మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు

వైసీపీకి షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు 

ఆంధ్రప్రదేశ్ :- గత కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తన మార్కును చాటి విస్తృతంగా పర్యటన చేసిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు తిరిగి అదే పార్టీకి షాక్ ఇవ్వటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయానికి అభిమానులు ఒకింత షాక్కి గురయ్యారు. కొన్ని నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన అంబటి రాయుడు గుంటూరు, విజయవాడ కాన్స్టెన్సీ లో టికెట్ ఆశించడం జరిగింది. అయితే ఆ రెండు కాన్స్టెన్సీలో గెలుపు రాయులకు టికెట్లు కన్ఫర్మ్ చేయడంతో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తాను వైసిపి నుండి బయటకు వస్తున్నట్లు కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి తర్వాత కార్యాచరణను ప్రకటిస్తారని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Share:

టిడిపికి బిగ్ షాక్ - ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు

 టిడిపికి బిగ్ షాక్ - ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు


ఆంధ్రప్రదేశ్ :- టిడిపికి వెన్నుదండగా ఉండే ముఖ్య నేతలలో విజయవాడ ఎంపీ కేసీనేని నాని ఒకరు. గత కొన్ని రోజులుగా తన తమ్ముడు కేశినేని చిన్నికి నానికి మధ్య జరుగుతున్న సంఘటన దృష్ట్యా కేశినేని నాని టిడిపికి రాజీనా మా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ఆయన చేసిన పోస్ట్ తెలుగు తమ్ముళ్లకు ఒకింత ఆందోళనకు గురిచేస్తుంది. "అందరికీ నమస్కారం. టిడిపికి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను టిడిపిలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి నా రాజీనామా ఆమోదించుకునే టిడిపికి రాజీనామా చేస్తానని" ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ పోస్టుతో టిడిపిలో తీవ్ర దుమారం రేగుతుంది.

Share:

రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి

రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి

రేపు పెళ్లి అనగా ఈ రోజు యాక్సిడెంట్ లో పద్మశాలి పేటకు చెందిన యువతి మృతి

చిలకలూరిపేట టౌన్ :- చిలకలూరిపేట పట్టణం లోని పద్మశాలి పేట కు చెందిన సాయి లక్ష్మి (30) అనే యువతి తన తల్లితో కలిసి స్కూటీ పై గుంటూరు వెళుతుండగా మార్గ మధ్యలో యడ్లపాడు సమీపంలో ఆగి ఉన్న వసంత నూనె మిల్లు కు సంబంధించిన బస్సును ఢీకొట్టడంతో యువతి అక్కడికక్కడే మరణించింది. వెనక ఉన్న తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన బస్సు ని ఆపి కాలకృత్యాలు తీసుకుంటుండగా సాయి లక్ష్మి ఆమె తల్లి తో పాటు స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపై ఎవరో దిష్టి తీసిన కొబ్బరికాయ కొట్టి ఉండటంతో దాన్ని తప్పించబోయి వేగాన్ని ఆపలేక ఘటన జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న యడ్లపాడు పోలీసు వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి యువతి మృతదేహాన్ని చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పటల్ కు తీవ్రగాయాలైన తల్లిని గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే యువతికి రేపు వివాహం అనగా ఈ రోజు ఆమె మృతి చెందటంతో పట్టణంలోని ఆమె నివాస గృహం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన యువతి సాయి లక్ష్మి స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నందు ఆధార్ సెంటర్ లో పని చేస్తున్నట్లు సమాచారం.

Share:

రేపు చిలకలూరిపేట థియేటర్లో పోకిరి సినిమా 4K HD ప్రింట్ తో స్పెషల్ ఫ్యాన్స్ షోస్

రేపు చిలకలూరిపేట థియేటర్లో పోకిరి సినిమా 4K HD ప్రింట్ తో స్పెషల్ ఫ్యాన్స్ షోస్ 

https://chilakaluripetspeednews.blogspot.com/



చిలకలూరిపేట రేపు అనగా ఈ నెల 9వ తారీకు మహేష్ బాబు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోకిరి చిత్ర ప్రదర్శనను 4K HD ప్రింట్ ద్వారా అభిమానులకు ప్రదర్శించాలని పోకిరి సినిమా డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా చిలకలూరిపేట మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అభిమానుల కోసం పోకిరి సినిమా ప్రదర్శనను పట్టణంలోని సాయి కార్తీక్ థియేటర్ నందు సాయంత్రం 6 గంటల షో మరియు 9 గంటల షోలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ హంగామాతో అడ్వాన్స్ బుకింగ్ కొనసాగుతుంది. తమ అభిమాన నటుడి సినిమా చిత్రం 4K HD ప్రెంట్ తో మళ్లీ రిలీజ్ చేయటం తో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
Share:

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ - కమిషనర్


చిలకలూరిపేట భారతదేశం స్వతంత్రం పొంది 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత మహోత్సవాల న చిలకలూరిపేట పట్టణంలో కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ... చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై ఈనెల అనగా ఆగస్టు 13, 14 ,15, తేదీలలో ఈ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటిచెప్పాలని కమిషనర్ కోరారు.

Share:

చిలకలూరిపేట పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

చిలకలూరిపేట పట్టణ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి



చిలకలూరిపేట పట్టణంలోని ప్రజలందరికీ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి ఇప్పటివరకు విద్యుత్ బకాయిలను చెల్లించాలని అంటే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నందు చెల్లించేవారు. కానీ ఇప్పటి నుండి విద్యుత్ బకాయిలు చెల్లించాలి అంటే పట్టణంలోనే కెబి రోడ్ లో ఉన్న ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ నందు చెల్లించాలని.. డిఈఈ అశోక్ కుమార్ తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరారు.

Share:

చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి

చిలకలూరిపేట: యువకుడు అనుమానాస్పద మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం లో నివాసం ఉంటున్న ఒరిస్సాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రం భద్రం గ్రామానికి చెందిన రమేష్ మాలిక్ సర్వేశ్వర్ మాలిక్ లు గ్రామంలోని ఒక కంపెనీలో పని పనిచేస్తూ గణపవరం గ్రామంలోని సినిమా హాల్ సెంటర్ నందు అద్దెకు ఉంటున్నారు. అయితే రమేష్ మాలిక్ కు శనివారం ఉదయం చాతి నొప్పి రావడంతో సర్వేశ్వర మాలిక్ దగ్గర్లో ఉన్న మెడికల్ షాప్ నందు గ్యాస్ టాబ్లెట్ తీసుకొని వచ్చి రమేష్ హాలిక్ కు ఇచ్చాడు. ఆ టాబ్లెట్ వేసుకున్న రమేష్ మాలిక్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందాడు. విషయం గమనించిన సదరు సర్వేశ్వర్ మాలిక్ మృతదేహాన్ని బయటకు తీసుకు వస్తూ పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇది గమనించిన రమేష్ మాలిక్ బంధువైన ప్రమోద్ మాలిక్ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసు వారు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం వచ్చిన నివేదిక ఆధారం ప్రకారం రమేష్ మాలిక్ను పథకం ప్రకారం చంపబడ్డాడ లేదా నిజంగానే అనారోగ్యంతో మృతి చెందాడా అనే విషయం తెలియాల్సి ఉంది.



Share:

రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?

రోశయ్య ఎలా చనిపోయారంటే ? ఎక్కడ చనిపోయారంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం చనిపోయిన విషయం అందరికీ తెలిసినదే. అయితే ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకున్నారు. అయితే హైదరాబాదు అమీర్పేట లోని తన సొంత గ్రామంలో ఉంటున్నారు. ప్రతిరోజు ఇంటి బయట ఉన్న వరండాలో కూర్చొని పేపర్ తిరగేయటం, శ్రేయోభిలాషులతో కలిసి వారితో ముచ్చటించడం అలవాటు. అదేవిధంగా ఈరోజు ఉదయం అలాగే వరండాలో కూర్చొని పేపర్ తిరగేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు రోశయ్య ని చూసి అవాక్కయ్యారు. ఆయన నోటి నుండి రక్తస్రావం అవ్వటంతో పాటుగా అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన వారు హుటాహుటిన బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పటల్ కు తరలించారు. హాస్పటల్ లోని డాక్టర్లు చెప్పిన సమాచారం మేరకు ఆయన హాస్పిటల్ కి వచ్చే మార్గమధ్యంలోనే మరణించారని వారు తెలిపారు. ఆయన మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ని వివిధ పార్టీ నాయకులు తో పాటు తమిళనాడు , కర్ణాటకలోని ప్రభుత్వాలు కూడా ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.



Share:

ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు

ఏపీ: కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం పై అభ్యంతరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సొంత పేర్లను పెట్టుకోవటం పై ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రఘురామకృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏపీ లోని జగన్మోహన్ రెడ్డి తమ సొంత పథకంగా పేర్లు పెట్టుకోవడం పై కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్మృతి ఇరానీ స్పందించారు.

జగనన్న గోరుముద్ద, జగనన్న పాల వెల్లువ, వైయస్సార్ సంపూర్ణ పోషణ అనే పలు పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం పై ఆమె స్పందిస్తూ ... కేంద్ర ప్రభుత్వాల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వాల సొంత పేర్లను & నచ్చిన పేర్లను పెట్టుకోవడం కుదరదని అలాగే MP రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం చెప్పాలని ఆమె కోరారు. అలాగే దీనిపైన నివేదిక కోరింది.



Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య మృతి చెందారు. అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందారు. 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన ఆయన స్వతంత్ర సమరయోధుడు గా ఎన్.జి.రంగా కు శిష్యునిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించి అనూహ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ కు 2009 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 1968,1974,1980, 2009 సంవత్సరాలలో MLC గా ఎన్నికయ్యారు. 1989, 2004 లలో చీరాల నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 సంవత్సరంలో నరసరావుపేట నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సంవత్సరంలో కర్ణాటక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2011 నుండి 2016 వరకు తమిళనాడుకు గవర్నర్గా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ కు 15వ సీఎంగా, తమిళనాడుకు 31వ గవర్నర్గా పని చేశారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ అండ్ బి, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 15 సార్లు అసెంబ్లీలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి మన కొణిజేటి రోశయ్య. రాజకీయ భీష్ముడుగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు.గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.



Share:

భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?

భారత్ ను తాకిన కొత్త ఒమిక్రాన్ వేరియంట్ - ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే ? - వచ్చిన వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

కోవిడ్ తీవ్రత తగ్గుతుంది అనుకొనే సమయంలో సడన్ గా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రజలను భయపెడుతుంది. గత వేరియంట్ లతో పోలిస్తే ఇది త్వరగా వ్యాపిస్తుందని హడావిడి ఎక్కువైంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నుండి విదేశాల నుండి భారత్ కి వచ్చిన వారిని పరీక్షించగా తాజాగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ ఉన్నట్లుగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరి కర్ణాటక బెంగళూరు ప్రాంతంగా తెలుస్తోంది. అయితే వీరిలో లక్షణాలు మాత్రమే ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తమై ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ఉండాలని అధికారులు తెలిపారు. విదేశాల నుండి వచ్చేవారికి కచ్చితంగా ఆర్ టి పి సి ఆర్ చేయాలని ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయితే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని వారు తెలిపారు. ఏది ఏమైనా నా గత రెండు వేరియంట్లలో వలన జనజీవనం అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ మాస్కులు ధరించి కొత్త వేరియంట్ కట్టడికి సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Share:

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

అఖండ సినిమా గురించి చిలకలూరిపేట ప్రజలు ‌ఏమి అంటున్నారు అంటే !

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

అఖండ మూవీ రివ్యూ :-  3 / 5

చాలా రోజుల తర్వాత పెద్ద హీరో సినిమా సినిమా ధియేటర్ లో సందడి చేయటంతో చిలకలూరిపేట లోని వి సెల్యూలాయిడ్ థియేటర్స్ అన్నీ పండుగ వాతావరణం నెలకొన్నది.

 ఇక సినిమా విషయానికొస్తే బోయపాటి తన మార్క్ ని చూపించాడు. సినిమాలోని క్యారెక్టర్స్ ను హై లెవెల్ ఓల్టేజితో చూపించటం బోయపాటికే సాధ్యం. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటికి తోడుగా నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు ఒక రేంజిలో ఉంటాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఉంటుందనే చెప్పాలి. బాలకృష్ణ మాస్ ఎలిమెంట్స్ , డైలాగ్స్, ఫైట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైట్ సీన్స్, బాలకృష్ణ డాన్స్ ప్రేక్షకులకు ఉల్లాసాన్ని తీసుకొస్తాయి.శ్రీకాంత్ నెగిటివ్ షేడ్స్ తో విలన్ పాత్రకు కొత్త రూపం తీసుకుని వచ్చాడు . తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాటలు చితక కొట్టేసాడు హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ అందం అభినయంతో ఆకట్టుకుంది పూర్ణ కూడా తన అందంతో నటనతో ఆకట్టుకుంది జగపతి బాబు తన పరిధి మేరకు మెప్పించాడు.

 మైనస్ పాయింట్ :- కథ సాగదీత

 చివరకు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అవుతుంది. చిలకలూరిపేట ప్రజలు అఖండ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అంటే ఈ క్రింది వీడియోలో చూడండి.


Share:

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

చిలకలూరిపేట పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన పెడవల్లి అనిల్ (26) యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడని అనంతరం జాతీయ రహదారి పక్కనే ఉన్న అమృత మినరల్ వాటర్ ప్లాంట్ వెనుక ఉన్న ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. ఉదయం అటుగా వెళ్తున్న బాటసారులు జీవచ్ఛవంలా పడి ఉన్న మృతదేహాన్ని చూసి అనిల్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు అనిల్ విజయవాడలోని రాజకీయ నాయకుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నారని బంధువులు తెలిపారు‌.



Share:

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: పెన్షన్ దారులకు వారికి విజ్ఞప్తి

చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా పంపే విషయంలో పొరపాటు చేస్తున్నారని స్థానిక సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాసరావు తెలిపారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలలలో మాత్రమే పంపాలని ఆయన తెలిపారు. అయితే కొందరు పెన్షనర్లు ముందుగానే లైఫ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ ద్వారా పంపుతున్నారని, అవి చెల్లవని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కూడా కొందరు పెన్షనర్లు గడువు కంటే ముందే లైఫ్ సర్టిఫికెట్లను పంపడంతో అవి చెల్లక, వారు కొన్ని నెలలపాటు పెన్షన్ పొందలేకపోయారు ఆయన వివరించారు.




Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.