చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట - నాదెండ్ల,యడ్లపాడు మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు , నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల మండల గ్రామాలలో 6 కేసులు నమోదు అయ్యాయి.
గణపవరం గ్రామంలో - 5
కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 24-06-2021,గురువారం నాడు మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 5 కేసులు నమోదు అయ్యాయి.
పసుమర్రు గ్రామంలో - 1
బొప్పూడి గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి
చిలకలూరిపేట కూరగాయల మార్కెట్ వర్తకసంఘం ఆధర్యంలో ఘనంగా MLA పుట్టినరోజు వేడుకలు - 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి
చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం ఆధ్వర్యంలో MLA విడదల రజిని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విడదల గోపి, మునిసిపల్ చెర్మన్ రఫాని, యార్డ్ చెర్మన్ బొల్లెద్దు చిన్న ముఖ్య అతిధులుగా విచ్చేసి 100 మంది మునిసిపల్ సిబ్బందికి బట్టలు పంపిణి చేసారు. కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో మునిసిపల్ సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివి అని మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు.పట్టణంలో ఇలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చిన చిలకలూరిపేట కూరగాయల వర్తకసంఘం తరుపున తమ వంతు కృషి చేసాము, చేస్తూనే ఉంటాము అని తెలిపారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.
మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత
CHILAKALURI PET SPEED NEWSThursday, June 24, 2021ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం, భారత్
No comments
మన తెలుగు తేజం IAS మైలవరపు కృష్ణ తేజకు మరో అరుదైన ఘనత
చిలకలూరిపేట నుండి IAS గా ఎదిగి మన తెలుగు వారి స్థాయిని దేశం నలుమూలలా చాటి చెప్పే విధంగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో తన ఆలోచనలతో చాకచక్యంగా వాటిని అధిగమించిన మన IAS మైలవరపు కృష్ణ తేజ మరో అరుదైన ఘనత సాధించారు. కృష్ణ తేజకు ప్రతిష్ఠాత్మకం అయిన బుక్ ఆఫ్ అఛీవర్స్ నందు చోటు దక్కటం కృష్ణ తేజ కీర్తిని మరో స్థాయికి తీసుకువెళ్ళింది అని చెప్పాలి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో IAS గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 ఆగష్టు నెలలో కేరళలో వచ్చిన వరదలలో మన కృష్ణ తేజ తన ఆలోచనలతో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ నిర్వహించిన ఆపరేషన్ కుట్టనాడు ఆ రాష్ట్రం చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆ సమయంలో కేరళలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను తన భుజాల పైన వేసుకొని ఎంతో చాకచక్యంగా ఆ ఆపరేషన్ పూర్తి చేసారు.లక్షల మంది జీవితాల గురించి అలోచించి నిర్ణయం తీసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అంతటి క్రిటికల్ పరిస్థితులలో ఒక్క తప్పిదం జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వారు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆనాడు చేపట్టిన ఆపరేషన్ కుట్టనాడు కి గాను బుక్ అఫ్ అఛీవర్స్ నందు మన కృష్ణ తేజకు చోటు దక్కింది. బుక్ అఫ్ అఛీవర్స్ అంటే అసాధ్యాన్ని సాధించిన అరుదైన వ్యక్తుల గురించి అందులో పంచుకుంటారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన మన చిలకలూరిపేట ముద్దు బిడ్డ IAS మైలవరపు కృష్ణ తేజకు అభినందనలు తెలుపుకుంటున్నాము.
అలాగే కరోనా వీరవిజృభిస్తున్న సమయంలో కూడా కేరళ ప్రభుత్వం మన కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి కరోనా కట్టడికి కృషి చేసారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యత వ్యవహిరిస్తు తన ఆలోచనలతో నిర్ణయాలతో కరోనా తీవ్రతని తగ్గించారు.
Book of Achievers
కేరళలోని మన కృష్ణ తేజ ఆఫీస్ నందు పని చేసే ఉద్యోగి అయన గురించి ఏమి అన్నారో అయన మాటలలోనే
మనం నిత్యం ఎంతో మంది అధికారుల అవినీతి గురించి వింటూనే వుంటాం.డబ్బు సంపాదనే లక్ష్యంగా ఉద్యోగాల్లో చేరేవారు కొంతమంది అయితే, ప్రజలకు సేవచేయాలని వచ్చేవారు మరికొంతమంది. అలాంటి ఒక వ్యక్తి గురించి నేను విన్నది, చూసింది...........
జీవితంలో కొంతమందిని కలసినందుకు గర్వ పడుతుంటాం.అలాంటి ఒక వ్యక్తి గురించి, ఈయన పేరు కృష్ణతేజ మైలవరపు.కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం అల్లెప్పే సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.నేను అనుకోకుండా ఒక రోజు ఎన్నికల విధుల్లో బాగంగా అల్లెప్పేకి వెళ్ళటం జరిగింది.అప్పుడే ఈయన్ని కలిసే అదృష్టం దక్కింది.
అదృష్టం అని ఎందుకు అంటున్నానంటే....
🔹ప్రజలకు ఏదోకటి చేయాలనే సంకల్పం.
🔹ఒక అధికారిగా పాలనలో తనదైన ముద్ర చూపించాలనే ఉత్సాహం.
🔹 ఎదుటి మనిషితో నేను ఒక అధికారిని అనే గర్వం లేకుండా మాట్లాడే మనస్తత్వం, ఎదుటి వారికి ఇచ్చే గౌరవం.
🔹 సర్వీసులో చేరిన ముడేళ్లకే దేశ వ్యాప్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి.
ఆయన గురించి అక్కడి ప్రజలు,అధికారులు చెప్పిన కొన్ని విషయాలు...........
🔹 గతంలో వరదలు వచ్చిన సమయంలో కుట్టు నాడు ప్రాంతంలో వరద భీభత్సాన్నీ ముందుగానే ఊహించి ఆయన చేపట్టిన రేస్కూ ఆపరేషన్.
🔹 కేవలం 48 గంటల్లో రెండున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం.
🔹సమర్దవంతంగా శిబిరాల నిర్వహణ.
🔹 తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు తరలించంటం.
🔹వరదల అనంతరం ఆయన చేపట్టిన I AM FOR ALLEPPEY అనే కార్యక్రమం.
🔹వరదల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు తిరిగి కొత్త ఇళ్లు ఇవ్వటం.
🔹పిల్లల బడుల ఆధునికీకరణ, రక్షిత త్రాగునీరు ఏర్పాటు.
🔹 ఉపాధి కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం.
🔹I AM FOR ALLEPPEY ద్వారా ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది.
🔹 ఇంకా ఇటువంటివి మరెన్నో...........
అంటూ ఎన్నో విషయాలను పంచుకున్నారు.
చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.
CHILAKALURI PET SPEED NEWSThursday, June 24, 2021గుంటూరు జిల్లా, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట - MLA రజిని పుట్టిన రోజు సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు.
చిలకలూరిపేట - పట్టణంలో ఈ రోజు 24-06-2021 MLA విడదల రజిని పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని పలు సెంటర్లలో MLA ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే మోడ్రన్ మాల్ వద్ద భారీ ఎత్తున రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరుపున నిరు పేదలకు బట్టలు పంచారు. ఎరువుల కొట్ల బజారులో కూడా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వాడ వాడల ఈ రోజు రజిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. వార్డు స్థాయి వ్యక్తుల నుండి పార్టీ సీనియర్ నాయకులు వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. MLA పుట్టిన రోజుతో పట్టణం అంతా పండుగ వాతావరం అలుముకుంది.
చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు
చిలకలూరిపేట నియోజకవర్గం - యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు
చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి.
సొలస గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
నాదెండ్ల మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి
గణపవరం గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 23-06-2021,బుధవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
చిలకలూరిపేట పట్టణంలో 9 కేసులు నమోదు అయ్యాయి
సి ఆర్ కాలనీ లో - 1
సుభాని నగర్ లో - 3
మార్కండేయ నగర్ లో - 2
సాంబశివ నగర్ లో - 1
వెంగళరెడ్డి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామంలో 6 కేసులు నమోదు అయ్యాయి
బొప్పూడి గ్రామంలో - 1
కట్టుబడివారిపాలెం గ్రామంలో - 1
వేలూరు గ్రామంలో - 1
గోవిందపురం గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి
చిలకలూరిపేట - పాతబాకీ విషయంలో ఘర్షణ - కత్తితో దాడి
చిలకలూరిపేట - మండలంలోని కావూరి గ్రామంలో బుధవారం ఉదయం ఇరువురి మధ్య ఘర్షణ కత్తి తో దాడి చేసేలా దారి తీసింది. వివరాలలోకి వెళ్తే కావూరు గ్రామంలో రామారావు, కందుల రమేష్ అనే వ్యక్తి వద్ద నుండిడబ్బులు తీసుకున్నాడు. చాలా రోజులుగా అడుగుతుండగా డబ్బులు ఇవ్వకపోవటంతో గొడవ ముదిరి ఇద్దరు బహ బాహికి దిగారు. ఇంతలో రమేష్ కత్తితో రామారావు పైనా దాడి చేసాడు. ఈ ఘర్షణలలో రామారావుకి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో రామారావును చిలకలూరిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకువచ్చారు.
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు
చిలకలూరిపేట RVSCVS హైస్కూల్ కు చేరుకున్న 2021-2022 విద్య సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు
చిలకలూరిపేట - 2021-2022 విద్య సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ కు వచ్చేశాయి. మంగళవారం సాయంత్రం సమయంలో పాఠ్యపుస్తకాలు తీసుకొని APSRTC కార్గో వాహనం RVSCVS హైస్కూల్ కి చేరాయి. ఇక్కడ నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపినీ చేయనునంట్లు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ( MEO ) ఎల్. లక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు RVSCVS హైస్కూల్ నాకు చేరుకున్నాయి. ఇక్కడ నుండి త్వరలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు రెండు సంవత్సరాలు చదువుకి దూరం అయ్యారు. ఈ సంవత్సరం అయిన కరోనా తగ్గి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఉండాలి అని కోరుకుందాం.
చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్
చిలకలూరిపేట - రెండు ఉంగరాల కోసం హత్య - పెట్రోల్ తో తగలబెట్టి... - ఇద్దరు నిందితులు అరెస్ట్
చిలకలూరిపేట నియోజకవర్గ నాదెండ్ల గ్రామా శివారులలోని NSP కాలువ నందు మే నెల 8 వ తారీఖున గుర్తు తెలియని పెట్రోల్ తో తగలబడిన మృతిదేహానికి సంబంధించిన మిస్టరీని ఛేదించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే పని పట్ట లేక ఆకతాయిగా తీరుతూ ఉండే నాదెండ్ల లోని పెదమాల పల్లికి చెందిన అశోక్ అనే వ్యక్తి తో పటు బాల సంతోష్ అనే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కలిసి ఈ దారుణానికి ఒడికట్టారు.
నాదెండ్ల గ్రామంలో గ్రానెట్ వ్యాపారం చేసే నారాయణ అనే వ్యక్తి ని వీరిరువురు కలసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణ చేతికి వున్న రెండు ఉంగరాలు, అంతని స్కూటీ ని దొంగిలించాలి అని పధకం వేశారు. అశోక్ పైన చిలకలూరిపేట, అద్దంకి పరిసర గ్రామాలలో దొంగతనం చేసినట్లుగా 15 కేసులు దాకా ఉన్నాయి. అలాగే ఏ మధ్య కాలంలో ఆక్సిడెంట్ జరిగి దొంగతంలో యాక్టీవ్ గా పాల్గొనలేకపోతున్నాడు. అయితే నారాయణ వేలి ఉంగరాలు అమ్ముకొని కాలం గడపవచ్చు అనుకున్నాడు. రోజులాగే బహిర్భుమికి వెళ్లే నారాయణను సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మాటు వేసి ఉంగరాలతో పాటు 8000 నగదు దొంగిలించారు. విషయం బయటపడుతుంది అని బయపడి అంతని మర్మగాల పైనా ఇష్టం వచ్చినట్లుగా కొట్టటం వలన నారాయణ అక్కడికి అక్కడే చనిపోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకువచ్చి అతని పైన పోసి తగలబెట్టారు.
కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసారు.వారి వద్ద నుండి రెండు ఉంగరాలు,ఒక స్కూటీ రికవరీ చేసారు. కేసుని ఛేదించిన SI సతీష్ ను, ASI రవి చంద్ర ను, హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు, దేవరాజు, కానిస్టేబుల్ శివప్రసాదు, హోంగార్డ్ మధు బాబులను CI సుబ్బారావు గారు అభినందించారు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 22-06-2021,మంగళవారం నాడు మొత్తం 15 కేసులు నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి.
తూబాడు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 8
కనపర్రు గ్రామంలో - 1
ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి.
ఉన్నవ గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 22-06-2021, మంగళవారం నాడు మొత్తం 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 6 కేసులు నమోదు అయ్యాయి
మార్కండేయనగర్ లో - 3
సాలిపేట లో - 1
పండరీపురం లో - 2 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి.
వేలూరు గ్రామంలో - 1
రాజాపేట గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ సమీపంలో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
చిలకలూరిపేట పట్టణంలోని విజయాబ్యాంక్ అతి సమీపంలో పేకాట నిర్వహిస్తునట్లు వచ్చిన సమాచారంతో టౌన్ SI అజయ్ బాబు దాడులు నిర్వహించారు. హనుమయ్యమ్మ సత్రం పక్కనే ఉన్న విగ్నేశ్వరా కారు ట్రావెల్స్ వద్ద ఈ పేకాట నిర్వహిస్తున్నారు. ఈ దాడులలో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 మొబైల్స్, 3500 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారి పైన కేసు నమోదు చేసారు.
2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు
2021-2022 పోలీస్ భర్తీ పైన చిలకలూరిపేట అభ్యర్థులు ఏమి అంటున్నారు అంటే ! వారి మాటలలో - 8 లక్షల మందికి గాను 450 పోస్టులు
చిలకలూరిపేట - 2021-2022 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 450 పోస్టులు రిలీజ్ చేసింది. దీని పైన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నో రోజులుగా SI ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే మీరు వదిలిన పోస్థులను సంఖ్యను చూసి షాక్ కి గురి అయ్యాము అని అంటున్నారు. అందులో మన చిలకలూరిపేట పట్టణంలోని కొంత మంది అభ్యర్థులు ఏమి అంటున్నారో చూదాం.
మనోహర్ నాయుడు :- నా పేరు మనోహర్, గత ఎన్నిక ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతి ఇయర్ 6000 పోస్టులు భర్తీ చేస్తూ 4 సంవత్సరాలలో 24000 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. నేను బ్యాంకు ఎంప్లాయ్ పోలీస్ జాబ్ కోసం అని జాబ్ వదిలేసి పోలీస్ అవ్వటం కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదువుకుంటున్న, అయితే మొన్న జాబ్ క్యాలెండర్లో 450 పోస్టులు చూసి తీవ్ర నిరాశకిగురి అయ్యాను, అటు జాబ్ లేక ఇటు పోలీస్ జాబ్ పైన నమ్మకం లేక సతమతం అవుతున్నాను.
కిరణ్ :- నా పేరు కిరణ్ హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్న, 8 లక్షల మందికి 450 పోస్టులు ఏంటి అసలు 13 జిల్లాలకు ఎన్ని కానిస్టేబుళ్లు, ఎన్ని SI పోస్తులు వస్తాయి. అసలు దీనికన్నా కూడా పోస్టులు వదలకపోవటమే మంచిది. 6000 పోస్టులు అన్నారు ఇక్కడ మాత్రం 450 వదిలారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు.
శంకర్ నాయక్ :- అన్ని వదిలేసి పోలీస్ జాబ్ పైన ద్రుష్టి పెట్టి కష్టపడుతుంటే మీరు రిలీజ్ చేసిన పోస్టులు చూసి మా ఆశలు పైన నీళ్లు చల్లినట్లు ఉంది.
అమానుల్లా :- జగన్ వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టుకొంటున్నారు. మాలాంటి నిరుద్యోగుల జీవితాల తో ఆడుకుంటున్నారు. దయ చేసిన జీవో ని మార్చి మళ్లీ కొత్త జీవోలో మినిమమ్ 5000 పోస్టులు అయిన నిరుద్యోగులకు అందించండి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి.
రవికాంత్ :- మేము ఎంత కష్టపడినా 450 పోస్టులు 8 లక్షల మంది రాస్తే అందులో మనకి రావటం అంటే కష్టం. పోస్టుల సంఖ్య పెంచండి.
ఇలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, రోజు మంచినీటి చెరువు పైనా , చెరువు రోడ్డు, CR కాలనీ పార్క్, బొప్పూడి - చిలకలూరిపేట రోడ్డు, గొర్రెల సంత రోడ్డులో రన్నింగ్ చేస్తున్న కష్టపడుతుంటారు మన పేట అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులకు తగిన పోస్టులు రిలీస్ చేసి వారి భవిషత్ మంచి బాటలు వెయ్యాలి అని కోరుకుందాం.