మర్రి రాజశేఖర్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారు!మడమ తిప్పారు! - రావు సుబ్రహ్మణ్యం,నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.
చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు బహిరంగ సభలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పారని, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అనే ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని మాట తప్పడంతో పాటు అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మాటతప్పారని,ఉద్యోగుల సీపీఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తానని నమ్మబలికి ఉద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చిన ఘనత సాధించారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గ వైస్సార్సీపీ సీటు వదులుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మర్రి రాజశేఖర్ ను మంత్రిగా చేస్తానని చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చిన జగన్ మర్రి రాజశేఖర్ కమ్మ కులస్తుడు కావడంతో కమ్మకులాన్ని అనగదొక్కాలనే ఆయనకు చివరిరోజు వరకూ వేచి చూసేలా చేసి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ప్రక్కన పెట్టారని,ఇది చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రజలను, ఆయన అభిమానులను మోసం చేయడమే అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.వైస్సార్సీపీలో పదవులకు సంబంధించిన విషయంగా ఈ అంశాన్ని చూడలేమని ఎమ్మెల్సీ,మంత్రి పదవి రాజ్యాంగ బద్ధమైన వి కనుక చిలకలూరిపేట కు రావాలనే ప్రజల ఆకాంక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరుగార్చడం వైస్సార్సీపీ పార్టీకి నష్టం కలిగించే విషయం అని మర్రి రాజశేఖర్ అభిమానులు మరోసారి మోసపోయిన విషయాన్ని గ్రహించి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో,గుంటూరు జిల్లాలో వైస్సార్సీపీ ని పునాదులు పెకళించి వేస్తారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.నియోజకవర్గ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్సార్ కాంగ్రెస్ పాలన ఈ సంఘటనతో అంతిమ క్షణాలు లెక్కించడం మొదలు అయిందని అన్నారు.పొన్నూరు నియోజకవర్గ పరిధిలో రావి వెంకటరమణ నుఇదే తరహాలో ఎమ్మెల్సీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన విషయం ఈసందర్భంగా గుర్తు చేశారు.