చిలకలూరిపేట... ప్రాణాల మీదకు తెచ్చిన ఫోన్ EMI
చిలకలూరిపేట పట్టణం లోని చౌత్ర సెంటర్లోని ఒక ప్రముఖ మొబైల్ షో రూమ్ నందు గురువారం ఉదయం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని ఒక ప్రముఖ మొబైల్ షో రూమ్ నందు ఫైనాన్స్ EMI కి సంబంధించిన విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో ఇరువురు బాహాబాహీకి దిగి ఒకరినొకరు పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఇందులో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడగా మరొక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. సదరు తీవ్రంగా గాయాలు అయిన వ్యక్తి గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
No comments:
Post a Comment