చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
CHILAKALURI PET SPEED NEWSThursday, June 17, 2021కరోనా న్యూస్, చిలకలూరిపేట న్యూస్, చిలకలూరిపేట మండలం
No comments
చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ మండల గ్రామంలో 17-06-2021,గురువారం మొత్తం 17 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
యడ్లపాడు మండలంలో 6 కరోనా కేసులు నమోదు అయ్యాయి
ఉప్పరపాలెం గ్రామంలో - 2
సొలస గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి
నాదెండ్ల మండలంలో 11 కేసులు నమోదు అయ్యాయి
కనపర్రు గ్రామంలో - 2
సాతులూరు గ్రామంలో - 1
గణపవరం గ్రామంలో - 3
అప్పాపురం గ్రామంలో - 1
గిరిజవోలు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 17-06-2021,గురువారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 6 కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 4 కేసులు నమోదు అయ్యాయి
తూర్పు మాలపల్లి లో - 3
పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి
లింగంగుంట్ల గ్రామంలో - 1
పసుమర్రు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో
చిలకలూరిపేటలో 18-06-2021 శుక్రవారం నాడు ఈ ప్రాంతాలలో విధ్యుత్ నిలిపివేసే ప్రాంతాలలో
చిలకలూరిపేట పట్టణంలో 18-06-2021 శుక్రువారం నాడు డైక్ మెన్ నగర్ నందు ఉన్న సబ్ స్టేషన్ నందు మరమ్మతుల నిమిత్తం కొన్ని ప్రాంతాలలో విధ్యుత్ సరఫరా నిలిపియేయ్యనున్నారు అని సీహెచ్ రాంబొట్ల తెలిపారు.
శారదా హైస్కూల్ రోడ్డు, ఓల్డ్ పోలీస్టేషన్ రోడ్డు, తూర్పు మాలపల్లి, క్రిస్టియన్ కాలనీ, నెహ్రూనగర్, వేలూరు రోడ్డు, డైక్ మెన్ నగర్, గుర్రాలచావిడీ ప్రాంతాలలో రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విధ్యుత్ సరఫరా నిలిపివేయును.
చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు
చిలకలూరిపేట - బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు
బైక్ వెనుక చక్రంలో చీర చిక్కుకొని మహిళకు గాయాలు- వివరాలలోకి వెళ్తే బొప్పూడి గ్రామానికి చెందిన తాడికొండ నాగమణి, మండలంలోని పోతవరం గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్ నందు స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నాడు తన సోదరునితో కలిసి స్కూల్ కి వెళ్లే సమయంలో పోతవరం గ్రామా సమీపలో చీర అంచు బైక్ చక్రంలో చిక్కుకొని కింద పడి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెకు ప్రధమ చికిత్స చేసిన అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
చిలకలూరిపేట - కరోనా కారణంగా అధికారంగా, ప్రాణ నష్టం ఏర్పడింది. అయితే కరోనా వాలా చనిపోయిన కుటుంబాలవారికి 10 లక్షలు, బ్లాక్ ఫంగస్ మృతులకు 20 లక్షలు, కరొనతో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ పట్టణంలోని టీడీపీ శ్రేణులు MRO ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ మైదవోలు హనుమంతురావు గారికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 65 లక్షల డోసులు కేటాయిస్తే రాష్ట్రం లో మాత్రం 26 లక్షల టీకాలు మాత్రమే వేశారు అని మిగిలిన డోసులు అన్ని వృధా అయ్యాయి అని గుర్తు చేసారు. ఆంధ్రాలో కరోనా ప్రభావంతో సరి అయిన వైద్య సహాయం అంధక చాల మంది చనిపోయారు అని ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అని నిరాశ్రయులు అయిన వారికీ త్వరగా ఆర్ధిక సాయం చెయ్యాలి అని తెలిపారు.
చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు
చిలకలూరిపేట - పండరీపురంలో అగ్ని ప్రమాదం - పూర్తిగా కాలిపోయిన బడ్డీ కొట్టు
చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం నందు రోడ్డు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు పూర్తిగా ధ్వంసం అయింది. పండరిపురంలోని కందిమళ్ల కంపెనీ రోడ్డు లోని 10 వ లైన్ వద్ద వీధి చివరన ఉన్న ఒక బడ్డీ కొట్టు నిన్న రాత్రి కాలి బూడిద అయిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చెయ్యటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే చాల వరకు అందులో ఉన్న వస్తువులు, సామానులు కాలిపోయింది.ఆకతాయిల నేర్వకమా లేక ఏది అయిన ప్రమాదం వలన జరిగిందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
చిలకలూరిపేట - మంచినీటి కోసం అని మోటార్ స్విచ్ వెయ్యబోయి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
చిలకలూరిపేట - పసుమర్రు గ్రామంలో ఇంట్లో మంచి నీటి కోసం అని మోటర్ స్విచ్ ఆన్ చెయ్యబోయి కరెంటు షాక్ తో వ్యక్తి మృతి చెందారు. వివరాలలోకి వెళ్తే పసుమర్రు గ్రామంలోని తన్నీరు కొండలరావు (56) బుధవారం నాడు మంచి నేటి కోసం అని మోటర్ స్విచ్ వెయ్యటానికి వెళ్ళాడు. అదే సమయంలో మోటార్ కి సంబంధించిన హై వోల్టాజి వైర్లు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్యతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు మొత్తం 21 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
నాదెండ్ల మండలంలో 19 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
నాదెండ్ల గ్రామంలో - 4
సాతులూరు గ్రామంలో - 1
కనపర్రు గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 6
చందవరం గ్రామంలో - 2
జంగాలపల్లి గ్రామంలో - 2
ఇర్లపాడు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి
యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి
లింగారావుపాలెం గ్రామంలో - 1
ఉన్నవ గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్
చిలకలూరిపేట - పక్క రాష్ట్రాలలో 50% పన్నులను తగ్గిస్తుంటే ఏపీలో మాత్రం ఆస్తిపన్ను,నీటి పన్ను, చెత్త సేకరణ చార్జీలలో పెంపుతో ప్రజలకు భారం - టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్
ఏపీలో కరోనా పరిస్థితులతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికీ ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్త సేకరణ పైనా చార్జీల తో ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడింది. వెంటనే 196,197,198 జివోలని రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేసారు.
చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ నందు టీడీపీ,కాంగ్రెస్,సీపీఎం పార్టీ శ్రేణులు పన్నుల పెంపు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ కరోనా కాలంలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజల పైన భారం పడకుండా పన్నులో 50% రాయితీని కల్పించారు. కానీ ఇక్కడ మాత్రం కరొనతో చితికిపోయిన జీవితాలకు పన్నులు పెంచుతూ పెద్ద బంపర్ ఆఫర్ ప్రకటించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,కాంగ్రెస్, సిపిఎం పార్టీల నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, గ్రామ స్థాయి నేతలు పాల్గొన్నారు.
చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు
చిలకలూరిపేట - ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో - ముగ్గురికి తీవ్ర గాయాలు
చిలకలూరిపేట- గణపవరం - వేలూరు రోడ్డు మార్గంలో శివ స్వాతి మిల్లు వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొంతా మోషే అనే డ్రైవర్ తో పాటుగా ఆటోలో ప్రయాణిస్తున్న బొంతా మరియమ్మ, పూర్ణమ్మలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరితో పాటుగా ఒక పసిపాప కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్సు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట నియోజవర్గం మొత్తంలో 1170 మంది డ్రైవర్లకు గాను 1.17 కోట్ల రూపాయల వాహన మిత్ర చెక్కుల అందజేత.
చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ నందు MLA రజిని చేతుల మీదుగా 1.17 కోట్ల రూపాయల చెక్కులు వాహన మిత్ర లబ్ధిదారులకు అందించారు.వాహన మిత్ర పధకం ద్వారా చిలకలూరిపేట నియోజవర్గం మొత్తం మీద 1170 మంది డ్రైవర్లకు లబ్ది చేకూరుతుంది అని తెలిపారు. ఈ వాహన మిత్ర పధకంలో నియోజవర్గంలో 84% ST, SC BC , మైనారిటీ వారే ఉండటం విశేషం అని తెలియజేసారు. చెక్కుల పంపిణి తరువాత సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళా కౌన్సిలర్లను ఆటో ఎక్కించుకొని కొంచం దూరం నడిపారు MLA రజని. ఈ కార్యక్రమంలో MLA రజిని తో పాటుగా వార్డు మహిళా కౌన్సిలర్ల, పార్టీ సీనియర్ నాయకులు,నియోజకవర్గ గ్రామాలలోని పెద్దలు, వైయస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో 15-06-2021,మంగళవారం నాడు నమోదు అయినా కరోనా కేసుల వివరాలు
చిలకలూరిపేట పట్టణ & మండల గ్రామాలలో మొత్తం 5 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు
చిలకలూరిపేట పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి.
కృష్ణారెడ్డి డొంక లో - 1
పండరీపురం లో - 1 గా నమోదు అయ్యాయి
చిలకలూరిపేట మండల గ్రామాలలో 3 కేసులు నమోదు అయ్యాయి.
కుక్కపల్లివారిపాలెం గ్రామంలో - 1
మురికిపూడి గ్రామంలో - 1
కావూరు గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు నమోదు అయిన కరోనా కేసుల వివరాలు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు, నాదెండ్ల మండలాలలో 14-06-2021,సోమవారం నాడు మొత్తం 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు.
నాదెండ్ల మండల గ్రామాలలో 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటి వివరాలు
ఎండుగుంపాలెం గ్రామంలో - 2
చిరుమామిళ్ల గ్రామంలో - 2
గణపవరం గ్రామంలో - 6
సాతులూరు గ్రామంలో - 1
నాదెండ్ల గ్రామంలో - 5
చంద్రవరం గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి.
యడ్లపాడు గ్రామంలో 2 కేసులు నమోదు అయ్యాయి
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పట్టణంలో 15-06-2021,మంగళవారం నాడు విద్యుత్ నిలిపివేసే ప్రాంతాలు.
చిలకలూరిపేట పరిధిలోని హైవే ఫీడర్ లైన్లు మరమ్మతులకు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడును అని సి. హెచ్ రాంబొట్ల గారు తెలిపారు. NRT సెంటర్ నుండి హీరో షోరూం వరకు ఉన్న రోడ్లలో, గబ్బిటి వారి వీధి, మునిసిపాలిటీ ఆఫీస్ రోడ్, డైక్ మెన్ నగర్, కోర్టు బజార్, NRT సెంటర్ నుండి విజయాబ్యాంక్ రోడ్ వరకు ఉన్న అన్ని రోడ్డులలో, స్టేట్ బ్యాంకు, సిటీ యినియన్ బ్యాంకు హనుమాయమ్మ సత్రం, గాంధీపేట , హైస్కూల్ రోడ్డు నందు ఈ అంతరాయం ఏర్పడును.