చిలకలూరిపేట - ఆస్థి తగాదా విషయంలో ఘర్షణ - ఒకరు మృతి
చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్ కాలనిలో ఆస్థి తగాదా ఒకరిని బలి తీసుకుంది. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని వైస్సార్ కాలనిలో నివాసం ఉంటున్న జానీ బాషా అంతని బావమరిది సుభాని స్థలం విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ ముదరటంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో జానీ భాషా తండ్రి సుభాని అడ్డురాగా సుభాని(68) తీవ్రమ్గా గాయపడి అక్కడే మృతి చెందారు. జానీ భాషా బావమరిది సుభాని కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికుల వలన సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.