మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఖరారు - ఆంధ్రాలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సహం 

https://chilakaluripetspeednews.blogspot.com/

తెలంగాణ పీపీసీ చీఫ్ నాటకానికి తెరపడింది. సీనియర్ నేతలను కాదని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించింది. పార్టీలో సీనియర్ నాయకుల మందకూడి చర్యల వలన తెలంగాణాలో కాంగ్రెస్ చాల వెన్నకి వెళ్ళిపోయింది. పార్టీలో యువరక్తం కోసం అని రాహుల్, సోనియా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.కొత్త రాష్ట్రము ఏర్పాటు కల్పించిన పార్టీ ఈ రోజు కనుమరుగు అవుతున్న క్రమంలో మళ్లీ తెలంగాణాలో కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగి ముందుకు సాగుతుందో లేదో చూదాం. 

తెలంగాణాలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఖరారు అవ్వగానే తెలంగాణాలో కన్న ఆంధ్రాలో తెలుగు తమ్ములు ఆనందంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పైన ఉన్న అభిమానాన్ని హల్చల్ చేస్తున్నారు. 2017 వరకు తెలంగాణాలో టీడీపీ కి వెన్నుముకగా ఉంటూ కొన్ని పరిస్థితుల దృష్ఠ్య కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర బాబు ని కలిసి పార్టీ నుండి బయటికి వచ్చారు. కానీ పార్టీ పైన కానీ నాయకులను కానీ ఈ రోజు తప్పుగా మాట్లాడకపోవటం, ఆ పార్టీలో ఉన్న జీవితం ఇచ్చిన పార్టీ ప్రేమను మర్చిపోవకపోవటం తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని అభిమానిస్తూ ఉంటారు. 

రేవంత్ రెడ్డి ప్రస్థానం :- 

1969 నవంబర్ 8 న అప్పటి ఉమ్మడి ఆంధ్ర, ఇప్పటి తెలంగాణ లోని పలమర్రు జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించారు. 2006లో జడ్పీటీసీ గా , 2007-09 వరకు MLC గా, 2009లో టీడీపీ నుండి MLA గా, 2014లో టీడీపీ నుండి కొడంగల్ లో మళ్లీ MLA గా, 2017 లో టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరి 2018 ఎన్నికలలో కొడంగల్ లో ఓడిపోయారు, 2018 లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వెంటనే 2019 మల్కాజ్గిరి ఎంపీ గా గెలిచి 2021 లో TPPC  చీఫ్ అయ్యారు.  






































Share:

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి శానిటైజర్ తాగి మృతి

చిలకలూరిపేట మార్కెట్ సెంటర్లో పూల వ్యాపారం చేసుకునే వ్యక్తి  శానిటైజర్ తాగి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో బెల్లంకొండ వాసు అనే యువకుడు మార్కెట్ సెంటర్లోని మైదానంలో పూలు అమ్ముకుంటూ బాబుగారి తోటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. సదరు యువకుడు దీర్ఘకాళికా వ్యాధితో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన ఆ యువకుడి భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎవరు పట్టించుకునే వారు లేక సరిగ్గా ఇంటికి రాకుండా పూర్తిగా మద్యానికి బానిసై 21వ తారీఖున సాయంత్రం సమయంలో మద్యం కొనుక్కోవడానికి డబ్బులు లేక శానిటైజర్ కొనుక్కొని తాగాడు. సదరు యువకుడు తీవ్ర అస్వస్తతకు గురి అవ్వటంతో అతనిని గుంటూరు GGH కి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. 





































Share:

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్

చిలకలూరిపేటలో గత వారం రోజులలో 9.2 % పాజిటివిటీ రేటు - చిలకలూరిపేటను రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాం - కమిష్నర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో శనివారం రోజున మునిసిపల్ కౌన్సిల్ హాలు నందు  శానిటరీ మేస్త్రులు, సేకరేటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర గారు మాట్లాడుతూ పట్టణంలో గత వారం రోజుల కరోనా రిపోట్స్ చూసుకునట్లు అయితే పోజిటివిటీ రేట్ 9.2 % మించి ఉండటంతో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నాము అని అయన తెలిపారు. అలాగే పట్టణంలోని వర్తక వ్యాపారాలు, చిల్లరకొట్టు వ్యాపారాలు కరోనా టెస్టులు చేపించుకునేలా చర్యలు తీసుకోవాలి అని. అలాగే సాయంత్రం 6 గంటల తరవాత వ్యాపారాలు పూర్తిగా ఆపివెయ్యాలి అని,లేనిచో అపరాధ రుసుము వసూళ్లు చెయ్యాలి అని అయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్క్ లు తప్పని సరిగా వాడాలి అని అయన తెలిపారు. 































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 26-06-2021,శనివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 



చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమవుదు అయ్యాయి.


సుబ్బయ్యతోట లో - 1

మార్కండేయ నగర్ లో - 2

కుమ్మరి కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 



మనుకొండవారిపాలెం గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 


















































Share:

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు - బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్

జాబ్ క్యాలెండరు పేరుతో నిరుద్యోగులని మోసం చేసారు -  బీజేపీ ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం మొత్తం 10,143 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండరు పేరుతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ చూసిన నిరుద్యోగుల యువత తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ ను నిరసిస్తూ బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేంద్రమోహన్ గారి ఆదేశాలతో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ నందు నిరసన దీక్ష చేపట్టారు. తక్షణమే ఈ జాబ్ క్యాలెండరు రద్దు చేస్తూ త్వరలో నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాల భర్తీ చేసే విధంగా కొత్త జాబ్ క్యాలెండరు రిలీజ్ చెయ్యాలి అని నరసరావుపేట ఆర్టీఓ ఆఫీస్ నందు ఆర్టీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్, జిల్లా నాయకులు నెమలికంటి బ్రహ్మం, వంశీ ,మురళి,నరేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ళ కోటేశ్వరావు, కామినేని హనుమంతురావు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/






























Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 25-06-2021,శుక్రువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి. 

సుధావరిపాలెం లో - 1

సుభాని నగర్ లో - 1

పురుషోత్తమపట్నం లో - 1

సాంబశివ నగర్ లో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. 

గోవిందపురం గ్రామంలో - 1

పసుమర్రు గ్రామంలో - 1

కమ్మవారిపాలెం గ్రామంలో - 2

మురికిపూడి గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 





















































Share:

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు

మరో కంపెనీ గోవిందా ! - ఏపీ నుండి తరలిపోనున్న15 వేల కోట్ల రిలయన్స్ ప్రాజెక్టు 

https://chilakaluripetspeednews.blogspot.com/

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. కొత్తగా విడిపోయిన తరువాత చాలా పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి అంతా మారిపోయింది. గత ప్రభుత్వం సంబంధించిన టెండర్లలో అవకతవకలు ఉన్నాయి అని భావించి, సీఎం జగన్ మోహన రెడ్డి రివర్స్ ట్రేండింగ్ మొదలుకొని రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావాలి అంటే భయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. ఏపీ కన్నా తెలంగాణ, తమిళనాడు లో ప్రశాంతంగా ఉంటుందనో ఏమో మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లు, ఐటీ హబ్బులు వెళ్లిపోయాయి. ఇపుడు పరిశ్రమలు స్టార్ట్ చేస్తే మళ్లీ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని పెద్ద పెద్ద కంపినీలు వేరే రాష్ట్రాలకి తరలిపోయాయి. 
తాజాగా రిలయన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చెయ్యాలి అనుకున్న 15వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ - సెట్టాప్ బాక్ససులు, ఢాంగిల్స్ మ్యానుఫ్యార్చిరింగ్ యూనిట్లకు బ్రేకులు వేసింది ఆ సంస్థ, కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 136 ఎకరాలను కేటాయించారు, దానిని ఈ ప్రభుత్వంలో 75ఎకరాలకు కి తగ్గించారు. ఆ 75 ఎకరాల భూమి ఉన్న రైతులు కేసు వెయ్యటంతో ఇక్కడ మనకి పని అవ్వదు అని అనుకున్నారో ఏమో రిలియన్స్ సంస్థ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునట్లు తెలుస్తుంది. 




























 



















































Share:

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు

ఏపీలో మొట్టమొదటి డెల్టా ప్లస్ కరోనా కేసు నమోదు 

https://chilakaluripetspeednews.blogspot.com/

అసలే కరొనతో అతలాకుతలం అయిన మన దేశంలో కొత్త వేరియంట్లు విజృభిస్తునాయి.కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ మొదలవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తొలిసారిగా ఏపీలో కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటి కేసు నమోదు అయ్యింది అని తెలిపారు. అయితే అతను కోలుకున్నారు అని, అతని వల్ల ఈ వేరియంట్ ఎవ్వరికి సోకలేదు అని తేల్చారు. రోజుకో ఫంగస్ పుట్టుకు వస్తుంది అని, ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకొని థర్డ్ వేవ్ కి సిద్ధంగా ఉండాలి అని అయన కోరారు. 



































Share:

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ

గుంటూరు జిల్లా - యుద్ధనికి అంతా సిద్ధం - కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదురుకుంటాం - డియంహెచ్ఓ 

https://chilakaluripetspeednews.blogspot.com/


కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రంగం అంతా సిద్ధంగా ఉన్నారు అని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజషన్ అధికారి యాస్మిన్ తెలిపారు. థర్డ్ వేవ్ వస్తుంది అని ఎవరు భయపడవద్దు. ఈ లోపు చాల వరకు వ్యాక్సిన్ పూర్తి చేసేస్తాం. చాలా వరకు కంట్రోల్ అవుతుంది.వ్యాక్సిన్ తీసుకోవటం వలన కరోనా నుండి సేఫ్ గా బయటపడవచ్చు. థర్డ్ వేవ్ కు 186 ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. అందులో 35 ఆసుపత్రులు చిన్నపిల్లల కోసం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలలో 10 పడకలకు ఆక్సిజన్ సప్లై ఉన్నాయి అని ఆమె తెలిపారు. 







































Share:

చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 5

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి. 

పసుమర్రు గ్రామంలో - 1

బొప్పూడి గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 



















































Share:

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి

చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం ఆధ్వర్యంలో MLA విడదల రజిని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల గోపి, మునిసిపల్ చెర్మన్ రఫాని, యార్డ్ చెర్మన్ బొల్లెద్దు చిన్న ముఖ్య అతిధులుగా విచ్చేసి 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేసారు. కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో మునిసిపల్ సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి అని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.పట్టణంలో ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చిన చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం తరుపున తమ వంతు కృషి చేసాము, చేస్తూనే ఉంటాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. 











































Share:

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత

మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత 

https://chilakaluripetspeednews.blogspot.com/q


చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ  మరో అరుదైన  ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి.  ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.  
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు. 

Book of Achievers 


కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే 

మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
  
    జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.

    అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....

 🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
 🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
 🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి               వారికి ఇచ్చే గౌరవం.
 🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.

         ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........

 🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ                            ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
 🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
 🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
 🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
 🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన  I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
 🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
 🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
 🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
 🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
 🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో........... 

అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు. 










































Share:

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.

చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు   బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది. 
























































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.