ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ
చిలకలూరిపేట: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నాలుగు ఆప్షన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చిలకలూరిపేట విద్యార్థి జేఏసీ అధ్యక్ష , ఉపాధ్యక్షులు ఉప్పుతెల్ల. సిద్దు , మేకపోతుల నాగేశ్వరరావు లు తెలిపారు. అదేవిధంగా నవంబర్ 15వ తేదీన స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ డిసెంబర్ 10 వరకు అమలులో ఉన్నందున విరమించుకోవడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య కార్యాచరణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్ ,బి.సాయి నాయక్ , మాదాసు పృథ్వీరాజ్, ఎమ్.ఫణి, పి.మహేష్ ,జగదీష్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment