మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - పసుమర్రు గ్రామంలో ఇంట్లో మంచి నీటి కోసం అని మోటర్ స్విచ్ ఆన్ చెయ్యబోయి కరెంటు షాక్ తో వ్యక్తి మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే పసుమర్రు గ్రామంలోని తన్నీరు కొండలరావు (56) బుధవారం నాడు మంచి నేటి కోసం అని మోటర్ స్విచ్ వెయ్యటానికి వెళ్ళాడు. అదే సమయంలో మోటార్ కి సంబంధించిన హై వోల్టాజి వైర్లు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్యతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.  


































































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు మొత్తం 21 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండలంలో 19 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

నాదెండ్ల గ్రామంలో - 4

సాతులూరు గ్రామంలో - 1

కనపర్రు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో -  6

చందవరం గ్రామంలో - 2

జంగాలపల్లి గ్రామంలో - 2

ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి 
 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి 
  

లింగారావుపాలెం గ్రామంలో - 1

ఉన్నవ గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 




































Share:

చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్

చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో కరోనా పరిస్థితులతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికీ ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్త సేకరణ పైనా చార్జీల తో ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడింది. వెంటనే 196,197,198 జివోలని రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.
చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ నందు టీడీపీ,కాంగ్రెస్,సీపీఎం పార్టీ శ్రేణులు పన్నుల పెంపు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ కరోనా కాలంలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల పైన భారం పడకుండా పన్నులో 50% రాయితీని కల్పించారు. కానీ ఇక్కడ మాత్రం కరొనతో చితికిపోయిన జీవితాలకు పన్నులు పెంచుతూ పెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ స్థాయి  నేతలు పాల్గొన్నారు. 












































Share:

చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు

చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట-  గణపవరం - వేలూరు రోడ్డు మార్గంలో శివ స్వాతి మిల్లు వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొంతా మోషే అనే డ్రైవర్ తో పాటుగా ఆటోలో ప్రయాణిస్తున్న బొంతా మరియమ్మ, పూర్ణమ్మలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరితో పాటుగా ఒక పసిపాప కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్సు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  



































Share:

చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.

చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో  1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత. 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నందు MLA రజిని చేతుల మీదుగా 1.17 కోట్ల రూపాయల చెక్కులు వాహన మిత్ర లబ్ధిదారులకు అందించారు.వాహన మిత్ర పధకం ద్వారా  చిలకలూరిపేట నియోజవర్గం మొత్తం మీద 1170 మంది డ్రైవర్లకు లబ్ది చేకూరుతుంది అని తెలిపారు. ఈ వాహన మిత్ర పధకంలో నియోజవర్గంలో 84% ST, SC BC , మైనారిటీ వారే ఉండటం విశేషం అని తెలియజేసారు. చెక్కుల పంపిణి తరువాత సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించారు.  అనంతరం మహిళా కౌన్సిలర్లను ఆటో ఎక్కించుకొని కొంచం దూరం నడిపారు MLA రజని. ఈ కార్యక్రమంలో MLA రజిని తో పాటుగా వార్డు మహిళా కౌన్సిలర్ల, పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ గ్రామాలలోని పెద్దలు, వైయస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

















































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

కృష్ణారెడ్డి డొంక లో - 1

పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి. 

కుక్కపల్లివారిపాలెం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

కావూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 



































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు. 

నాదెండ్ల మండల గ్రామాలలో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటి వివరాలు 

ఎండుగుంపాలెం గ్రామంలో - 2

చిరుమామిళ్ల గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో - 6

సాతులూరు గ్రామంలో - 1

నాదెండ్ల గ్రామంలో - 5 

చంద్రవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 


యడ్లపాడు గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి 























































Share:

చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.

చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు. 
చిలకలూరిపేట పరిధిలోని హైవే ఫీడర్ లైన్లు మరమ్మతులకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడును అని సి. హెచ్ రాంబొట్ల గారు తెలిపారు. NRT సెంటర్ నుండి హీరో షోరూం వరకు ఉన్న రోడ్లలో, గబ్బిటి వారి వీధి, మునిసిపాలిటీ ఆఫీస్ రోడ్, డైక్ మెన్ నగర్, కోర్టు బజార్, NRT సెంటర్ నుండి విజయాబ్యాంక్ రోడ్ వరకు ఉన్న అన్ని రోడ్డులలో, స్టేట్ బ్యాంకు, సిటీ యినియన్ బ్యాంకు హనుమాయమ్మ సత్రం, గాంధీపేట , హైస్కూల్ రోడ్డు నందు ఈ అంతరాయం ఏర్పడును.  









































Share:

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి.వాటి వివరాలు. 

చిలకలూరిపేట పట్టణంలో 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

వెంగళరెడ్డి నగర్ లో - 5

CR కాలనీ లో - 1

రెడ్ల బజార్ లో - 1

NRT సెంటర్ లో - 1 గా నమోదు అయ్యాయి 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

దండమూడి గ్రామంలో - 1

గోవిందపురం గ్రామంలో - 2

వేలూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 






































Share:

గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని

గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో 97,72,000 లక్షల విలువైన గుట్కా,ఖైనీ వంటి మత్తు పదార్ధాలు సీజ్ చేసాము - జిల్లా రురల్ SP విశాల్ గున్ని 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు రురల్ SP విశాల్ గున్ని ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో గడించిన 48 గంటలలో మొత్తం 97,72,000 సరుకుని సీజ్ చేసారు. స్పెషల్ టీమ్ గా ఏర్పడి జిల్లాలోని చిలకలూరిపేట,తెనాలి, వినుకొండ, శావల్యాపురం, నరసరావుపేట పరిధిలోని పట్టణ, గ్రామా ప్రాంతాలలో ముమ్మరంగా సోదాలు చేసారు అని తెలిపారు. రాష్ట్రంలోని బహుశా ఇదే అతి పెద్ద ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. 

* చిలకలూరిపేట పట్టణంలో 40 బస్తాల గుట్కా, ఖైనీ, నకిలీ సిగిరెట్లు, 1 కేజీ గంజాయి సీజ్ చేసారు. వాటి విలువ సుమారు 63,20,000 గా ఉండవచ్చు. 

* నరసరావుపేట రురల్ పరిధిలో 54,128 ప్యాకెట్లు గుట్కాలను, ఇతర మత్తు పదార్ధాలను సీజ్ చేసారు, వాటి విలువ సుమారు 6,30,000 గా ఉండవచ్చు. 

* వినుకొండ పట్టణంలో 226 బస్తాల ఖైనీ, గుట్కాలను, పొగాకు పదార్ధాలను సీజ్ చేసారు. వాటి విలువ సుమారు 11,20,000 గా ఉండవచ్చు. 

* తెనాలి పట్టణ పరిధిలో 40 బస్తాల గుట్కాలను, ఇతర మత్తు పదార్ధాలను సీజ్ చేసారు, వాటి విలువ సుమారు 11,00,000 గా ఉండవచ్చు.

* శావల్యాపురం పట్టాన పరిధిలో 18 బస్తాల నిషేధిత పొగాకు సీజ్ చేసారు. వాటి విలువ 6,00,000 గా ఉండవచ్చు. 

ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్ధాలను బెంగుళూరు నుండి తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి కర్ణాటక మరియు వేరే రాష్ట్రాలకి పంపించి ఈ అక్రమ దందా కి చెక్ పెట్టాలి అని చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న SI లు,సీఐ ,DSP లకు ప్రత్యేకంగా శుభాకాంషలు తెలిపారు. 
ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నెంబర్ 8866268899 నంబర్లకు కాల్ చెయ్యండి అని తెలిపారు. 

ముఖ్యంగా ఇలాంటి సమయాలలో పోలీసువారికి సహకరిస్తున్న మీడియా వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


https://chilakaluripetspeednews.blogspot.com/

















































Share:

ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱

 ఆగని పెట్రోల్ వీర బాదుడు 😱

https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో పెట్రోల్ వీరబాదుడు కొనసాగుతుంది. పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 30 పైసలు పెరిగాయి. సామాన్యులు పెట్రోల్ రేట్ల దాడికి తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకుల రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఢిల్లీ లో పెట్రోల్ - 96.41 గా డీజిల్ 87.28 గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ - 100.20 గా డీజిల్ - 95.14 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ - 101.35 గా డీజిల్ 95.72 గా ఉంది. మే 4 నుండి ఎప్పటి వరకు 24 సార్లు రేట్లు పెరిగాయి. 





































Share:

అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు

అక్రమ మద్యం,గుట్కా వ్యాపారం,పేకాట శిబిరాలు,రేషన్ మాఫియా,కేబుల్ మాఫియా,దొంగ బంగారం,ఇసుక మాఫియా లకు చిలకలూరిపేట అడ్డాగా మారింది - టీడీపీ నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట టీడీపీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణంలో జరుగుతున్న అక్రమాల గురించి చర్చించారు టీడీపీ నేతలు. అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలకలూరిపేట అక్రమాలకు అడ్డాగా మారిపోయింది అని తెలిపారు. గత లాక్ డౌన్ లో అక్రమ మద్యం వలన అరెస్ట్ చేసిన ఎక్ససైజ్ అధికారులకు అధికార పార్టీ నేతల నుండి కేసులు లేకుండా చూడాలి అని వత్తిడి తీసుకు వచ్చారు అని గుర్తు చేసారు. ఆయా అధికారిని బదిలీ చేసారు అని,ఓగెరు వాగులోని అక్రమ ఇసుక మాఫియా చాపక్రింద నీరులా సాగిపోతుంది అని. ఇక అక్రమ మద్యం, గుట్కా వ్యాపారాలు అయితే రేచిపోయి చెలరేగుతున్నారని, ఒక్కొక్కరి దగిర సుమారు 50 నుండి కోటి రూపాయ సరుకు దొరుకుతుంది అంటే చిలకలూరిపేట కేంద్రంగా రాష్ర వ్యాప్తంగా ఈ అక్రమ దందా జరుగుతుంది అని, పేకాట శిబిరాలు అయితే అచంగా అధికార పార్టీ నేతలే దగిర ఉండి నడిపిస్తున్నారు అని, రేషన్ మాఫియా కి అంతే లేదని రేషన్ డీలర్ల నుండి అక్రమ రేషన్ అమ్మే వారి వరకు అందరూ అధికార పార్టీ నేతలే అవటం విశేషం. దొంగ బంగారం గుట్టు చప్పుడు కాకుండా ఎదేచ్చగా సాగిపోతుంది అని. గతంలో పని చేసిన రురల్ SI కి అక్రమ బంగారం చొరవ చూపటం వలన VR కి పంపించారు అని, కేబుల్ మాఫియా అంటే ప్రజలందరూ డబ్బులు చెల్లించి టీవీ ప్రసారాలు చూదాం అనుకుంటే లోకల్ ఛానల్లో అధికార పార్టీ భజన తప్ప ఇంకేమి ఉండదు అని దీనితో ప్రజలు విసిగిపోయి DTH లను ఏర్పాటు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి అని, పార్టీకి అండగా ఉన్న దళితుల భూములను లాక్కున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని కచ్చితంగా గుణపాఠం చెప్తారు అని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ సీనియర్ నాయకులూ, ముఖ్య నాయకులూ పాల్గొన్నారు. 
























































Share:

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన MLA విడదల రజని 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. మొత్తం 36.25 లక్షల రూపాయల చెక్కులను 230 మంది  లబ్దిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు.
మొదటిగా లింగం గుంట్లకు చెందిన కృష్ణ మూర్తికి 45 వేలు. తుర్లపాడుకు చెందిన మార్తమ్మకు 65 వేలు, కావూరికి చెందిన రామావత్ లక్ష్మి నాయక్ కు 45 వేలు, నాదెండ్లకు చెందిన సాయిలక్ష్మి కి 60 వేల రూపాయకు చెందిన చెక్కులను తన ఆఫీస్ నందు లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిని నేరుగా వారి ఇళ్ల వద్దకె తీసుకు వచ్చి అందజేయనున్నట్లు తెలిపారు. పేదవారికి ప్రైవేట్ వైద్యం చేపించుకున్నాక వాటికి సంబందించిన బిల్లులను సీఎం సహాయనిధికి పంపించిన తరువాత వాటికి సంబంధించిన ఫండ్స్ చెక్కుల రూపంలో రిలీజ్ చేస్తారు. అలాగే మొత్తం 230 పేద వారికీ లబ్ది చేకూరింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల, వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 13-06-2021, ఆదివారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట నియోజకవర్గ యడ్లపాడు,నాదెండ్ల మండలాలలో 13-06-2021, ఆదివారం నాడు  నమోదు అయిన కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 21 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

యడ్లపాడు మండల గ్రామాలలో 8 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

కొత్తపాలెం గ్రామంలో - 3

జాలాది గ్రామంలో - 1

మైదవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

గణపవరం గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 5

సాతులూరు గ్రామంలో - 3

చిరుమామిళ్ల గ్రామంలో - 2

కనపర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 









































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.