చిలకలూరిపేట పురపాలక శాఖ ఆధ్వర్యంలో యూజర్ చార్జీల వసూళ్లకు రంగం సిద్ధం చేశారు
ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ క్రింద అక్టోబర్ 1వ తేదీ నుండి యూజర్ చార్జీల వసూళ్లు చేయనున్నారు. దీంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి మన చిలకలూరిపేట పట్టణంలో కూడా యూజర్ చార్జీలు ప్రతి ఇంటి నుండి 60 రూపాయలు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ షేక్ రఫ్పాని తెలిపారు. 30వ తేదీ గురువారం నాడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే నెల 19వ తేదీన చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ నందు పట్టణంలోని 38 వార్డు లో తడి చెత్త పొడి చెత్త సేకరణకు మున్సిపల్ సభ్యులు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చిలకలూరిపేట లోని 38 వార్డు లో గానూ మొత్తం 27 వేల గృహాల నుంచి తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా సేకరించడం కోసం 39 ఆటోలను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దీని ద్వారా సుమారు 16 లక్షల 20 వేల రూపాయలు ఆదాయం రానున్నది .దీంతోపాటు చికెన్ స్టాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్, బేకరీలు, హోటల్స్, లాడ్జిలు, వ్యాపార వాణిజ్యపరమైన 38 వ్యాపార వర్గాల నుండి ఈ చెత్త సేకరణకు సర్వం సిద్ధం చేశారు