మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

చిలకలూరిపేట టౌన్:- ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మూడున్నర లక్షల విలువైన 35 గొర్రెల మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక జాలయ్య కాలనీకి చెందిన ఐదు కుటుంబాలు గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తుంటారు. ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 35 గొర్రెలు ఎక్కడికక్కడ విగత జీవులై పడి ఉండటంతో వారు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మరో 10 గొర్రెలు అస్వస్థతతో ఉండటంతో గమనించిన యజమానులు హుటా హుటిన వెటర్నరీ హాస్పటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని వైద్యశాలకు చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. డాక్టర్ చెప్పిన సమాచారం మేరకు గొర్రెలు ప్లాస్టిక్ కవర్లను, ఇతర కలుషిత పదార్థాలను తినడం వల్ల మరణించాయని ఆయన తెలిపారు. చనిపోయిన 35 గొర్రెలు విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని అంచనా ! అస్వస్థతతో ఉన్న 10 గొర్రెలను ప్రాణాలతో కాపాడాలని షేక్ రఫాని వెటర్నరీ వైద్యులకు తెలిపారు.



Share:

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం - పరామర్శించిన మర్రి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: పార్టీ అధికారములో లేకపోయినా అహర్నిశలు కష్టపడి పార్టీ అభ్యున్నతికి కృషిచేసి పదవి కాంక్ష లేకుండా ఎమ్మెల్యే టికెట్టు వదులుకున్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం. వివరాల్లోకి వెళ్తే చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని వేలూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోపి(30) అనే యువకుడు మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని తీవ్ర మనస్తాపంతో శనివారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన యువకుడిని చిలకలూరిపేట లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న మర్రి రాజశేఖర్ హాస్పటల్ కు చేరుకొని ఘటనకు పాల్పడిన వ్యక్తిని పరామర్శించారు.



Share:

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని మాట తప్పడంతో పాటు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మాటతప్పారని,ఉద్యోగుల సీపీఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానని నమ్మబలికి ఉద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చిన ఘనత సాధించారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైస్సార్సీపీ సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మర్రి రాజశేఖర్ ను మంత్రిగా చేస్తానని చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చిన జగన్ మర్రి రాజశేఖర్ కమ్మ కులస్తుడు కావడంతో కమ్మకులాన్ని అనగదొక్కాలనే ఆయనకు చివరిరోజు వరకూ వేచి చూసేలా చేసి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ప్రక్కన పెట్టారని,ఇది చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రజలను, ఆయన అభిమానులను మోసం చేయడమే అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.వైస్సార్సీపీలో పదవులకు సంబంధించిన విషయంగా ఈ అంశాన్ని చూడలేమని ఎమ్మెల్సీ,మంత్రి పదవి రాజ్యాంగ బద్ధమైన వి కనుక చిలకలూరిపేట కు రావాలనే ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరుగార్చడం వైస్సార్సీపీ పార్టీకి నష్టం కలిగించే విషయం అని మర్రి రాజశేఖర్ అభిమానులు మరోసారి మోసపోయిన విషయాన్ని గ్రహించి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో,గుంటూరు జిల్లాలో వైస్సార్సీపీ ని పునాదులు పెకళించి వేస్తారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.నియోజకవర్గ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్ కాంగ్రెస్ పాలన ఈ సంఘటనతో  అంతిమ క్షణాలు లెక్కించడం మొదలు అయిందని అన్నారు.పొన్నూరు నియోజకవర్గ పరిధిలో రావి వెంకటరమణ నుఇదే తరహాలో ఎమ్మెల్సీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన విషయం ఈసందర్భంగా గుర్తు చేశారు.



Share:

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నాలుగు ఆప్షన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఉప్పుతెల్ల. సిద్దు , మేకపోతుల నాగేశ్వరరావు లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 15వ తేదీన స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ డిసెంబర్ 10 వరకు అమలులో ఉన్నందున విరమించుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్ ,బి.సాయి నాయక్ , మాదాసు పృథ్వీరాజ్, ఎమ్.ఫణి, పి.మహేష్ ,జగదీష్ తదితరులు ఉన్నారు.



Share:

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు


చిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలం గ్రామాల నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం తెలిపారు. విద్యుత్ వినియోగ‌దారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యుత్‌  స‌ర‌ఫ‌రా నిలిపివేసే ప్రాంతాల వివ‌రాలివే..

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిల‌క‌లూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల, మండలాల గ్రామాలలో

చిల‌క‌లూరిపేట మండ‌లంలో...

చిలకలూరిపేట రూరల్ మండలం లోనీ మద్దిరాల33/11కేవీ సబ్స్టేషన్ లోని గోపాలంవారి పాలెం ఫీడెర్ మరమ్మత్తులు కారణంగా గోపాలంవారి పాలెం , యూ టి, యడవల్లి కట్టుబడివారిపాలెం గ్రామములో లోని  గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

నాదెండ్ల మండ‌లంలో...

గణపవరం 33/11కేవీ సబ్ స్టేషన్ లో   ఫీడర్లు  మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని గణపవరం, నాదెండ్ల, అప్పాపురం, చిరుమామిల్ల, తూబాడు, సంకురాత్రిపాడు  జంగాలపల్లి,సంకురాత్రిపాడు గ్రామాలకు మరియు గణపవరం గ్రామములోని పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. 

 యడ్లపాడు మండలంలో...

యడ్లపాడు మండలం లోని తిమ్మాపురం , బోయపాలెం, వంకాయలపాడు , జాలాది, మైదవోలు, జగ్గాపురం, కారుచొల, గుత్తవారిపాలెంగ్రామం లోని గృహ, వాణిజ్య, చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల  వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

చిలకలూరిపేట టౌన్ లో విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాల కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

https://chilakaluripetspeednews.blogspot.com/2021/11/13112021-9-2.html?m=1




Share:

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

 చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట పట్టణంలో రేపు 13/11/2021న ఉదయం 9 - మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిల‌క‌లూరిపేట రెండో శ‌నివారం సంద‌ర్భంగా రేపు 13-11-2021 చిలకలూరిపేట టౌన్ నందు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేసే స‌మ‌యం వివ‌రాల‌ను విద్యుత్‌శాఖ డీఈఈ సీహెచ్ రాంబొట్లు శుక్ర‌వారం తెలిపారు. విద్యుత్ వినియోగ‌దారులు గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని కోరారు. విద్యుత్‌  స‌ర‌ఫ‌రా నిలిపివేసే ప్రాంతాల వివ‌రాలివే..

చిల‌క‌లూరిపేట టౌన్ నందు

చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణంలోని మద్దినగర్,A1  ఫీడర్ విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, రహమత్ నగర్,కోమరవల్లిపాడు, శ్రీనివాస కాలనీ, దాసరి కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, వెంకటప్పయ్య కాలనీ , బాలాజీ థియేటర్ రోడ్డు, క్రిస్టియన్ పేట, వెంకటాఛారి నగర్, వెంగళరెడ్డి నగర్, యం వి నారాయణపురం, ఆర్ టి సి కాలనీ, రూరల్ పోలీస్ స్టేషన్ రోడ్డు, కృష్ణమహల్ రోడ్డు, గుర్రాల చావిడి, కొల్లారామారావుహాస్పిటల్ నుండి కలామందిర్ రోడ్డు వరకు మరియు టౌన్2 పరిధిలోకి పురుషోత్తమపట్టణం, అడ్డరోడ్డు సెంటర్ బొందిలిపాలెం, గుండయ్యతోట, వడ్డెరపాలెం, పందరిపురం, కృష్ణనగర్ ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.



Share:

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

విద్యార్థులపై పోలీసుల లాఠీ చర్యకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన - చిలకలూరిపేట విద్యార్థి JAC

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట: అనేక సంవత్సరాలుగా లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం కొనసాగించాలని..చిలకలూరిపేట విద్యార్థి జెఎసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు సిద్దు , జగదీష్ కోరారు. శుక్రవారం స్థానిక ఎన్ ఆర్ టీ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థలను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ పూర్తిగా వ్యవస్థను తీసివేయడం సమంజసం కాదని తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ అంశంపై నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయటం అన్యాయమన్నారు. పోలీసుల లాఠీఛార్జి కి వ్యతిరేకంగా నవంబర్ 15వ తేదీన చిలకలూరిపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్,బి.సాయి,  ఎం.ఫణి, కిరణ్ ,వి.మణి , యం.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.



Share:

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

చిలకలూరిపేట:- ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి క్లీనర్ మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట బెంగళూరు నుండి విజయవాడ కు వెళుతున్న లారీలో ఉన్న క్లీనర్ ఫిట్స్ రావడంతో లారీ లో నుంచి క్రిందపడి మృతి చెందిన ఘటన చిలకలూరిపేటలో జరిగింది. ఎస్ ఆర్ ఎమ్ టి పార్సిల్ కు సంబంధించిన లారీ విజయవాడ నుండి బెంగళూరు కు సరుకు దించి రిటర్న్ వస్తుండగా... చిలకలూరిపేట గణపవరం మధ్య ఉన్న కుప్ప గంజి వాగు బ్రిడ్జి పైన గుంటూరుకు చెందిన క్లీనర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో రన్నింగ్ లారీ నుండి కిందపడి మరణించినట్టుగా డ్రైవర్ రవి బాబు తెలిపారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీస్ వారు దర్యాప్తు చేపట్టారు.



Share:

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

మహిళా చదువు - అభివృద్ధి మెరుగు * ఆర్థికంగా వెనుకబడి టాలెంట్ ఉన్నా బాలికల విద్యాభివృద్ధికి నా వంతు సాయం చేస్తాను - సీఐ రాజేశ్వర రావు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీ లో ఏర్పాటుచేసిన మహిళ బాలికల రక్షణ మరియు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అందులో భాగంగా టౌన్ సీఐ రాజేశ్వరరావు మహిళల చదువు వారి యొక్క ఒక అభివృద్ధి అపోహల పై మాట్లాడుతూ సమాజంలో మహిళల చదువు ఎంతో ఉపయోగకరమని, మహిళలు చదువుకోవడం వలన సమస్యలు ఏర్పడతాయి... అన్నా అపోహల నుండి బయటకి రావాలని, తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ సొంత ఊరికి దూరంగా ఉండి విధులను నిర్వహిస్తున్నామని, కానీ మహిళలు చదువుకోవడం వలన స్థానికంగానే అనేక ఉద్యోగ సదుపాయాలు ఉన్నాయని. ఉదాహరణకు ఏఎన్ఎంలు ,వాలంటీర్లను చూపిస్తూ కష్టపడి చదవడం వలన సొంత ఊరిలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారని, అలాగే స్త్రీలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నెలకు లక్ష నుండి మూడు లక్షల వరకు జీతం సంపాదిస్తున్నారని, గుర్తు చేశారు. టాలెంట్ ఉండి ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు తన వంతు సహాయంగా కృషి చేస్తానని. ఈ సందర్భంగా సిఐ రాజేశ్వరరావు తెలిపారు. అలాగే దిశ చట్టంపై అవగాహన కలిగించారు. మహిళలు అభద్రతా భావాన్ని తొలగించుకోవాలని స్త్రీ ఒక శక్తిగా ఉండాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు తెలియజేశారు.



Share:

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు - సభ్యుల వివరాలు ఇవే

చిలకలూరిపేట:- విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు  - సభ్యుల వివరాలు ఇవే

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గంలోని పాఠశాలలు కళాశాలలోని విద్యార్థులు వారి యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం పట్టణంలోని విద్యార్థులు అందరూ కలిసి 10/11/2021 న‌ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) (నాన్ పొలిటికల్) ఏర్పాటు చేసుకున్నారు. ఈ అందులో భాగంగా విద్యార్థులకు వారి యొక్క హక్కులను తెలియజేస్తూ - హక్కులకు భంగం కలిగించే ఏ చర్యను సహించబోమని వాటిపై న్యాయ పోరాటం చేసి సాధించుకుంటామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ జేఏసీ కమిటీ ఏ పార్టీలకు సంబంధం లేదని విద్యార్థుల హక్కులను పరిరక్షించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ జేఏసీ విద్యార్థులందరికీ భవిష్యత్తుకు ఉపయోగపడేది లాగా పనిచేయాలని అని వారు తీర్మానించుకున్నారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్ గా సి ఆర్ కాలేజీ కి సంబంధించిన విద్యార్థి యు.సిద్దు, వైస్ ప్రెసిడెంట్ గా రోహిణి డిగ్రీ కళాశాల కు సంబంధించిన విద్యార్థి మేకపోతుల. నాగేశ్వరరావు, ఎం. సాయి తేజ, సెక్రెటరీగా గుడిపల్లి. జగదీష్, జాయింట్ సెక్రటరీగా మాదాసు. పృథ్వీరాజ్, ఎ. త్రినాధ్, ట్రెజరీ గా మండాది ఫణి, నెంబర్లుగా భగత్ సింగ్, పి. మహేష్, మురారి (DRNS), మస్తాన్ వలీ, ఆలీ బాబు గా తన 13 మంది సభ్యుల తో జేఏసీ ని ఏర్పాటు చేశారు.



Share:

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

అమరావతి రైతుల మహా పాదయాత్రలో ఉద్రిక్తత !!!

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈరోజు 11వ రోజు కి చేరింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా చదలవాడ ఊర్లో రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా. పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేశారు. రైతులకు మద్దతు తెలపడానికి వచ్చిన స్థానిక రైతుల పై కూడా లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో సంతనూతలపాడు గ్రామానికి చెందిన నాగార్జున అనే వ్యక్తి గాయాలయ్యాయి. రైతులను పాదయాత్ర చేయకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఘటన లోని రైతు మాట్లాడుతూ న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి ప్రతి ఊరు నుండి వేలాదిమంది ప్రజలు రైతులు మద్దతు తెలుపుతున్నారని. శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటూ ఉండే మాపై లాఠీ ఛార్జ్ చేయడం సముచితం కాదని వారు తెలిపారు.



Share:

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

దొంగ దొరికాడు - చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీస్ శాఖ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట ఈనెల 8 వ తారీఖున పండరీపురం 8 వ లైను నందు అంబటిపూడి శారద అనే మహిళ నడుచుకుంటూ వెళుతుండగా .. అది గమనించిన చైన్ స్నచర్ వెనకనుండి వచ్చి అమాంతం ఆమె మెడలోని మూడు సవర్ల బంగారపు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే టౌన్ పోలీస్ శాఖకు విషయం తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దుండగుడు పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్రబాబు గా గుర్తించారు. పోలీసు విచారణలో తాను పెయింట్ వర్క్ చేస్తుంటాడని, అప్పుల బాధతో ఇలాంటి చర్యకు పాల్పడ్డాడని తెలిపాడు. పోలీసులు బంగారు గొలుసును రికవరీ చేశారు. కేసు నమోదు చేసిన 24 గంటల్లోనే దొంగను పట్టుకోవడంతో సీఐ రాజేశ్వరరావు టౌన్ ఎస్ఐ ఫిరోజ్ ను అభినందించారు.



Share:

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు

చిలకలూరిపేట:- పొలాల్లోకి దూసుకు వెళ్ళిన RTC బస్సు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నుండి నరసరావుపేట బయలుదేరిన నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వచ్చి దారిలో అమీన్ సాహెబ్ పాలెం సమీపంలోని బసిక పురం గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లో కి వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అనంతరం వెనక నుండి వచ్చే ఆర్టీసీ బస్సు లో మిగిలిన ప్రయాణికులను ఎక్కించి బస్సు డ్రైవర్ నరసరావుపేట డిపో కి ఘటనను వివరించారు.



Share:

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

ప్రకృతి వైద్య నిపుణుడు( అవిసాపాలెం కట్టు) పూనాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. అవిసాపాలెం కట్టు అంటే దేశ నలుమూలల నుండి ప్రత్యేకంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాలలో కాళ్లు చేతులకు ఎముకలు ఏమి విరిగిన శస్త్రచికిత్సతో కాకుండా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తూ తమకంటూ ఒక గుర్తింపు పొందినది పూనాటి కుటుంబం. అయితే ఆ కుటుంబం లో ఒకరైన వైద్య నిపుణులు పునాటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. అవిసాపాలెం కట్టు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అంతటి గుర్తింపు కలిగిన వీరి వద్దకు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. 1900 సంవత్సరం నుండి పూనాటి వీరయ్య చౌదరి తదనంతరం వారి కుమారులు ఇప్పుడు వారి మనవళ్లు, ముని మనవాళ్ళు, వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. పూనాటి వెంకటేశ్వర్లు మృతి పట్ల గ్రామ పెద్దలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంతాపం తెలిపారు.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.