మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు

చిలకలూరిపేట - రోటరీ క్లబ్ అఫ్ పండరీపురమ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో ప్రముఖ స్వచ్చంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ అఫ్ పండరీపురం వారి ఆధ్వర్యంలో 1.6 లక్షల విలువైన 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తెచ్చారు. అత్యవసరంగా పట్టణంలోని ఎవరికీ అయినా ఆక్సిజన్ అంధక ఇబ్బందికి గురి అయితే తమను సంప్రదించాలి అని తెలిపారు. కాన్సన్ట్రేటర్లు కావలసినవారు క్లబ్ సభ్యులు రాఘవయ్యని సంప్రదించాలి అని తెలియజేసారు.

మునిసిపల్ కమిష్నర్ డి. రవీంద్ర గారి ముఖ్య అతిధిగా హాజరై కాన్సన్ట్రేటర్లును ప్రారంభించారు. పట్టణంలోని పేదవారికి ఉపయోగపడే విధంగా కాన్సన్ట్రేటర్లు అందించటం పట్ల పురపాలకసంఘం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో దాతల సహకారం హర్షణీయం అని అన్నారు. ఈ సందర్భంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. 











































Share:

చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి

చిలకలూరిపేట - కరొనతో గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్న కానీ రోజులు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం గుత్తా వారిపాలెం గ్రామ సర్పంచ్ మాకినేని శారదా గారు ( 62) కరొనతో మృతి చెందారు. గత కొంత కాలంగా కరొనతో బాధపడుతున్న ఆమె గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆమె మృతి తో గ్రామంలోని ప్రజలు దీక్బ్రాంతికి గురి అయ్యారు. 






















Share:

చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్

చిలకలూరిపేట నియోజవర్గంలో నాటుసారాయి అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామము నందు నాటుసారాయి అమ్మే వారిని అదుపులోకి తీసుకున్నారు. చిరుమామిళ్ల గ్రామంలో చాపక్రింద నీరులాగా సారాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో నాదెండ్ల SI సతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో ఇద్దరికి అరెస్ట్ చేసారు. వీరు గ్రామంలో ఇళ్లలో నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం. రమేష్, బ్రహ్మం గా గుర్తించి వారి వద్ద నుండి 12 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. 




























Share:

చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !

చిలకలూరిపేట పట్టణం & నియోజకవర్గం పరిధిలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో రేపు 04/06/2021 శుక్రువారం నాడు ఎన్నెన్ని టీకాలు కేటాయించారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట నియోజకవర్గంలో ( మండలంలో,యడ్లపాడు, నాదెండ్ల ) రేపు అనగా 04/03/2021 శుక్రువారం నాడు వ్యాక్సిన్ వేసే కేంద్రాలు, కేవలం కోవిషిల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే 

 చిలకలూరిపేట పట్టణంలో 

గవర్నమెంట్ హాస్పిటల్ నందు - 300

సుబ్బయ్యాతోట మునిసిపల్ డిస్పెన్సరీ - 200 

రజక కాలనీ ఆరోగ్యకేంద్రం నందు - 300

పురుషోత్తమపట్నం నందు - 200 టీకాలను కేటాయించారు. 



నియోజకవర్గ పరిధిలో 

యడ్లపాడు పి.హెచ్.సి - 500

నాదెండ్ల - 400

గణపవరం - 500 టీకాలు వేస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ గారు తెలిపారు. 
















































Share:

చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి - పరిస్థితి విషమం

 చిలకలూరిపేట - మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నుండి క్రింద పడిన వ్యక్తి  - పరిస్థితి విషమం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - నరసరావుపేట రోడ్డు నందు లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద బైక్ పైనుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని సాంబశివనగర్ కి చెందిన శామంతపూడి వెంకటరమణ అనే వ్యక్తి కావూరు గ్రామం నందు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. మద్యం తాగి బైక్ పైనుండి పడి ఉండవచ్చు అని తెలుస్తుది. అయితే సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వటంతో గుంటూరు GGH కి తరలించాలి అని తెలిపారు. 






























Share:

03-06-2021 - చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు

03-06-2021 -  చిలకలూరిపేట మండలం, యడ్లపాడు మండలాలలో నమోదు అయిన కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/



చిలకలూరిపేట మండలంలో గురువారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

కుక్కపల్లి వారి పాలెం - 1

కావూరు - 6

లింగంగుంట్ల - 2

పోతవరం - 4 గా నమోదు అయ్యాయి 


అలాగే యడ్లపాడు మండలంలో 4 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

లింగారావు పాలెం - 1

బోయపాలెం - 1

తిమ్మాపురం - 2 గా నమోదు అయ్యాయి. 



























Share:

చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం

చిలకలూరిపేట - కరోనా కేసుల వివరాలు - 03/06/2021 గురువారం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలో 03-06-2021 న 7 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

వైయస్సార్ కాలనీ - 1

సుధ వారిపాలెం  - 2

క్రీస్తు కాలనీ - 1

మద్ది నగర్ - 1

దాసరి కాలనీ - 2 గా నమోదు అయ్యాయి. 
 

























Share:

గుంటూరు జిల్లాలో విదేశాలకు విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్

గుంటూరు జిల్లాలో విదేశాలకు  విద్య, ఉద్యోగాల రీత్యా వెళ్లే వారికి వ్యాక్సిన్లు - కలెక్టర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లాలో విదేశీ విద్యకు, ఉద్యోగానికి వెళ్లే వారికి వ్యాక్సిన్ వెయ్యాలి అని అధికారులకు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు.  18-44 మధ్య వయస్సు వారికీ ఈ వ్యాక్సిన్ సౌకర్యాన్ని కలిపిస్తునట్లు తెలిపారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డాక్యూమెంట్లను తీసుకురావాలి అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునే వారు తమకు ఫలానా బ్రాండ్ వ్యాక్సిన్ కావాలి అనే సౌలభ్యం లేదు అని స్ఫష్టం చేసారు. 



































 
Share:

చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త

 చిలకలూరిపేట పట్టణ & పరిసర గ్రామ ప్రజలకు కరోనా భారిన పడిన వారికీ శుభవార్త 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆయుష్ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో రిలీజ్ చేసిన మందు - ఆయుష్ -64 

ఇప్పుడు మన చిలకలూరిపేట నందు ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయుష్ సంస్థ వారు చిలకలూరిపేట యందు మందు పంపిణీకి 6 సెంటర్లలో సిద్ధం చేసారు. అందులో పట్టణంలో 3 సెంటర్లు , నియోజకవర్గం గ్రామాలలో 3 సెంటర్లలో పంపిణి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. వాటి వివరాలు

1) భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం, సుబ్బయ్యతోట - 9885790079

2) ఎ బి.వి.పి మురారి , చౌత్ర సెంటర్, ఆంజనేయ స్వామి గుడి రోడ్ - 9121733191

3) వెల్లంపల్లి శ్రీరాములు ( రాము), పాత పోలీస్టేషన్ రోడ్ , వినాయక గుడి ప్రక్కన - 9848421251

4) అమృత వాటర్ ప్లాంట్, గణపవరం - 9494847172

5) వేగ్నేశ్న అంజిరాజు, యడ్లపాడు - 7799662347

6) భవనం శ్రీనివాసరెడ్డి, చిరుమామిళ్ల - 9989546954

పైన తెలుపబడిన సెంటర్ల నందు ఉచితంగా మందు ఇవ్వబడును. 18-60 సంవత్సరాల వయసు మధ్య వారికే ఈ మందు, అలాగే మెడిసిన్ కావలిసిన వారు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకు రావాలి. అల్లోపతి, హోమియోపతి వాడే వారు కూడా ఈ మెడిసిన్ వాడ వచ్చు. ఈ మందు వాడటం వలన కరోనా నుండి ప్రాణాలతో బయట పడవచ్చు. 

అయితే గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, క్యాన్సర్ , గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు , దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిన ఉన్న వారు అర్హులు కారు, అనర్హులు  

గమనిక :- కరోనా వచ్చినవారి కుటుంబసభ్యులు, బంధువులు ఎవరినా వచ్చి ఈ మందు తీసుకువెళ్లొచ్చు. కరోనా రోగులకు అనుమతి లేదు. మాస్క్ పెట్టుకొని రావలెను.  

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ గుడిపల్లి భూషయ్య గారు దానికి సంబంధించి రిలీజ్ చేసిన  పత్రాన్ని చూడండి. 


https://chilakaluripetspeednews.blogspot.com/






































Share:

చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు

చిలకలూరిపేట - వీక్షకుల కోరిక మేరకు ఈ రోజు నుండి కరోనా కేసుల వివరాలు తెలుపబడును - 02-06-2021 కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో  02-06-2021 బుధవారం నాడు 13 కేసులు నమోదు అయ్యాయి. 
 
 పోలిరెడ్డిపాలెం :-1 

పండరీపురం 10, 9, 7 వ లైనులలో ఒక్కోకో కేసు నమోదు అయ్యాయి. 

ఆర్టీసీ కాలనీ :- 1

సుధా వారిపాలెం :- 4 

సుభాని నగర్ :- 1

రెహమత్ నగర్ :- 1

మద్దినగర్ :- 1 

మదర్ థెరిస్సా కాలనీ :- 1

   




















 
Share:

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు

ఏపీ ప్రభుత్వ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి వీరు అనర్హులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వైయస్సార్ వాహనమిత్ర పథకం క్రింద ఆటో డ్రైవర్లకు 10,000రూపాయల ఆర్థికసాయం అందించాలి అని సీఎం వైయస్ జగన్ మోహనరెడ్డి గారు ఈ పధకాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ పధకానికి క్రింది పేరుకున్న వారు అనర్హులు 

* 3 ఎకరాల మాగాణి , 10 ఎకరాల మెట్ట భూమి ఉంటే అనర్హులు . 
* మునిసిపాలిటీలలో 1000 చదరపు అడుగుల మించి ప్లేస్ ఉండకూడదు. 
* కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ ( ఆదాయపు పన్ను ) చెలించేవారు ఉంటే అనర్హులు . 
* కుటుంబంలో  గవర్నమెంట్ జాబ్,పింఛను పొందేవారు ఉన్న అనర్హులే. 
* ఆటో, టాక్సీ నడిపేవారు తప్ప , సరుకు రవాణా వాహనదారులు అర్హులు కారు. 
* గత ఆరు మాసాల ( 6 నెలల ) ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 600 యూనిట్ల కన్నా మించకూడదు. మించితే అనర్హులే. 
పైన పేరుకున్న వారు అనర్హులు 






























Share:

చిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు

చిలకలూరిపేట - కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వంలో వైయ్సర్ ఎవరో తెలీదు అని వారి పేర్లు మారిస్తే, యూజర్ చార్జీల పన్ను మోత ఆమోదం నిలిపివేయాలి - టీడీపీ వార్డు కౌన్సిలర్లు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు ఎర్పాటు చేసిన సమావేశంలో వార్డు కౌన్సిలర్లు మునిసిపల్ హాళ్లు నందు ఏక పక్షంగా నిర్ణయం తీసుంటునట్లు తెలిపారు. చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పు విషయంలో వైస్సార్సీపీ కౌన్సిలర్లు తమకు కల్లూరి చంద్రశేఖర్ ఎవరో తెలీదు అనటం విడ్డురంగా ఉంది అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైయస్సార్ ఎవరో తమకి తెలియదు అని వారి పేర్లు మార్పు చేస్తే ఏమి చేస్తారు. మన పాత ప్రజా ప్రతినిధులను గౌరవించుకోవటం మన సంస్కారం, వాటి పేర్లు ఉనంతకాలం వారి ఎప్పటికి అందరి మనసులలో నిలిచివుంటారు. అందుకు గుర్తిగా,వారి పైన గౌరవం తో వారికీ ఆయా పేర్లు పెట్టుకుంటారు అని తెలిపారు. చిలకలూరిపేటలో నిర్మించే కొత్త భవనాలకు వైయస్సార్ పేరు పెట్టుకోండి మేము అలంటి వాటికీ ఆక్షేపణ పెట్టాము అని తెలియజేసారు. ఎప్పుడు అయితే మార్కెట్ పేరు మారుస్తున్నారు అని పుర ప్రజలకి తెలిసిందో అప్పటి నుండి మీ పైన విమర్శలు మొదలయ్యాయి అని. వాటిని సమీక్షించుకోవాలి అని తెలిపారు. ఎప్పటికి అయిన పేరు మార్పుకు పునః సమీక్షించుకోవాలి అని తెలిపారు 

అలాగే చెత్త సేకరణ పురపాలక సంఘాల బాధ్యత, పట్టణంలో ప్రజలు యూజర్ చార్జీల పన్నుపైన తీవ్ర వెతిరేకతగా ఉన్నారు అని. ఫండ్ పుటించటం చేతకాక ఇలా ప్రజల పైన పన్ను భారం వేస్తున్నరు అని తెలిపారు.  
కరోనా వలన చనిపోయిన వారికీ ఉచిత వెహికల్ ఫోన్ నెంబర్ బోర్డులను ఆసుపత్రి ప్రాంగణంలో ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. 
మంచినీటి చెరువు వద్ద ఉన్న సుజల  వాటర్ ప్లాంట్ పునః ప్రారంభించి మినరల్ వాటర్ కొనే అవసరం లేకుండా చెయ్యాలి అని తెలిపారు 
ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు గంగా శ్రీనివాసరావు, పాములపాటి శివ కుమారి, జంగా సుజాత, కంచర్ల కరుణ, కనమర్లపూడి లక్ష్మి తిరుమల, రాయని హరిత, కొత్త కుమారి, కునాల ప్రమీల పాల్గొన్నారు  




























 

































Share:

చిలకలూరిపేటలో రోజుకి 300 నుండి 350 నో మాస్క్ కేసులు నమోదు అవుతున్నాయి - పట్టణ పోలీస్

చిలకలూరిపేటలో రోజుకి 300 నుండి 350 నో మాస్క్ కేసులు నమోదు అవుతున్నాయి - పట్టణ పోలీస్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో టౌన్ పోలీసువారి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన సెంటలలో నో మాస్క్ మరియు లాక్ డౌన్ సమయాలలో అనవసరంగా బయట తరుగుతున్న వారి పైన ప్రతి రోజు సుమారు 300 నుండి 350 కేసులు నమోదు చేస్తున్నట్లు టౌన్ పోలీస్ వారు తెలిపారు. 
అనవసరంగా సాకులు చెపుతూ రోడ్లపైన తిరిగే వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కర్ఫ్యూ సమయం కంటే ముందు గానే హాస్పిటల్,మెడికల్ కి సంబందించిన పనులను పూర్తి చేసుకోవాలి అని తెలిపారు. మరి కొన్ని రోజులు ఈ లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే కరోనా నుండి కొంచం ఉపశమన పొందవచు అని తెలిపారు.  






























Share:

ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర

ఏపీ లో సెంచరి కొట్టిన పెట్రోల్ ధర 

https://chilakaluripetspeednews.blogspot.com/

గత కొన్ని రోజుల క్రితం దేశంలో ఎన్నికలు ముగిసిన తరువాత నుండి పెట్రోల్ రేట్ మోత మోగించటం మళ్లీ మొదలైంది. ప్రస్తుత సమాజంలో మోటార్ వెహికల్ ఉండటం సాదాసీదాగా అయిపోయింది. అయితే దిగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా మినిమం టూ వీలర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ పెట్రోల్ భారం సామాన్యు ప్రజలు మోయలేనిదే అని చెప్పొచ్చు. వారి సంపాదనలో 20% &30% పెట్రోల్ ఖర్చు చేస్తే వారి జీవితం ఎలా సాగుతుందో అర్ధంకావటం లేదు. 
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పెంచటం వలన వచ్చే డబ్బులతో కరోనా ప్యాకేజీలు, టీకాలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. అటు టీకాలు సమయానికి దొరక్క , పెట్రోల్ బాదుడు సామాన్య ప్రజలకు సర్కారు పైన  విశ్వాసం తగ్గుతుంది అని చెప్పుతున్నారు ప్రతిపక్షాలు. 

ఈ రోజు విజయవాడ పెట్రోల్ రేట్ :- 100.48 , డీజిల్ :- 94.76

డీజిల్ రేట్లు పెరిగితే రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి. 
ఈ పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెరుగుదలతో సామాన్యు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. 




































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.