చిలకలూరిపేట ఎలక్ట్రానిక్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం
చిలకలూరిపేట పట్టణం లోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం అతి సమీపంలోని ఎలక్ట్రానిక్ గోడౌన్ నందు గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చౌత్ర సెంటర్ లోని ప్రముఖ విజయలక్ష్మి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన ఏసీలు, ఫ్రిట్జ్ ,కూలర్స్ ,టీవీలు వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ స్టాక్ ఉంచటం కోసం ఆర్య వైశ్య కళ్యాణ మండపం పక్కనే ఉన్న ఒక గోడౌన్లో ఉంచారు. అయితే గురువారం రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి గోడౌన్ యజమాని సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రఫ్పాని మరియు వైయస్సార్సిపి నాయకులు విడుదల గోపి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి గోడౌన్ యజమాని మధును పరామర్శించారు. ప్రాథమిక సమాచారం మేరకు 30 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు.