మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - క్వారంటైన్ సెంటర్ నందు ఫ్రూట్స్ పంపిణి చేసిన భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాలలో ఉన్న కరోనా కోరంటైన్ నందు పట్టణములోని భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఫ్రూట్స్ అందించారు ట్రస్ట్ సభ్యులు. కోరంటైన్ నందు భోజన సదుపాయాలు , మంచినీటి వసతి ఉన్న రోగులు త్వరగా కోలుకోవడానికి ఫ్రూట్స్ అందజేశారు. మందులతో పటు నాచురల్ ఫ్రూట్స్ వలన కలిగే లాభాలని తెలియజేసి వాటిని కరోనా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వడాల భాస్కర్ , కందుల రవి, వంశీ, సాయి మురారి, నాయుడు ఫణి, కీర్తి సాయి, గుడిపల్లి యశ్వంత్ పాల్గొన్నారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/


























Share:

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులలో ఆందోళన !!!

https://chilakaluripetspeednews.blogspot.com/
చిలకలూరిపేట సెంట్రల్ బ్యాంకు ఖాతా దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తారీఖున పలువురు బ్యాంకు సిబ్బంది కరోనా రావటంతో 3వ తరుకు నుండి బ్యాంకు మూసివేశారు . అప్పటినుండి మధ్యలో 1,2 రోజులు ఓపెన్ చేసినా బ్యాంకు పనుల నిమిత్తం ఖాతా దారులకు అనుమతి లేకుండా బ్యాంకు పనులు చూసుకొని మళ్లీ మూసివేశారు. ఇప్పటికే 15 రోజుల అవుతున్న కారణంగా వ్యాపారలావాదేవీలు కోసం వ్యాపారస్తులు, అత్యవసర లావాదేవీలు జరపటానికి బ్యాంకు మూసి ఉండటంతో బ్యాంకు ఖాతా దారులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్యాంకు ఓపెన్ చేసి అత్యవసర లావాదేవీలకు అనుమతించాలి అని కోరుతున్నారు 










































Share:

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు.

భగవత్ గీత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సేఫ్టీ పౌడర్ను ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫీసులకు అందజేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని భగవత్ గీతా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సేఫ్టీ కొరకు ప్రత్యేకంగా తాయారు చేయించిన పొడిని ఫ్రంట్ లైన్ వర్కర్స్ (మునిసిపాలిటీ ఆఫీస్, పోలీస్టేషన్, హాస్పిటల్స్ ) ఆఫీసు నందు అందజేశారు. ఈ పౌడర్ని ఏడు రకాల సుగంధ ద్రవ్యాలతో( జాజికాయ, జాపత్రి జాజిపువ్వు, అనాసపువ్వు, యాలుకాయలు, లవంగాలు, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం ) తాయారు చేసారు. ట్రస్ట్ అధ్యక్షులు గుడిపల్లి నాగభూషణం గారు  వీటి వలన కరోనా బాక్టీరియా గాలిలో విస్తరించకుండా కొంత వరకు కాపాడుతుంది అని తెలిపారు.కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా తాయారు చేయించారు అని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వీటిని  మునిసిపల్ చైర్మన్ రఫ్ఫాని గారికి, అర్బన్ CI బిలాలుద్దీన్ గారికి, రూరల్ CI సుబ్బారావు గారికి, కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కి అందించారు. ఈ కార్యక్రమంలో వడాల భాస్కర్, కందుల రవికుమార్, నాయుడు ఫణి, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.   

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/







































Share:

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం

చిలకలూరిపేట కరోనా మృతిదేహాలు తరలింపుకు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పురపాలకసంఘం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున కరోనా మృతి దేహాలను తరలించటానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేసారు. 
కరోనా కారణంగా పట్టణంలో చాలామంది చనిపోయారు.  హాస్పిటల్ ట్రాట్మెంట్ కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ చివరికి చాల మంది ఆక్సిజన్ అంధక, వ్యాధి తీవ్రతని ముందుగా గ్రహించలేక చివరకి చాలామంది మృతిదేహాలతో బయటకి వస్తున్నారు. అప్పటికే లక్షల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీకి గురి అయిన  మృతి చెందిన కుటుంబానికి ఆ మృతుదేహాలను ఖననం కొరకు శ్మశానం వరకు తరలించటానికి ఎవరు సహకరించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తు మళ్లీ అక్కడ ఇంకో 50 వేలు వరకు దోపిడీకి గురి అవుతున్న నేపథ్యంలో, అలాంటి వాటి అన్నింటికీ తెర దించుతూ పట్టణంలోని మునిసిపాలిటీ పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మెన్ షేక్ రఫాని గారు, మునిసిపల్ కమిషనర్ ఫణి కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫాని గారు ,మాట్లాడుతూ ఎవరైనా కరొనతో మృతు చెందిన వారికీ ఈ వాహనం సేవలు ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. 
ఉచిత వాహనం కొరకు రవికుమార్ :- 9948923050 , మస్తాన్ రెడ్డి :- 9951079006 ఈ నంబర్లకు కాల్ చేసి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న గారు, తలహఖాన్ గారు , దరియావాలి గారు పాల్గొన్నారు. 










































Share:

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 5లక్షల విలువ చేసే వైద్య సామాగ్రి అందజేసిన అసిస్ట్ సంస్థ  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - కరోనా వైద్య చికిత్సలు అందిస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్ నందు కరోనా రోగుల,వైద్యుల భద్రత కొరకు చిలకలూరిపేట ఇంటర్నేషనల్ సేవా సంస్థ అసిస్ట్ 5 లక్షల రూపాయల విలువగల వైద్య సామగ్రి అందజేశారు. ఆసుపత్రి వైద్యురాలు భవాని గారికి పి పి ఏ కిట్లు, ఎన్ 95 మాస్కులు , శానిటైజెర్ , సెలైన్ స్టాండ్లు,ధర్మామీటర్లు అందజేశారు. ఈ సందర్భంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఇంకా వైద్య సదుపాయాలు అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ కృష్ణ. రంగారావు గారు, సూర్యనారాయణ, డేవిడ్, రాజు,ఇమ్రాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు 
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట కరోనా మొదటి వేవ్ నందు గ్రామాల ప్రజలు తపించుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ మాత్రం గ్రామాలను కూడా వదలటం లేదు. చిలకలూరిపేట నియోజకవర్గ గ్రామాలలో మాత్రం ఈసారి ఏ పల్లెటూరుని కూడా వదలటం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం గా వ్యవహరించినా అసలు కనికరం చూపటంలేదు. ముఖ్యంగా యడ్లపాడు, పసుమర్రు ఏరియాలలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తుంది. గ్రామాలలోని ప్రజలు కొన్ని రోజులపాటు 10 రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి తెచ్చుకొని బయటకు రాకుండా ఉంటే పట్టణంలో కన్నా గ్రామాలలో త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. దయచేసి గ్రామాలలో ఉన్న యువకులు ముందుకి వచ్చి ఈ కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటిస్తూ తమ తమ గ్రామాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను సంప్రదించి ఊరులోని వ్యక్తులు బయట జాబ్ చేసుకునే వాళ్ళ నుండి కరోనా విపత్తు వివరించి చందాలు పోగుచేసి ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళని ఇళ్లలో నుండి బయటకి రావద్దు అని చెప్పి వారికీ ఆహార సదుపాయాలు చూసుకుంటే కొన్ని రోజులలోనే కరోనా విపత్తు నుండి బయటపడవచ్చు. గ్రామపెద్దలు సహకారంతో యువకులు ముందుకు వచ్చి నిలబడాలి అని కోరుకుంటున్నాము. ఎంతో మంది డబ్బు ఉన్నవారు కరొనతో చనిపోయినవారు ఉన్నారు కానీ అక్కడ డబ్బు ఉపయోగపడలేదు. మనుషులు మాత్రమే ముఖ్యం.  యువకులు తలుచుకుంటే ఏది అయిన చెయ్యవచ్చు. మన గ్రామాలను అందులోని మనుషులను కాపాడుకుందాం. కరోనా తతీవ్రత తగ్గినప్పటి నుండి గ్రామాలలో వ్యాక్సిన్ ప్రక్రియకు కూడా మీ సహకారం అందించి గ్రామ సుభిక్షతకు తోడ్పడండి.  



























Share:

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

చిలకలూరిపేటలో రేపు 15-05-2021 ఈ ఏరియాలలో కరెంటు ఉండదు !

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట రేపు శనివారం కారణంగా విధ్యుత్ మరమ్మతులు కోసం పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో కరంటు కోత విధిస్తున్నట్లు డి ఈ ఈ సీహెచ్ రంబొట్ట్లు గారు తెలిపారు. పట్టణంలోని ఎన్ ఆర్ టి సెంటర్ నుండి విజయ బ్యాంకు వరకు స్టేట్ బ్యాంకు , సిటీ యూనియన్ బ్యాంకు , హనుమాయమ్మ సత్రం,గాంధీపేట,హైస్కూల్ రోడ్డు, మునిసిపల్ ఆఫీస్ రోడ్డు, కొత్త పోలీస్టేషన్ రోడ్డు, డిక్మెన్ నగర్  ఉదయం 8:30 నుండి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది అని తెలిపారు . 






































Share:

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు

చిలకలూరిపేట- బోసిపోయిన అడ్డరోడ్డు సెంటర్ - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ వేడుకలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ నందు ప్రతి సంవత్సరం ఎర్పాటు చేసే సామూహిక ప్రార్ధనలూ కరోనా కారణంగా ఈసారి నిర్వహించలేక రోడ్లు అన్ని బోసిపోయాయి. అయినా పట్టణంలో రంజాన్ వేడుకలు కరోనా ప్రొటొకాల్ పాటిస్తూ ఘనంగా జరుగుతున్నాయి. పరిమితి సంఖ్యలో ముస్లిం సోదరులు మసీదులకు చేసుకొని మత పెద్దల సహకారంతో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అలాగే మసీదులకు రాని వారు తమ తమ ఇళ్లలోనే ప్రార్ధనలు నిర్వహించుకుంటున్నారు. దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా గా ఉండాలి అని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కట్టడికి కలిసి కట్టుగా కృషి చెయ్యాలి అని తెలిపారు మత పెద్దలు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ , శానిటైజేర్ వాడాలి అని తెలిపారు. 





























 

Share:

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం

MP పిలుపు మేరకు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పెరుగుతున్న ధాతల సహకారం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట కొన్ని రోజుల క్రితం ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు పర్యటించారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు మౌలిక సదుపాయాలు తనిఖీ చేశారు. హాస్పిటల్ గదులు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల శుభ్రతను పరిశీలించి దిశా నిర్దేశం చేసారు. అలాగే కరోనా వార్డు నందు బెడ్లు పెంపు నాకు లేఖ జిల్లా అధికారులకు రాసారు. అలాగే త్వరలో రెమిడీసివెర్ ఇంజక్షన్,ఆక్సిజన్ సీలిండర్ల పైనా ద్రుష్టి పెట్టారు.హాస్పటల్ నందు అత్యవసర గా కొంత మంది డాక్టర్లను, నర్స్ లను తీసుకోవాలి అని ప్రధాన వైద్యురాలిని కోరారు. అలాగే కొత్తగా తీసుకున్న వారికీ గవర్నమెంట్ జాబులకు రెఫరెన్సు సిఫారసు చేస్తాము అని తెలిపారు. దాతలు ఎవరైనా హాస్పిటల్ నాకు సహకారం అందించాలి అని పిలుపునిచ్చారు. 
 
ఎంపీ పిలిపు మేరకు హాస్పిటల్ నందు నాయుడు రమేష్ గారు మరుగుదొడ్లు నందు పైపులను మరమ్మతు చేపించారు, హాస్పిటల్ గదుల నందు కొత్త ఫ్యాను లను ఎర్పాటు చేసారు. అలాగే గురువారం నాడు అసిస్ట్ సంస్థ నుండి కరోనా రోగులకు ఆక్సిజన్ మాస్కులు, గన్ మీటర్లు, పేస్ షీల్డులు , డాక్టర్లకు,సిబ్బందికి పి పి ఏ  కిట్లను అందజేశారు . అలాగే సింగపూర్ నందు ఉంటున్న బైరా స్వర్ణలత గారు 20 ఆక్సిజన్ సీలిండర్లను అందజేశారు. అలాగే కరోనా వార్డులలో ఉన్న 20 బెడ్లను 30 కి పెంచారు. మరో రెండు రోజులలో మరిన్ని సౌకర్యాలను అందజేస్తాం అని మంత్రి అనుచరులు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు వైస్సార్సీపీ ముఖ్య నాయకులూ పాల్గొన్నారు.  


https://chilakaluripetspeednews.blogspot.com/


































Share:

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు

చిలకలూరిపేట ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు - పట్టణ ముఖ్య నేతలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ముందుగా చిలకలూరిపేట ముస్లిం సోదరులకు చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ తరుపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే పట్టణములోని ముఖ్య నాయకులూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. MLA విడదల రజని గారు, ప్రతిపక్షనేత మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు మాజీ MLA మర్రి రాజశేఖర్ గారు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు.అలాగే రంజాన్ విశిష్టత తెలియజేసారు. 
ఈ రంజాన్ పండుగ నుండి కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని అల్లా ని కోరుకుందాం. ప్రార్ధన సమయాలలో మాస్క్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం. 


































Share:

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు

చిలకలూరిపేట - పట్టణాన్ని పలకరించి వెళ్లిన మేఘాలు,వరుణ దేవుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట -  పట్టణాన్ని వరుణ దేవుడు అలా పలకరించి వెళ్లారు . కొన్నిరోజులుగా పట్టణములో ఎండలు మండిపోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మధ్యాహ్నం 12 తరువాత ఎవరు బయటకి రాకపోవటంతో ఎండల తీవ్రత అర్ధం కావటం లేదు కానీ బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈరోజు 3 గంటల ప్రాంతంలో నల్లటి మొబ్బులతో చల్లటి వాతావరం ఏర్పడింది. అయితే దానికి తోడు తుపాను తలపించేలా గాలులు వీచాయి. దీనితో పట్టణములోని ప్రజలు కొంచం సేపు వాతావరణాన్ని ఆస్వాదించారు. చల్లటి గాలులు, చిన్న చిన్న వర్షపు చినుకులతో రోడ్లు అన్ని తడిచాయి. ఇంతలోనే మొబ్బులు మాయం గాలులు ఆగిపోయాయి . 






















Share:

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే 

ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



శ్యామ్ కలకడ రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ సోషల్ మీడియా, పార్టీ  ముఖ్యనేతలకు ఈ పేరు తెలియని వారు ఉండరు. వైస్సార్సీపీ పార్టీకి సోషల్ మీడియా వెన్నుముక గా చెప్పుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో నిలబెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
శ్యామ్ కలకడ సొంత ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. వృత్తి రీత్యా సాఫ్టువేర్ ఇంజనీర్, బెంగళూర్ నందు ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్, ముఖ్యంగా తెలుగువారు ఎవరైనా బెంగళూర్ వచ్చారు అంటే అక్కడి వసతులకు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యకి ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి అనుకోకుండా 2010 నుండి రాజకీయాలకు దగ్గిరగా ఉండి వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి యువతను పార్టీకి దగ్గిర చేస్తూ , ముఖ్యంగా గత పాలకుల వైఫల్యాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు తెలిసేలా చేసి పార్టీ ని యువతలో బలోపేతం చేసిన వ్యక్తి . అలా బెంగళూర్ వేదికగా వైస్సార్సీపీ పార్టీ తెలుగు ప్రజలకు చేరువ చెయ్యటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ముఖ్య నేతలే ఒప్పుకుంటారు.బెంగళూర్ వైస్సార్సీపీ ఐటీ వింగ్ శ్యామ్ కలకడ 

అయితే కరోనా కారణంగా శ్యామ్ నిన్న తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది వైస్సార్సీపీ సోషల్ మీడియా డిపార్ట్మెంట్ సభ్యులు ఆయన మరణ వార్తను ట్రిండింగ్ చేసారు. ట్విట్టర్,ఫేసుబుక్కులలో ఎక్కడ చూసిన అతని పోస్థులే. పార్టీలో అంత చనువు ఉన్న ముఖ్య వ్యక్తి చనిపోతే సాయంత్రం వరకు కూడా సీఎం జగన్ స్పందించక పోవటం పార్టీ యువతను తీవ్రంగా కలచివేసింది. పార్టీ ఫాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని గురి అయ్యారు. పార్టీ ముఖ్య వ్వక్తి కరొనతో బాధపడుతుంటే మంచి వైద్యం అందించలేకపొయ్యారు అని. మంచి వైద్యం అందించి ఉంటే బ్రతికి ఉండేవాడు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్, ట్రేండింగ్ చేసారు అభిమానులు. ఎట్టకేలకు సాయంత్రం సమయానికి స్వయంగా సీఎం జగన్ శ్యామ్ భార్యకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. పార్టీ మీకు అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. సీఎం జగన్ స్పందనకు పార్టీ యూత్ కొంచం శాంతించారు. అయిన శ్యామ్ మరణం పార్టీ సోషల్ మీడియా కి తెరనిలోటుగా భావిస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/




ఎవరీ శ్యామ్ కలకడ ? - ఎందుకు అతని కోసం సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అంటే



https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/


https://chilakaluripetspeednews.blogspot.com/
























Share:

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్

చిలకలూరిపేట - దేవాలయాలలో,గోశాలలో,పబ్లిక్ ప్లేసులలో శానిటైజేషన్ చేపడుతున్న - ABVP, బీజేపీ, భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అఖిల భారత విద్య పరిషత్ (ABVP ), బీజేపీ,భగవతగీతా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,యువకులు సంయక్తంగా పట్టణములోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో స్వచ్చంధంగా శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. పట్టణములోని దేవాలయాలు,గోశాలలు, మార్కెట్ పరిసర ప్రాంతాలు,పాఠశాలలో  వైరస్ వ్యాప్తి చెందకుండా  ఈ శానిటైజేషన్ చేపడుతున్నారు. రోజుకు ఒక ఏరియా చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ కార్యకార్యకమాలలో ABVP -  మురారి,బీజేపీ - వంశీ, ఫణి , ట్రస్ట్ -  కందుల రవి, నాయుడు ఫణి , సాయి, నరసరావుపేట పార్లమెంట్ ఓబీసీ ,మోర్చా ఉపాధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి, డీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 




























 
Share:

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే

ఇక పైన ఇంటెర్నేష్నల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు - గూగుల్ పే  

https://chilakaluripetspeednews.blogspot.com/
గూగుల్ పే ప్రస్తుత పరిస్థితులలో డిజిటల్ పేమెంట్స్ తెలియనివారు ఉండరు. ఫోన్ పే , గూగుల్ పే బ్యాంకు ట్రాన్సక్షన్ మరింత సులభతరం చేసాయి. బ్యాంకులకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించటం  వలన సమయము కలిసి రావడంతో ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మొగ్గు చూపుతున్నారు. పల్లెలు, పట్టణాలు,గ్రామాలూ అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క చోట బడ్డీ కొట్టు నుండి పెద్ద పెద్ద మాల్స్ వరకు కూడా చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి.     
అయితే డిజిటల్ పేమెంట్ ఆల్ఫాబెట్ కంపెనీ కి సంబంధించిన  గూగుల్ పే ఇప్పుడొక శుభవార్త తెలిపింది. త్వరలో అంతర్జాతీయ పేమెంట్స్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి అమెరికా నుండి పేమెంట్స్ పంపుకోవటానికి వీలుగా ఎర్పాట్లు చేస్తున్నాము అని , అయితే అమెరికాలో కూడా గూగుల్ పే వాడే వారికి  మాత్రమే ఈ అవకాశం అని. త్వరలోనే అన్ని దేశాలలో ఈ ఫీచర్ని తీసుకువస్తాము అని తెలిపింది. 
గూగుల్ పే తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే ఎలా రెస్పాండ్ అవుతుందో చూదాం.  







































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.