మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు

చిలకలూరిపేట నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB) కరొనతో మృతి చెందారు

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలోని నాని సర్వీస్ వ్యవస్థాపకుడు కంచర్ల విజయ్ కుమార్ (LLB ) (35) కరొనతో ఈ రోజు మృతి చెందారు. పట్టణములోని సుబ్బయ్యతోటలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ 20 రోజులుగా కరొనతో పోరాడుతూ ఈ రోజు విజయవాడలోని ప్రముఖ హాస్పిటల్ లో మృతి చెందారు. చిన్న వయసులోనే మృతి చెందటం ఆ ప్రాంత ప్రజలని కలచివేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ఎంతో మందికి ఆర్ధికంగా ఆదుకున్న వ్యక్తి ఈ రోజు లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బుధవారం సాయంత్రం విజయ్ మృతి దేహాన్ని తీసుకువచ్చి కరోనా కారణంగా త్వరగా అంతక్రియలు నిర్వహించారు. విజయ్ మృతి కారణంగా ఆ ప్రాంతం అంతా మూగబోయింది. 

                                                                              మీ అకాలమృతికి సంతాపం తెలుపుతూ                                                                                        CHILAKALURIPETA SPEED NEWS, Bad Boy's  Youth  


 

Share:

చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం

చిలకలూరిపేటలో సరిఅయిన పత్రాలు లేని ఆక్సిజెన్ సీలిండర్లు తీసుకువెళ్తున్న బొలెరో వాహనం స్వాధీనం 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఇవాళ ఉదయం తహసీల్దార్ సుజాతగారి ఆధ్వర్యంలో పలు ఆక్సిజెన్ స్టోరేజీల ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించిన గంటల సమయములోనే 45 సీలిండర్ల ఆక్సిజెన్ తరలిస్తున్న బొలెరో వాహనాని పట్టుకున్నారు. డిప్యూటీ తసీల్ధార్ నాగమలేశ్వరావు గారి విశ్వనాథ్ థియేటర్ సెంటర్ నుండి అటుగా వెళ్తున్న వాహనాని తనిఖీ చేసారు. సరిఅయిన పత్రాలు లేనందు వలన వాహనాన్ని తసీల్ధార్ కార్యాలయంలో ఉంచారు. వాహనాన్ని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి తెరలిస్తునట్లు తెలిపారు.













 

Share:

చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు

చిలకలూరిపేటలోని మెడికల్ షాప్స్, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు - తసీల్ధార్ సుజాత గారు 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని మెడికల్ షాపులలో, ఆక్సిజెన్ స్టోరేజ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని హాస్పిటలలో కరోనా రోగులకు ఇచ్చే రెమిడిసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లో 30,000 రూపాయలకు అమ్మతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుబ్బయ్యతోట లోని ఆక్సీజెన్ సిలిండర్ స్టోరేజ్ సెంటర్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.తహసీల్దార్ సుజాత గారు, అర్బన్ CI బిలాలుద్దీన్  ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. 




















Share:

చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు

 చిలకలూరిపేటలో కోవిడ్ నియమాలు పాటిస్తూ చిన్నరథం తిరునాళ్ల నిర్వహించారు

https://chilakaluripetspeednews.blogspot.com/

27-04-2021 మంగళవారం నాడు చిలకలూరిపేటలోని బంగారపుకొట్లు బజార్ (షరాఫ్ బజార్ ) నందు ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి చిన్నరధం తిరునాళ్ల నిర్వహించారు. కరోనా ఉదృతి  పెరుగుతున్న కారణంగా ఎవ్వరిని ఆహ్వానించకుండా పరిమితి సంఖ్యలో (20 మంది) తో కార్యక్రమాన్ని నిర్వహించారు. 23-04-2021 నుండి ఆలయ నిర్వాహకులు, అర్చకుల సమక్షంలో కళ్యాణోత్స్వమ్ నిర్వహిస్తూ రథం తిరునాళ్లతో కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా రథాన్ని 20 అడుగులు ముందుకు కదిలించి కార్యక్రమాన్ని పూర్తి చేసారు. 

VIdeo:-











Share:

చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు

చిలకలూరిపేటలో కరొన తో మృతి చెందిన మహిళకు మునిసిపల్ సిబ్బంది అంత్యక్రియలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట గుర్రాలచావిడికి చెందిన మహిళకు(60) కరోనా సోకటంతో ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంటు మంగళవారం చనిపోయారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించటానికి బంధువులు ఎవరు ముందుకి రాక పోవటంతో మునిసిపల్ సిబ్బంది ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షులు తల్హాఖాన్ గారు ఆ ప్రాంతంలోని ప్రజలను భయపడవద్దని, శానిటైజేషన్ చూపిస్తామని చెప్పారు. మునిసిపల్ సిబ్బంది ఆమె మృతిదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.  











Share:

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం

చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు -  రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/


చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలి వచ్చారు. హాస్పిటల్ బయట వరకు Q కట్టారు. అయితే సుమారు 400 మంది టెస్టులకి వచ్చారు అని అంచనా . హాస్పిటల్ సిబంది ముందస్తు చర్యలు తీసుకోకుండా అందరికి ఓపీ ఇచ్చారు. కానీ టెస్టులకు  మాత్రం 100 రెజిస్ట్రేషన్ ఫారంలు మాత్రమే ఉన్నాయి అని ఈ రోజుకి 100 మాత్రమే అని చెప్పారు. పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు మండుటెండలో నిలబడి ఇప్పుడు ఫోరంలు లేవు అంటారు ఏంటి అని కొంచంసేపు ఆసుపత్రి సిబ్బందికి ప్రజలకి వాగ్వివాదం జరిగింది. చివరకు హాస్పిటల్ డాక్టర్ గారి చొరవతో వచ్చిన అందరికి టెస్టులు చేస్తాం అని చెప్పారు.ప్రైవేట్ టెస్టుల వలన బయట మెడికల్ ఫెసిలిటీ లేదు. అందువలన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చినట్టు చెప్పారు. 

వీడియో:-































Share:

చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

 చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరొనతో ఇద్దరు మెప్మా ఉద్యోగులు మృతి. వివరాలోకి వెళ్తే గుంటూరు కార్పొరేషన్ మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలోని సాంబ శివ నగరులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, మంగళగిరి లో మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తు మండలంలోని తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న విజయరాజులు గారు. వీరు ఇరువురు కరోనా వలన సోమవారం నాడు మృతి చెందారు. 









Share:

చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ

 చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది.  రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు  " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు  వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR  టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు. 

ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.  


 











Share:

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత

చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సులు, 27-04-2021 నుండి 31-05-2021 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి టెస్టులు నిలిపివేస్తునట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (M V I )  నాగేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకునట్లు చెప్పారు. 1-06-2021 న టెస్టుల నిర్వహణ ఎప్పుడు మొదలవుతుందో తెలియచేస్తాము అని చెప్పారు. 
















Share:

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.

దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది. 

https://chilakaluripetspeednews.blogspot.com/

భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న, ప్రజలు ఆక్సిజన్ నిల్వలు లేక రోగులకు ఆక్సిజన్ సరిపోక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలలో ఏకంగా 9300 మెట్రిక్ టన్నుల ఆక్సిజెన్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెండింతలకన్నా ఎక్కువ. వీటిలో చాలా వరకు మన చుట్టుపక్క దేశాలకు ముఖ్యంగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ముందు దేశ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని దేశ ప్రజలు వాపోతున్నారు.  

















Share:

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి

చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు. 

గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు. 










Share:

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి

కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి


https://chilakaluripetspeednews.blogspot.com/


దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్న క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా ఆసక్తి విషయాలు పంచుకున్నారు. దేశంలో కరోనా ఉదృతి ఆపాలి అంటే మాస్క్ వాడాలి అని. అది కూడా ఒక మాస్క్ సరిపోదు అని 2 మాస్కులు వాడాలి అని తెలిపారు. క్లాత్, సర్జికల్ మాస్క్ వాడేవారు 2 ఖచ్చితంగా వాడాలి అని తెలిపారు.  
















Share:

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో కరోనా కేసులు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ రోజు అనగా 21-04-2021 బుధవారం నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి కమిషనర్, ఎంపీడివో, పోలీసుశాఖ వారికీ  ఆదేశాలు జారీ చేసారు తసీల్ధార్ సుజాత గారు. 

 * పట్టణములోని, మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి అని,
 * రెస్టారెంట్, హోటల్స్ పార్సెల్ మాత్రమే అనుమతి. 
 * టీ షాప్స్ కు అనుమతులు లేవు కావున తెరవకూడదు. 
 * శ్రీ రామ నవమి పండుగను ఎవరి ఇంటిలో వారే చేసుకోవాలి, పబ్లిక్ లో చేసుకోవటానికి అనుమతులు లేవు. 
 * పట్టణంలో,గ్రామాలలో జాతరలు,తిరునాళ్లలు  జరుపుకోవటానికి అనుమతులు లేవు. 
 * ముఖ్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల అపరాధ రుసుము వసూళ్లు చేస్తారు. 
 * తోపుడు బళ్ళు ఒకే చోట ఉండకుడదు. 
* ఫంక్షన్స్ , ఇతర కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. 

     పైన నిబంధనలు పాటించనివారు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

 చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు. 

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R  శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.    





















Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.