చిలకలూరిపేట - కరోనా కారణంగా అధికారంగా, ప్రాణ నష్టం ఏర్పడింది. అయితే కరోనా వాలా చనిపోయిన కుటుంబాలవారికి 10 లక్షలు, బ్లాక్ ఫంగస్ మృతులకు 20 లక్షలు, కరొనతో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలకి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ పట్టణంలోని టీడీపీ శ్రేణులు MRO ఆఫీస్ నందు సీనియర్ అసిస్టెంట్ మైదవోలు హనుమంతురావు గారికి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 65 లక్షల డోసులు కేటాయిస్తే రాష్ట్రం లో మాత్రం 26 లక్షల టీకాలు మాత్రమే వేశారు అని మిగిలిన డోసులు అన్ని వృధా అయ్యాయి అని గుర్తు చేసారు. ఆంధ్రాలో కరోనా ప్రభావంతో సరి అయిన వైద్య సహాయం అంధక చాల మంది చనిపోయారు అని ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అని నిరాశ్రయులు అయిన వారికీ త్వరగా ఆర్ధిక సాయం చెయ్యాలి అని తెలిపారు.
Home »
కరోనా న్యూస్
,
చిలకలూరిపేట న్యూస్
» కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
కరోనా మృతికి 10 లక్షలు,బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షలు ఇవ్వాలి - చిలకలూరిపేట టీడీపీ నాయకులు
No comments:
Post a Comment