చిలకలూరిపేట - డబ్బులు డిమాండ్ చేసిన వార్డు లేడీ వాలంటరీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ - మూడు వార్డు అడ్మిన్లను బదిలీ
గత రెండు రోజులుగా పట్టణంలోని 27వ వార్డు వాలంటరీ లబ్దిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేసిన విషయం సామాజిక మాధ్యమాలలో, పట్టణ, రాష్ట్ర మీడియా ఛానళ్లలో కోడై కూసింది. వీడియో లో వాలంటరీ చెప్పినట్లుగా తాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంతా ఫై అధికారులకు వెళ్తుంది అని చెపింది. దీని పైనా సీరియస్ అయిన మునిసిపల్ కమిష్నర్ ఘటన తెలిసిన వెంటనే ఆయా వాలంటరీని విధుల నుండి తప్పించారు. అలాగే తాజాగా ఆమె పైన ఉన్న అడ్మిన్లను బదిలీ చేస్తూ మునిసిపల్ కమిష్నర్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసారు. 9,27,29 వార్డు అడ్మిన్లను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. 9 వ వార్డు అడ్మిన్ సిద్దాబత్తుని రాజేష్ ను 27 వ వార్డుకి , 29 వ వార్డు అడ్మిన్ కరిష్మాను 9 వ వార్డుకి, 27 వ వార్డు అడ్మిన్ గడ్డం మురళి కృష్ణ ను 29 వ వార్డుకి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.