యడ్లపాడు భూషయ్య మెమోరియల్ నర్సింగ్ హోమ్ డాక్టర్ సుబ్బారావు అరెస్ట్
చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో కోవిడ్ కేర్ సెంటర్ లో ఆకస్మిక తనిఖీలు - ఫుడ్ కాంట్రాక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
పట్టణంలోని 52 ఎకరాలో ఉన్న టిడ్కొ ఇళ్లలో కరోనా కేర్ సెంటర్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న కరోనా రోగులతో మాట్లాడారు. అన్ని సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడి వారు తమకి సరిఅయిన ఆహారం అందచేయటం లేదు అని, మంచినీటి వసతి సరిగా ఉండటం లేదు అని ఫిర్యాదు చేసారు. అక్కడే ఉన్న ఫుడ్ కాంట్రాక్టర్ పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారా, వాళ్ళు కూడా మనుషులే అని ఇంకొకసారి ఇలా జరిగితే కాంట్రాక్టు రద్దు చేస్తాం అని తెలిపారు. అలాగే ప్రతి రూమ్ లోను డాక్టర్ నెంబర్ ఉండేలా చూడాలి అని, వైద్య సదుపాయాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలి అని తెలిపారు.
కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కరోనా టెస్ట్ చేపించుకొని రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారా !!! - రిపోర్ట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కరోనా RTPCR , రాపిడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి ఒక శాంపిల్ ఐడీ జెనరేట్ అవుతుంది. అది ID : 201758399(శాంపిల్) ఇలా ఉంటుంది. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి
http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/
పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి "సెలెక్ట్ సెర్చ్ టైప్" అని ఉంటుంది అందులో"శాంపిల్ ఐడి" పైన కిక్ చేసి పక్కనే "ఎంటర్ వాల్యూ" అని ఉంటుంది అందులో మీ ID నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న "సెర్చ్" పైన క్లిక్ చెయ్యండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్ ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మనకి రిపోర్ట్ స్టేటస్ వస్తుంది.
చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు
చిలకలూరిపేటలోని నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB ) (35) కరొనతో ఈ రోజు మృతి చెందారు. పట్టణములోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ 20 రోజులుగా కరొనతో పోరాడుతూ ఈ రోజు విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్ లో మృతి చెందారు. చిన్న వయసులోనే మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలని కలచివేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఎంతో మందికి ఆర్ధికంగా ఆదుకున్న వ్యక్తి ఈ రోజు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం విజయ్ మృతి దేహాన్ని తీసుకువచ్చి కరోనా కారణంగా త్వరగా అంతక్రియలు నిర్వహించారు. విజయ్ మృతి కారణంగా ఆ ప్రాంతం అంతా మూగబోయింది.
మీ అకాలమృతికి సంతాపం తెలుపుతూ CHILAKALURIPETA SPEED NEWS, Bad Boy's Youth
చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం
చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం
ఇవాళ ఉదయం తహసీల్దార్ సుజాతగారి ఆధ్వర్యంలో పలు ఆక్సిజెన్ స్టోరేజీల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన గంటల సమయములోనే 45 సీలిండర్ల ఆక్సిజెన్ తరలిస్తున్న బొలెరో వాహనాని పట్టుకున్నారు. డిప్యూటీ తసీల్ధార్ నాగమలేశ్వరావు గారి విశ్వనాథ్ థియేటర్ సెంటర్ నుండి అటుగా వెళ్తున్న వాహనాని తనిఖీ చేసారు. సరిఅయిన పత్రాలు లేనందు వలన వాహనాన్ని తసీల్ధార్ కార్యాలయంలో ఉంచారు. వాహనాన్ని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తెరలిస్తునట్లు తెలిపారు.
చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు
చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు
పట్టణంలోని మెడికల్ షాపులలో, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని హాస్పిటలలో కరోనా రోగులకు ఇచ్చే రెమిడిసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లో 30,000 రూపాయలకు అమ్మతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుబ్బయ్యతోట లోని ఆక్సీజెన్ సిలిండర్ స్టోరేజ్ సెంటర్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.తహసీల్దార్ సుజాత గారు, అర్బన్ CI బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు
చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు
27-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలోని బంగారపుకొట్లు బజార్ (షరాఫ్ బజార్ ) నందు ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి చిన్నరధం తిరునాళ్ల నిర్వహించారు. కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా ఎవ్వరిని ఆహ్వానించకుండా పరిమితి సంఖ్యలో (20 మంది) తో కార్యక్రమాన్ని నిర్వహించారు. 23-04-2021 నుండి ఆలయ నిర్వాహకులు, అర్చకుల సమక్షంలో కళ్యాణోత్స్వమ్ నిర్వహిస్తూ రథం తిరునాళ్లతో కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా రథాన్ని 20 అడుగులు ముందుకు కదిలించి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
VIdeo:-
చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు
చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు
చిలకలూరిపేట గుర్రాలచావిడికి చెందిన మహిళకు(60) కరోనా సోకటంతో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంటు మంగళవారం చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించటానికి బంధువులు ఎవరు ముందుకి రాక పోవటంతో మునిసిపల్ సిబ్బంది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులు తల్హాఖాన్ గారు ఆ ప్రాంతంలోని ప్రజలను భయపడవద్దని, శానిటైజేషన్ చూపిస్తామని చెప్పారు. మునిసిపల్ సిబ్బంది ఆమె మృతిదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం
చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి
చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి
చిలకలూరిపేటలో కరొనతో ఇద్దరు మెప్మా ఉద్యోగులు మృతి. వివరాలోకి వెళ్తే గుంటూరు కార్పొరేషన్ మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలోని సాంబ శివ నగరులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, మంగళగిరి లో మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తు మండలంలోని తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న విజయరాజులు గారు. వీరు ఇరువురు కరోనా వలన సోమవారం నాడు మృతి చెందారు.
చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ
చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ
చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు.
ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత
చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత
చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సులు, 27-04-2021 నుండి 31-05-2021 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి టెస్టులు నిలిపివేస్తునట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (M V I ) నాగేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకునట్లు చెప్పారు. 1-06-2021 న టెస్టుల నిర్వహణ ఎప్పుడు మొదలవుతుందో తెలియచేస్తాము అని చెప్పారు.
దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.
చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి
చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి
చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు.
గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు.