక్షములో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానములోనే ఉత్తరవైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారిని దర్శించి వచ్చుటకు దోషము లేదు.

18. ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలవేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కాని , గర్భస్రావము గాని , లేదా జన్మించిన తరువాత శిశువు పోవడము కాని జరిగినట్లయితే 10 రోజులు సూతకముండును. కావున మాలను విసర్జించవలయును. అలాగే మరల మండల కాలము సమయమున్నచో దీక్షబూని శబరియాత్ర చేయవచ్చును.

19. స్త్రీలు మాత్రము 10 సంవత్సరాల వయస్సు దాటినా వారు మాల ధరించరాదు,ఏలనగా వారు ఏ సమయాన్నైనా ప్రథమ రజస్వ అయ్యే అవకాశముంది దాని వలన శుభసూతకం ఏర్పడుతుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలానే 50 సంవత్సరాలు వయస్సు దాటని వారు మాల ధరించి దీక్ష (41 రోజులు) పూర్తి కాదు. అందువలన వారికి శబరియాత్ర చేసే అర్హత లేదు.

20. దీక్షా సమయములో మన సన్నిదానము దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుతూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిదానము మూసివేయవలెను. సన్నిదానము స్వాములంతా కలిసి వేరే సన్నిదానములో ఉండవలెను. ఆ కళేబరము తీసిన తరువాత సన్నిదానమంతా శుభ్రపరచి ఆవు పంచకముతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుకోవలెను.

21. మండల దీక్షలో ఉండగా గ్రహణములు (సూర్యగ్రహణము,చంద్రగ్రహణము) ఏర్పడినపుడు విధివిధానంగా పట్టు స్నానము విడుపుస్నానము చేయాలి. అలాగే మన సన్నిదానములో కలశం వద్ద , గ్రహణము విడిచిన తరువాత కుశదర్భరేకులు వేసి ఉంచవలెను. గ్రహణము విడిచిన తరువాత స్నానమాచరించి  సన్నిదానము శుభ్రపరచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి. అలాగే గ్రహణ సమయమున తిను బండారము భిక్షలు చేయరాదు.

ఇంకా ఏవైనా తెలియని విషయాలు ఉంటే మీ గురుస్వామి ద్వారా తెలుసుకొని ఆయనగారు చెప్పినట్లు నడుచుకుని సద్గురునాధుని కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటు - మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్

పైన సూచించిన అన్నియు చాలా వరకు ఏ దీక్ష చేపట్టిన సుమారుగా ఇవే నియమాలు ఉంటాయి.

ఓం శ్రీ అనాధ రక్షకనే శరణం అయ్యప్ప



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.