ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత పేర్లను పెట్టుకోవటం పై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ లోని జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకంగా పేర్లు పెట్టుకోవడం పై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్మృతి ఇరానీ స్పందించారు.
జగనన్న గోరుముద్ద, జగనన్న పాల వెల్లువ, వైయస్సార్ సంపూర్ణ పోషణ అనే పలు పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం పై ఆమె స్పందిస్తూ ... కేంద్ర ప్రభుత్వాల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వాల సొంత పేర్లను & నచ్చిన పేర్లను పెట్టుకోవడం కుదరదని అలాగే MP రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు. అలాగే దీనిపైన నివేదిక కోరింది.
No comments:
Post a Comment