మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

నేటి బంద్ కు మేము సహకరించము - చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- నేడు జరగబోయే బంద్ కు తాము సహకరించమని చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట అధ్యక్షులు కూనాల వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వారు ప్రకటించిన బంద్ అది వారి వ్యక్తిగత దూషణలతో అప్రయోజనాత్మకంగా ఉన్న కారణంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించుట సహేతుకంగా లేనందున మేము  బంద్ కు మద్దతు తెలియపర్చుటలేదు. ఈ కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులు అనేక వ్యాపార మరియు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నందువలన, ఈ బంద్ వలన సమాజానికి సరైన ఉపయోగం లేనందున చాంబర్ ఆఫ్ కామర్స్ చిలకలూరిపేట వారు ఈ బంద్ కు సహకరించుట లేదు అని చిలకలూరిపేట చాంబర్‌ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు.





Share:

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

చిలకలూరిపేట:- నియోజకవర్గంలో నిరసన చేపట్టిన టిడిపి కార్యకర్తలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని టిడిపి కార్యకర్తలు మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయం పై జరిగిన దాడుల కారణంగా నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం నుండి నరసరావుపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అలాగే నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండల టిడిపి అధ్యక్షుడు బండారు సత్యనారాయణ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం పట్టణంలో టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే బంద్ ను విజయవంతం చేయాలని తెలిపారు.



Share:

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

రేపు చిలకలూరిపేట బంద్ కు అందరూ సహకరించాలి - ముద్దన నాగేశ్వరరావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందులో భాగంగా బుధవారం తలపెట్టిన చిలకలూరిపేట బందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ముద్దన నాగేశ్వర రావు  మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అదే విధంగా విశాఖ, కడప, హిందూపురం, విజయవాడ తదితర కార్యాలయాలు, నాయకుల ఇళ్ల పై భౌతిక దాడులు చేయడమే కాకుండా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటి పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో  ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఊరు,ఊరు తిరుగుతూ ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడమే కాకుండా ప్రజల పై అనేక రకాలుగా మోపుతున్న పన్నుల భారాన్ని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని అధికారపక్షం భౌతిక దాడులు చేయడం నీచమైన చర్య అన్నారు. ప్రశ్నించిన వారి పై భౌతిక దాడులు చేయడం అదే విధంగా కార్యాలయాలు ధ్వంసం చేయడం అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని హరించడమే అని, ప్రతిపక్ష పార్టీలుగా తాము చేస్తున్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువంటి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నేతలపై దాడి చేయడం,తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పై చేసిన దాడి అని అన్నారు. ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకతను రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి ప్రజల దృష్టి మార్చాలనే వైసీపీ లక్ష్యమని,ఇది ఒక ప్లాన్ ప్రకారం పక్కా వ్యూహంతో జరిగిన దాడిగా భావిస్తున్నామని ప్రభుత్వము తన విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.



Share:

రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

 రేపు ఏపీ బంద్ కు టిడిపి పిలుపు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ :-  మంగళవారం నాడు ఏపీ బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. మంగళవారం సాయంత్రం సమయంలో మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయాన్ని YSRCP కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా రేపు అనగా బుధవారం నాడు ఏపీ రాష్ట్ర బంద్ కు టిడిపి పిలుపునిచ్చింది. మంగళగిరి తో పాటు  రాష్ట్రంలోని పలు జిల్లాల టిడిపి ప్రధాన కార్యాలయాలపై దాడికి యత్నించడంతో పాటు  టిడిపి నేత పట్టాభి ఇంటిని ధ్వంసం చేయడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం విఫలం అయిందని మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మంగళగిరి జాతీయ రహదారిపై టిడిపి కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Share:

చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

చిలకలూరిపేట:- గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచిత ఫిజియోథెరపీ సేవలు - పట్టణ ప్రజలు సేవలు సద్వినియోగం చేసుకోవాలి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట :  చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని చీరాల రోడ్డులో ఉన్న‌ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఉచితంగా ఫిజియోథెర‌పి సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్ భ‌వ్య‌శ్రీ తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత అవినీతి నిర్మూలన , వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వవైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన  ఫిజియోథెరపీ సేవలపై స్థానిక బాపూజీ వృద్ధాశ్ర‌మం ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం అవగాహనసదస్సు నిర్వ‌హించారు.  వినియోగదారుల సంఘం అధ్యక్షుడుమురికిపూడి ప్రసాద్ అధ్యక్షత వహించారు.  ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ భవ్యశ్రీ మాట్లాడుతూ వృద్దులకు వయసు రీత్యా వచ్చే నొప్పులు, పక్షవాతం వచ్చిన వారికి,  షుగర్ పేషెంట్లకు,  బీపీ పేషెంట్లకు వచ్చే నొప్పుల గురించి వివ‌రించారు. మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఛాతి నొప్పి, ఎలర్జీలు గురించి తెలియ‌జేశారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా డైట్ చార్ట్ ఇస్తామని, గుండె సంబంధిత వ్యాధుల వారికి E.C.G చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక  క్యు ఉంటుందని ఎవరూ నిలబడనవసరం లేదని  వచ్చిన వెంటనే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నొప్పులు ఎక్కువగా ఉన్నవారు తమను సంప్రదిస్తే వెంటనే వైద్య సహాయం చేస్తామని ప్రధాన మంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా  అన్ని వయసుల వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల నొప్పులకు సంబంధించిన పరికరాలు, మెషిన్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు.    ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమం ఏఎన్ఎం పరమేశ్వరి, వినియోగదారుల సంఘం గౌరవ సలహాదారు ఆరాధ్యుల రామకృష్ణ పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట:- ముఖ్య రహదారి పై భారీ గుంత - మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టండి అని స్థానికుల ఆవేదన !

చిలకలూరిపేట:- ముఖ్య రహదారి పై భారీ గుంత - మున్సిపల్ అధికారులు దీనిపై దృష్టి పెట్టండి అని స్థానికుల ఆవేదన !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- పట్టణంలోని శారదా హైస్కూల్ రోడ్డు నందు ఏర్పడిన భారీ గుంత వలన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. చీరాల నుండి వచ్చే బస్సులు, లారీలు, కార్లు, పెద్ద వాహనాలు శారదా హైస్కూల్ మీదుగా కళామందిర్ సెంటర్కు చేరుతాయి. అయితే శారద హై స్కూల్ ఎదురుగా ఉన్న ఆ గుంత వలన ట్రాఫిక్ సమస్యల ఏర్పడటమే కాక చాలా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరత్రి సమయాల్లో గుంత లో ఉన్న ఇనుప చువ్వలు వలన వాహనాల టైర్లు పంచర్లు అవుతున్నాయని. నిత్యం రద్దీగా ఉండే ఇలాంటి రోడ్లను మున్సిపల్ అధికారులు గుర్తించి మరమ్మతులు చేయించి వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని స్థానికులు కోరారు.

Share:

చిలకలూరిపేట నియోజకవర్గం:- తహసీల్దార్ పై - దాడి పోలీసుల అదుపులో యువకుడు

చిలకలూరిపేట నియోజకవర్గం:-  తహసీల్దార్ పై - దాడి పోలీసుల అదుపులో యువకుడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం పరిధి య‌డ్ల‌పాడు మండ‌ల త‌హ‌శీల్దార్ శ్రీ‌నివాస‌రావు ఓ యువ‌కుడు ఇనుప‌రాడ్డుతో దాడికి పాల్పాడ్డాడు. త‌హ‌సీల్దార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సంబంధిత యువ‌కుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే - య‌డ్ల‌పాడు త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి సోమ‌వారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన యువ‌కుడు గోనుగుంట్ల క్రాంతికుమార్ వ‌చ్చాడు. త‌న పొలం విష‌యం త‌హ‌సీల్దార్‌తో మాట్లాడేందుకు ఆయ‌న ఉన్న గ‌దికి వెళ్లాడు. గ‌తంలో త‌న పెద‌నాన్న పేరుతో ఉన్న 50 సెంట్ల పొలం ఆయ‌న మ‌ర‌ణానంత‌రం త‌న తండ్రి పేరుమీద‌కు ఆన్ లైన్‌లో ఎక్కింద‌ని ఆ త‌ర్వాత త‌న పేరుమీద‌కు ఆన్‌లైన్‌లో న‌మోదు కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ  ఫోర్జ‌రీ ధృవ‌ప‌త్రాలు సృష్టించి త‌న మేన‌త్త కుమారుడు చిన్నశ్రీ‌రాములు త‌న పేరుమీద‌కు ఎక్కించుకున్నాడని ఫిర్యాదు చేశాడు. 2018లో అప్ప‌టి త‌హ‌సీల్దార్ ఆన్‌లైన్ చేశార‌ని, ఆ విష‌యం న్యాయ‌స్థానంలో తేల్చుకోవాల‌ని ప్ర‌స్తుత త‌హసీల్దార్ శ్రీ‌నివాస‌రావు క్రాంతికుమార్‌కు సూచించారు. త‌న పేరుతో న‌మోదు కావ‌ల‌సిన పొలం ఆన్‌లైన్‌లో ఎక్క‌లేద‌ని వాపోతూ స‌హ‌నం కోల్పోయిన క్రాంతికుమార్ త‌హ‌సీల్దార్ శ్రీ‌నివాస‌రావుపై ఇనుప‌రాడ్డుతో దాడికి పాల్ప‌డ్డాడు. గాయ‌ప‌డిన త‌హ‌సీల్దార్ య‌డ్ల‌పాడు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న ఎస్ ఐ రాంబాబు యువ‌కుడు క్రాంతికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.



Share:

చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్

 చిలకలూరిపేట:- ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మరో యాక్సిడెంట్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:-  పిఎస్ ఫైవ్ ఆపోజిట్లో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినది. రామచంద్రపురం గ్రామానికి చెందిన తాళ్లూరు ఇజ్రాయేలు (40) మార్తమ్మ (32) కీర్తన (15) చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రముఖ చర్చ నుండి ప్రార్థనకు వెళ్లి తిరిగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది.టు వీలర్ మీద ముగ్గురు చిలకలూరిపేట పేట నుంచి రామచంద్రపురం వెళుతున్నారు. అప్పుడే అక్కడ అనంతారం క్రాస్ రోడ్డు వద్ద హైవే క్రాస్ చేస్తూ ఎక్సెల్ మీద మద్దిరాల ప్రేమానందమ్మ వచ్చింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ప్రేమానందమ్మ  కుడి చెయ్యి మణికట్టు విరిగింది. ఇజ్రాయేలు, మార్తమ్మ, కీర్తనలకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 చిలకలూరిపేట అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.




Share:

చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు

 చిలకలూరిపేట - పేట భగీరధుడు జాన్ డేవిడ్ జయంతి నేడు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: ఏఎంజి, ఫార్ కార్నర్స్, వేద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ గారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిలకలూరిపేట లోని జాతీయ రహదారి పక్కన ఉన్న జాన్ డేవిడ్ గారి సమాధి వద్ద కుటుంబ సభ్యులు, AMG ఫార్ కార్నర్స్, వేద సంస్థల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాన్ డేవిడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెస్సి యస్ బర్నబాస్ మాట్లాడుతూ... డాక్టర్ జాన్ డేవిడ్ ఏర్పాటుచేసిన స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కష్టాల్లో ఉన్న  ఉన్న లక్షలాది మంది ప్రజానీకం సేవలు అందుకుంటున్నారని అన్నారు. గొప్ప మానవతావాది జాన్ డేవిడ్ అని అన్నారు. చిలకలూరిపేట పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేసిన అపర భగీరథుడు జాన్ డేవిడ్ అని కొనియాడారు. జాన్ డేవిడ్ ఆశయ సాధనకు తమ వంతు కృషి కొనసాగిస్తామని అన్నారు.

జాన్ డేవిడ్ గారు ఒక పార్టీకి ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తిగా కాకుండా పట్టణంలోని ప్రతి ఒక్క ఒక ఇంటికి మంచి నీటి కష్టం లేకుండా చేసినటువంటి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పట్టణంలోని అన్ని ఏరియాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉంది అంటే దానికి కారణం జాన్ డేవిడ్ గారు.



Share:

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

చిలకలూరిపేట - ఆదివారం ప్రార్థనకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురికి గాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: జాతీయ రహదారిపై చిలకలూరిపేట పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ బైపాస్ రోడ్డు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన ఏడుగురు ఆదివారం పట్టణంలోని భావనారుషి నగర్ వద్ద ఉన్న ఒక ప్రార్థనమందిరానికి వెళ్ళి తిరిగి వెళ్లే ఈ క్రమంలో గుంటూరు వెళ్లే రోడ్డు వైపు నుంచి హెచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా రజక  కాలనీ వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ఈ సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వెళ్తున్న కారు వేగంగా ఆటోను ఢీ కొట్టింది... ఈ సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గొల్ల శేవీరియేలు 60 సంవత్సరాలు  తలకు తీవ్ర గాయమైంది. ఎం.అక్షయ (14)కు కుడికాలు యాంకిల్ లో ఓపెన్ ఫ్రాక్చర్ అయింది. బొందు ప్రసన్న (25) తలకు గాయమైంది, బంధు విజయ్ (29) లెఫ్ట్ షోల్డర్ కి దెబ్బ తగిలింది. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 అంబులెన్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురికి ప్రథమ చికిత్స చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్

చిలకలూరిపేట - విజయబ్యాంక్ సమీపంలో మరొక రోడ్డు ప్రమాదం - బైకుని ఢీ కొట్టిన కార్


చిలకలూరిపేట విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టిన కారు ఈరోజు అనగా శనివారం ఉదయం అంబులెన్స్ ఆటో యాక్సిడెంట్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే - సాయంత్రం 9 గంటల సమయంలో పట్టణంలో సుభాని నగర్కు చెందిన ఖాజావలి అనే వ్యక్తి విజయ బ్యాంక్ సెంటర్ నుండి పండరీపురం వైపు వెళ్లే సమయంలో చెన్నై నుండి గుంటూరు వైపుకు వెళుతున్న కారు ఢీకొన్నది. ఈ సమయంలో ఖాజావలి గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సదరు కారు సంబంధించిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకే రోజు విజయ బ్యాంక్ సెంటర్లో రెండు ఘటనలు జరగటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.



Share:

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

చిలకలూరిపేట :- వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను చంపిన భర్త

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానంతో భార్యను పొలంలో చంపిన ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గూడవల్లి కిరణ్ అనే వ్యక్తి అప్పాపురం గ్రామానికి చెందిన బుజ్జి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే గత 12 సంవత్సరాలుగా వీరు అప్పాపురం లోనే ఉంటూ వ్యవసాయం మీద జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుండో కిరణ్కు భార్య పైన వివాహేతర సంబంధం ఉన్నదన్న అనుమానం ఉండేది. అనుమానం రోజురోజుకు పెరిగి శనివారం ఉదయం భార్యతో పాటు పొలానికి మందు చల్లడానికి వెళ్లారు. 11 గంటల సమయంలో కిరణ్ బంధువులకు ఫోన్చేసి ఉన్నట్టుండి తన భార్యకు ముక్కులో నుండి రక్తస్రావంతో పడిపోయిందని తెలిపాడు. అక్కడికి చేరుకున్న బంధువులు ఆమె తలపై ఉన్న గాయంతో పాటుగా మేడపైన ఉన్న గొర్ల గుర్తుల ఆధారంగా ఆమెను హత్య చేసి ఉంటారని భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశీలించగా విచారణలో కిరణ్ తన భార్యను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేసుకున్నారు.





Share:

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

ఆంధ్రప్రదేశ్ - రాష్ట్రంలో రేపటి నుండి కరెంటు కోతలు నిజమేనా !??

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని విలేకర్ల సమావేశంలో తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆదివారం నుండి 4 గంటలు కరెంటు కోతలు ఉంటాయి అనే వార్త చెక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఈ వార్తపై స్పందిస్తూ కరెంటు కోతలు వాస్తవమే కానీ రోజుకి 4 గంటల కరెంటు కోత ఉంటుందని, అది కూడా ఆదివారం నుండి అమలులోకి వస్తుంది అనే వార్త అవాస్తవమని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని వారు తెలిపారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏమీ ఉండదని. సీఎం జగన్ ప్రజలెవరూ ఇబ్బందులకు గురి అవకుండా చూడాలని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామాలలో సాయంత్రం 6 నుండి 10 వరకు పట్టణాలలో రాత్రి 9 నుండి 12 వరకు నగరాలలో రాత్రి 11 నుండి మూడు గంటల వరకు కరెంటు కోతలు ఉంటాయని అవాస్తవమైన వార్త చెక్కర్లు కొడుతుంది.దయచేసి ఎవరు నమ్మవద్దు అని వారు తెలిపారు.







Share:

చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

 చిలకలూరిపేట - విజయబ్యాంక్ వద్ద ఆటోను ఢీకొన్న అంబులెన్స్

చిలకలూరిపేట పట్టణంలోని విజయ బ్యాంక్ ముందు ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోని అంబులెన్స్ ఢీకొన్నది. వివరాల్లోకి వెళ్తే కలకత్తా నుండి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ విజయ బ్యాంక్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి వద్ద ఆటోను ఢీ కొట్టినది. ఆ సమయంలో ఆటో ఉన్న డ్రైవర్ షేక్ ఇస్మాయిల్ కు గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఇస్మాయిల్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్తో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న సీఐ రాజేశ్వరరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.