ఏపీలో కరోనా పరిస్థితులతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికీ ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్త సేకరణ పైనా చార్జీల తో ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడింది. వెంటనే 196,197,198 జివోలని రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.
చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ నందు టీడీపీ,కాంగ్రెస్,సీపీఎం పార్టీ శ్రేణులు పన్నుల పెంపు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ కరోనా కాలంలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల పైన భారం పడకుండా పన్నులో 50% రాయితీని కల్పించారు. కానీ ఇక్కడ మాత్రం కరొనతో చితికిపోయిన జీవితాలకు పన్నులు పెంచుతూ పెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ స్థాయి నేతలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment