చిలకలూరిపేట - గుంటూరు జాతీయ రహదారి మధ్యలో తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం
చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !
చిలకలూరిపేటలో మరో యువకుడిని బలి తీసుకున్న కరోనా !
చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా యువకులు చనిపోవటంతో ఆయా ప్రాంతాలు బయాందోనళకు గురి అవుతున్నారు. శుక్రవారం సాయంత్రం కరొనతో మరో యువకుడు గుండా వెంకటేశ్వరరావు (27) చనిపోయారు. పట్టణంలోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటూ ఇంట్లోనే అకౌంటెంట్ & టాక్స్ కన్సల్టెంట్స్ నడుపుతున్నారు. కొన్ని రోజులు గా కరొనతో బాధపడుతూ శుక్రవారం నాడు మూడు హాస్పిటల్స్లలో చికిత్స కోసం తిరిగిన ఎవరు జాయిన్ చేపించుకోలేదు. ఆక్సిజెన్ అంధక శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సమయానికి ఆక్సిజెన్ దొరికితే బ్రతికి ఉండొచ్చు అని తెలియజేసారు.
మా మిత్రుని మృతుకి సంతాపం తెలుపుతూ
chilakaluripet sepped news & ఫ్రెండ్ సర్కిల్
చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత.
చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిల్ సభ్యులు - ఛైర్మెన్,కమిష్నర్ ఇరువురికి లేఖ అందజేత.
నిన్న జరిగిన కౌంసిల్ సమావేశంలో చంద్రమౌళి కూరగాయల మార్కెట్ పేరు మార్పుకు టీడీపీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు.
72 సంవత్సరాల క్రితం చిలకలూరిపేట ప్రజల సౌకర్యార్ధం అప్పటి పంచాయితీ సర్పంచ్ గా ఉన్న మైలవరపు గుండయ్య గారి ఆధ్వర్యంలో కురగాయల మార్కెట్ ను ఏర్పాటు చేసారు. గుంటూరు జిల్లలో అప్పటి మంత్రిగా ఉన్న స్వాతంత్ర సమరయోధులు , బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో 1937 లోనే మద్రాసు ఫ్రాన్సిస్ యందు శాసనసభకు ఎన్నిక అయి దేవాదాయ మంత్రిగా పని చేసిన గణణీయుడు శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి గుర్తుగా 1948లో అయన పేరు నామకరణం చేసారు. ఈ రోజు పాలకవర్గం అయన పేరుని మర్చి వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ గా మార్చటాన్ని టీడీపీ కౌంసిల్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారు. దేశం కోసం ఏడు సార్లు జైలు జీవతాన్ని గడిపిన అయన పేరు మార్చటం దారుణమని. అలాగే పట్టణంలో చేపట్టే నూతన భవనాలకు వైఎస్ఆర్ పేరు పెట్టకుంటే తమకి అటువంటి అభ్యంతరం లేదు అని పట్టణంలో 7 పురపాలక సంఘాలు ప్రతినిత్యం వాహినప్పటికీ ఏ పాలకవర్గం ఎలాంటి పనులు చెయ్యలేదు అని స్వాత్రంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను గౌరవించకపోయిన కానీ అవమానించ వద్దు అని తెలియచేసారు. ఇది చిలకలూరిపేటలో చెడు సంప్రదాయాలకు దారి తీస్తుంది అని తెలియచేసారు. ఛైర్మెన్ రఫాని ,కమిష్నర్ రవీంద్ర గారికి లేఖలు అందించారు.
చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు
చిలకలూరిపేటలో గుట్కా, ఖైనీ విక్రయించేవారిని పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు
పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో కృష్ణారెడ్డి డొంక నందు గుట్కా, ఖైనీ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి 3500 పాకెట్లను సీజ్ చేసారు అధికారులు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిలకలూరిపేటలో ఇలా వ్యాక్సిన్ కోసం అని వెళ్తే కరోనా కచ్చితంగా వస్తుంది
చిలకలూరిపేట చంద్రమౌళి కూరగాయల మార్కెట్ ను వైయస్ఆర్ కూరగాయల మార్కెట్ గా పేరు మార్పు
యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్
చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
పట్టణంలోని 52 ఎకరాలో ఉన్న టిడ్కొ ఇళ్లలో కరోనా కేర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న కరోనా రోగులతో మాట్లాడారు. అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడి వారు తమకి సరిఅయిన ఆహారం అందచేయటం లేదు అని, మంచినీటి వసతి సరిగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్ పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారా, వాళ్ళు కూడా మనుషులే అని ఇంకొకసారి ఇలా జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం అని తెలిపారు. అలాగే ప్రతి రూమ్ లోను డాక్టర్ నెంబర్ ఉండేలా చూడాలి అని, వైద్య సదుపాయాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు.
కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కరోనా RTPCR , రాపిడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక శాంపిల్ ఐడీ జెనరేట్ అవుతుంది. అది ID : 201758399(శాంపిల్) ఇలా ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి
http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/
పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి "సెలెక్ట్ సెర్చ్ టైప్" అని ఉంటుంది అందులో"శాంపిల్ ఐడి" పైన కిక్ చేసి పక్కనే "ఎంటర్ వాల్యూ" అని ఉంటుంది అందులో మీ ID నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "సెర్చ్" పైన క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మనకి రిపోర్ట్ స్టేటస్ వస్తుంది.
చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేటలోని నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB ) (35) కరొనతో ఈ రోజు మృతి చెందారు. పట్టణములోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ 20 రోజులుగా కరొనతో పోరాడుతూ ఈ రోజు విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్ లో మృతి చెందారు. చిన్న వయసులోనే మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలని కలచివేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఎంతో మందికి ఆర్ధికంగా ఆదుకున్న వ్యక్తి ఈ రోజు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం విజయ్ మృతి దేహాన్ని తీసుకువచ్చి కరోనా కారణంగా త్వరగా అంతక్రియలు నిర్వహించారు. విజయ్ మృతి కారణంగా ఆ ప్రాంతం అంతా మూగబోయింది.
మీ అకాలమృతికి సంతాపం తెలుపుతూ CHILAKALURIPETA SPEED NEWS, Bad Boy's Youth
చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం
చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం
ఇవాళ ఉదయం తహసీల్దార్ సుజాతగారి ఆధ్వర్యంలో పలు ఆక్సిజెన్ స్టోరేజీల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన గంటల సమయములోనే 45 సీలిండర్ల ఆక్సిజెన్ తరలిస్తున్న బొలెరో వాహనాని పట్టుకున్నారు. డిప్యూటీ తసీల్ధార్ నాగమలేశ్వరావు గారి విశ్వనాథ్ థియేటర్ సెంటర్ నుండి అటుగా వెళ్తున్న వాహనాని తనిఖీ చేసారు. సరిఅయిన పత్రాలు లేనందు వలన వాహనాన్ని తసీల్ధార్ కార్యాలయంలో ఉంచారు. వాహనాన్ని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తెరలిస్తునట్లు తెలిపారు.
చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు
చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు
పట్టణంలోని మెడికల్ షాపులలో, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని హాస్పిటలలో కరోనా రోగులకు ఇచ్చే రెమిడిసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లో 30,000 రూపాయలకు అమ్మతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుబ్బయ్యతోట లోని ఆక్సీజెన్ సిలిండర్ స్టోరేజ్ సెంటర్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.తహసీల్దార్ సుజాత గారు, అర్బన్ CI బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు
చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు
27-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలోని బంగారపుకొట్లు బజార్ (షరాఫ్ బజార్ ) నందు ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి చిన్నరధం తిరునాళ్ల నిర్వహించారు. కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా ఎవ్వరిని ఆహ్వానించకుండా పరిమితి సంఖ్యలో (20 మంది) తో కార్యక్రమాన్ని నిర్వహించారు. 23-04-2021 నుండి ఆలయ నిర్వాహకులు, అర్చకుల సమక్షంలో కళ్యాణోత్స్వమ్ నిర్వహిస్తూ రథం తిరునాళ్లతో కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా రథాన్ని 20 అడుగులు ముందుకు కదిలించి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
VIdeo:-
చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు
చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు
చిలకలూరిపేట గుర్రాలచావిడికి చెందిన మహిళకు(60) కరోనా సోకటంతో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంటు మంగళవారం చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించటానికి బంధువులు ఎవరు ముందుకి రాక పోవటంతో మునిసిపల్ సిబ్బంది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులు తల్హాఖాన్ గారు ఆ ప్రాంతంలోని ప్రజలను భయపడవద్దని, శానిటైజేషన్ చూపిస్తామని చెప్పారు. మునిసిపల్ సిబ్బంది ఆమె మృతిదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.