రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు
రెండు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు CIలు,ఇద్దరు కమిషనర్లు,ఇద్దరు తహసీల్ధార్లు మార్చటం చిలకలూరిపేట ప్రజలు ఎన్నడూ చూడలేదు - రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు
చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్
చిలకలూరిపేట - RTC బస్సు సమయాలలో మార్పు - బక్రీదు పండుగకు సామూహిక ప్రార్థనలు అనుమతులు లేవు - ఇన్సిడెంట్ కమాండర్
సోమవారం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మాట్లాడుతూ కర్ఫ్యూ సమయాన్ని తగ్గించారు. అలాగే RTC బస్సు పని వేళలను మార్చాలని అని RTC అధికారులకు సూచించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటలకల్లా బస్సులన్నీ డిపోకు చేరేలా ప్రణాళిక చెయ్యాలి అని తెలిపారు.అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఆటోలలో,ఇతర ప్రయాణాలు చేసే వాహనాలలో రద్దీ లేకుండా భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలి అని తెలిపారు.
త్వరలో ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ రానుండటంతో మసీదు ప్రదేశాలలో సామూహిక ప్రార్థనలకు అనుమతులు లేవు అని కనుక ఎవరి ఇళ్లలో వారి పండుగ జరుపుకోవాలి అని. అలాగే మసీదు సమీపంలో హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజేషన్ చేపించాలి అని తెలిపారు.
వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకి తీసుకువెళ్లాలి అని. వార్డులలో వాలంటీర్లు,AMNలు,ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది కరోనా చైన్ బ్రేక్ చేసే విధంగా చర్యలు చెప్పటాలి అని తెలిపారు.
నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు
నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు తగ్గింపు - ఉదయం 6 నుండి సాయత్రం 5 వరకు పని వేళలు - ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు
చిలకలూరిపేట పట్టణంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల సమయాలలో మార్పు చేస్తున్నట్లు ఈ రోజు సోమవారం నాడు జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జునరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాలి అని. సాయంత్రం 5 తర్వాత నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానున్నట్లు అయన తెలిపారు. అన్ని వ్యాపార,వాణిజ్య దుకాణాలలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి అని కరోనా ప్రోటోకాల్ పాటించని వారి పైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు.యువకులు క్రీడాకారులు ఆటలు ఆడరాదు అని ఆలా ఆడేవారి పైనా కేసులు నమోదు చేస్తాం అని తెలిపారు.
చిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది
చిలకలూరిపేట - కుప్పగంజివాగులో గల్లంతు కాబోయిన వ్యక్తిని కాపాడిన పోలీస్,ఫైర్ సిబ్బంది
చిలకలూరిపేట మండల గ్రామాలైన మానుకొండవారిపాలెం & ఏలూరు గ్రామాల మధ్యలో ప్రవహించే కుప్పగంజి వాగు ఎగువున కురిసిన వర్షానికి భారీగా వరద నీరు చేరింది.అయితే వేలూరు గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పైన వరద దాటానికి ట్రై చేసాడు. వరద ఉధృతికి బైకుతో సహా దాసు కూడా వరదలో కొట్టుకొని వెళ్ళబోయి అక్కడ ఉన్న చెట్టుకొమ్మకి చిక్కుకొని ఆగిపోయాడు. అంతలో అప్రమత్తం అయిన గ్రామస్థులు MLA రజని ని సంప్రదించగా ఆమె వెంటనే స్పందించి సదరు వ్యక్తిని కాపాడలిని అధికారులను ఆదేశించారు. వెంటనే అప్రమత్తం అయిన ఫైర్,పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని దాసు ను కాపాడారు. మునిసిపల్ ఛైర్మెన్ రఫాని హుటా హుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రురల్ SI భాస్కర్,ఫైర్ ఆఫీసర్ సునీల్ తోపాటు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు దౌలతాఖాన్ ఆధ్వర్యంలో దాసుని ప్రాణాలతో రక్షించారు. అయితే వాహనం మాత్రం వరద ఉధృతిలో కొట్టుకుపోయింది.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాలలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండలం & యడ్లపాడు మండల గ్రామాలలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
నాదెండ్ల మండల గ్రామాలలో 9 కేసులు నమోదు అయ్యాయి.
అప్పాపురం గ్రామంలో - 1
చిరుమామిళ్ల గ్రామంలో - 4
నాదెండ్ల గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి.
పురుషోత్తమపట్నం లో - 2 గా నమోదు అయ్యాయి.
కరోనా కేసులు తగ్గుతున్నాయి అని మాస్క్ లేకుండా బయటకి వస్తే పరాధరుసుము వెయ్యటానికి టౌన్ పోలీసువారు రెడీగా మీకోసమే వేచివున్నారు జాగ్రత్త. రాష్ట్రం మొత్తం ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ కరోనా ప్రోటోకాల్ పాటిస్తూన్నారు. మన పట్టణంలో మాత్రం కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కరోనా ప్రోటోకాల్ పాటించండి 🙏.
చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.
చిలకలూరిపేట - మన మంచినీటి చెరువును కాపాడేవారు లేరా - మునిసిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు.
చిలకలూరిపేట - పట్టణంలోని ప్రజలందరి దాహం తీరుస్తూ వారి నిత్య అవసరాలు తీరుస్తున్న మన అందరి జీవనాధారం పట్టణ శివారులలో ఉన్న మన మంచినీటి చెరువు. ఇంతమందికి జీవనాధారం అయిన మంచినీటి చెరువుకు భద్రత కరువైంది. గత కొంత కాలం క్రితం చెరువు చెరువులో అకృత్యాలు ఎక్కువ అయిపోయాయి.పట్టణంలో ఇన్ని లక్షల దాహం తీరుతున్న మన మంచినీటి చెరువును పట్టించుకునే నాధుడు లేరా అని అక్కడికి వచ్చిన పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికి అయినా మునిసిపల్ కమిష్నర్ చెరువు దగ్గిర పరిస్థితిని సమీక్షించాలి అని ప్రజలు కోరుతున్నారు. సాయంత్రానికి చెరువులో గేదెలు,మేకలు జలకాలాడటం పట్ల పట్టణ ప్రజలు ఒకింత అభద్రతకు లోనవుతున్నారు. అధికారులు వీటి పైనా తగిన చర్యలు తీసుకోవాలి అని సామాన్యులు కోరుకుంటున్నారు.
చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు
చిలకలూరిపేట టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వరరావు
చిలకలూరిపేట టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న బిలాలుద్దీన్ ను పేకాట నిర్వహణ విషయంలో అధికారులు విఆర్ కి పంపారు. అయితే ఇంకమీదట జి.రాజేశ్వరావు గారు టౌన్ సీఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు.శుక్రువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. టౌన్ పోలీస్టేషన్ నందు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. గతంలో ఆయన మొదటిగా 2004 లో అచ్చంపేట SI గా మొదలై రేపల్లె,చెరుకుపల్లి ప్రాంతాలలో SI గా విధులు నిర్వహించి తరువాత మాచర్ల CIగా , నరసరావుపేట దిశా పోలీసుస్టేషన్లో CI గా పనిచేస్తూ ఇప్పుడు మన చిలకలూరిపేటకి CIగా వచ్చారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021,శుక్రువారం నాడు మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
డైక్ మెన్ నగర్ లో - 1
పోలిరెడ్డిపాలెం లో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
సందెపూడి గ్రామంలో - 2
నాదెండ్ల మండలంలో 13 కేసులు నమోదు అయ్యాయి.
గిరిజవోలు గ్రామంలో - 8
నాదెండ్ల గ్రామంలో - 5 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపైనా కారు ఢీ కొని వ్యక్తి మృతి. వివరాలలోకి వెళ్తే పట్టణానికి చెందిన దేవరకొండ రాంబాబు తాతపూడి వైపు నుండి ద్విచక్ర వాహనం పైన పట్టణం వైపు వస్తుండగా వెనుక నుండి TS07GP4448 బ్లాక్ బెంజ్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నది. రాంబాబు బైక్ పైనుండి క్రిందపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి మృతిచెందారు.
చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణంలోని ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు కంటైన్మెంట్ జోన్ - మునిసిపల్ కమిషనర్
చిలకలూరిపేట పట్టణంలోని డైక్ మెన్ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర. గత రెండు రోజులగా ఆ ప్రాంతంలో 12 కేసులు నమోదు అవ్వగా కమిషనర్ కరోనా విస్తరించకుండా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అలాగే బాధితులను క్వారంటైన్ సెంటర్కు తరలించారు.అలాగే ఆ ప్రాంతం అంతా హైపోక్లోరిక్ సోడియం తో శానిటైజేషన్ చేపించారు. వారం రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని తెలియజేసారు.
నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
నేడు చిలకలూరిపేట నియోజకవర్గంలో కోవిషిల్డ్ ఎన్ని ఎన్ని డోసులు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేట నియోజకవర్గంలో 16-07-2021 శుక్రువారం నాడు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 45 సంవత్సరాలు దాటినా ప్రభుత్వ ఉపాయధ్యాయులకు మొదటిడొసు, రెండవ డోసు,పాలు ఇచ్చే తల్లులకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే వ్యాక్సిన్ వెయ్యనునట్లు నోడల్ డాక్టర్ గోపీనాయక్ తెలిపారు.
యడ్లపాడు పీహెచ్ సీ పరిధిలో - 600
నాదెండ్ల పీహెచ్ సీ పరిధిలో - 500
గణపవరం పీహెచ్ సీ పరిధిలో - 500
కావూరు పీహెచ్ సీ పరిధిలో - 800
పురుషోత్తమపట్నం యుపీహెచ్ సీ పరిధిలో - 200
రజక కాలనీ పీహెచ్ సీ పరిధిలో - 300
సుబ్బయ్యతోట పీహెచ్ సీ పరిధిలో - 200
పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ లో - 500 మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు.
చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం -
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ 2018లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయా చట్టల అమలు విషయంలో మీనమేషాలు లెక్కించడం వలన ఆనాటి నుంచి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్ గారి సూచన మేరకు భారతీయ జనతా యువమోర్చా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ధర్నాలు సంతకాల సేకరణలు వంటి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఫలితంగా ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన రెడ్డి గారు ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చారు. ఇది భారతీయ జనతా యువమోర్చా విజయంగా భావిస్తూనే ఇప్పటికైనా అగ్రవర్ణ పేదలకు ఆశాజ్యోతిగా మారిన ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా యువమోర్చా నరసరావుపేట పార్లమెంటు శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రతుకు భారంగా భావిస్తున్న అగ్రవర్ణ పేదలకు భరోసానిస్తూ ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి వారి జీవితాల్లో ఆనందం నింపిన మన ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రవర్ణ పేదల తరఫున ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ , పట్టణ అధ్యక్షులు నందిగామ రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ వంకాయలపాటి వంశీధర్,ఎడ్లపాడు మండల ప్రధాన కార్యదర్శి వంకాయలపాటి సాయి, ఏబీవీపీ రాష్ట్ర సభ్యులు మురారి, ఏబీవీపీ పట్టణ నాయకులు లీలా కృష్ణ పలువురు పాల్గొన్నారు
చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో 15-07-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజవర్గంలో 15-07-2021 గురువారం నాడు మొత్తం 12 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 5 కేసులు నమోదు అయ్యాయి.
డైక్ మెన్ కాలనీ లో - 3
రజక కాలనీ లో - 1
సుభాని నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి.
గోవిందపురం గ్రామంలో - 3
పసుమర్రు గ్రామంలో - 1
గొట్టిపాడు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండలంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
తిమ్మాపురం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.