మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి

చిలకలూరిపేటలో రేపు 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో రేపు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని గ్రామ & పట్టణంలోని 40వేల కుటుంబాలకు ఆనందయ్య మందు పంపిణి జరుగుతుంది.రైతు బజారు వేదికగా MLA రజిని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మందుకు సంబంధించిన ప్యాకింగ్ ప్రక్రియ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో VR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు.మందుని పొందటానికి సంబందించిన టోకెన్లు ఇప్పటికే వార్డు కౌన్సిలర్లకు అందించారు. 
 
ఆనందయ్య మందు డబ్బాలలో పంపినీ చేస్తున్నారు. ఒక డబ్బా ఆరుగురు వాడవచ్చు. నిల్వ ఉంచటానికి ఫ్రిడ్జ్ లో పెట్టరాదు.ఈ మందు వాడే రోజున ధూమపానం,మద్యం,మాంసాహారం తీసుకోవద్దు.మందు తీసుకున్న కానీ వ్యాక్సిన్ తెప్పనిసరి.గర్భిణీ స్త్రీలు వాడరాదు.ఇతర ఆయుర్వేదం,అల్లోపతి వాడే వారు కూడా ఈ మందు వాడవచ్చు. కచ్చితంగా మందు తీసుకున్న రోజు 5&6 లీటర్ల మంచినీరు త్రాగాలి.కరోనా వచ్చి తగ్గిన వారు కూడా ఈ మందు తీసుకోవచ్చు. చింతపండు గింజ అంత ఉంటుంది ఈ మందు ఉదయం,సాయత్రం భోజనానికి ముందు ఈ మందుని తీసుకోవాలి ఒక్కరోజు మాత్రమే. 




























Share:

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

చిలకలూరిపేట - బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆర్టికల్ 370 కి వ్యతిరేకంగా ఒక దేశంలో రెండు జండాలు,రెండు రాజ్యాంగాలు ఉండకూడదు అని ఆమరణ నిరాహారదీక్ష చేసి సంఘ విద్రోహుల చేతులో హత్య కాబడిన జనసంఘ్ పార్టీ సృష్టికర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి పుట్టిన రోజు వేడుకలు మన నరసరావుపేట పార్లమెంట్ యువమోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఆయన చేసిన ప్రాణ త్యాగం చేసినందుకు ఈనాడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 రద్దు చెయ్యటం వలన ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరుతుంది అని. ఏ నినాదంతో ఆయన మరణించారా నరేంద్రమోడీ ముఖర్జీ గారు కన్నా కళలన్ని నిజం చేసారు అని తెలిపారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ అచ్చుకోల బ్రహ్మస్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎనుగంటి నరేష్,మాదాల మణి, తేజ,రవికుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు

























Share:

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ

పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోలేదు - 30 కోట్ల కోసం గాంధీపార్కు,కంప్లెక్సులు తాకట్టు పెట్టె చర్య మానుకోవాలి - టీడీపీ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ చరిత్రలో ఏ రాజకీయ నాయకులు అభివృద్ధి కోసం 
మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె పరిస్థితి ఇంత వరకు ఎప్పుడు రాలేదు. మొత్తానికి మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టారు అని ఒప్పుకున్నారు.MLA గెలిచినప్పుడు సీఎం గారితో మాట్లాడి పట్టణ మునిసిపాలిటికి 50 కోట్ల రూపాయలు గ్రాండ్ ఇప్పిస్తూన్నాము అని తెలిపారు. అప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి మేము ఆమెని అభినందించాము. కానీ ఈ రోజు ఆ గ్రాంట్ రావాలి అంటే మునిసిపల్ ఆస్తులను తాకట్టు పెట్టాలి అని చెప్తున్నారు.ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చెయ్యటమే అవుతుంది అని పట్టణ టీడీపీ ఆఫీస్ నందు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రెస్సుమీట్లో తెలిపారు. 

ప్రత్తిపాటి పుల్లారావు గారు పట్టణంలో మంచి నీటి సమస్య పరిష్కారానికి అమృత్ పధకం తీసుకు వచ్చి అంతర్గత పైపు లైనులు 41 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చాక 1 కిలోమీటరు పని కూడా చెయ్యలేదు. 6 వ వార్డులో 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి మీకు తెలియదా రఫాని గారు అని తెలిపారు.పట్టణంలో ఎంత అభివృద్ధి చేసిన ఒక్క మునిసిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టలేదు అని తెలిపారు.మీరు మున్సిపాలిటీ ఆస్తులను తాకట్టు పెట్టె చర్యలు మానుకోవాలి అని తెలిపారు. 
































Share:

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు.

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు నమోదు అయిన కరోనా కేసులు వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ,మండల & యడ్లపాడు,నాదెండ్ల మండల గ్రామాలలో 06-07-2021,మంగళవారం నాడు 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

చిలకలూరిపేట పట్టణంలో ఈ రోజు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. 

యడ్లపాడు మండల గ్రామాలలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

చింఘిజ్ ఖాన్ పేట గ్రామంలో - 1

లింగారావుపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

చిలకలూరిపేట మండల గ్రామాలలో 4 కేసులు నమోదు అయ్యాయి. 

కావూరు గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

ఇర్లపాడు గ్రామంలో - 2

గణపవరం గ్రామంలో -7 

కనపర్రు గ్రామంలో - 2

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 



































Share:

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి.

చిలకలూరిపేట - వర్షన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులు మూయిస్తున్న మునిసిపల్ అధికారులు - కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మాకు సహకరించండి. 

https://chilakaluripetspeednews.blogspot.com/



 

చిలకలూరిపేట పట్టణంలోని మునిసిపల్ అధికారులు మంగళవారం నాడు కర్ఫ్యూ అమలులో భాగంగా వర్షాన్ని కూడా లెక్క చెయ్యకుండా షాపులను మూయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ పట్టణంలోని దుకాణాలు అన్ని మధ్యాహ్నం 2 గంటలకల్లా మూసివేసి మాకు సహకరించండి అని కోరారు. అన్ని ప్రాంతాల వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ మన పట్టణంలో మాత్రం కరోనా కర్ఫ్యూ పాటిస్తున్నాము.అందరూ కలసి కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఉంటే తీవ్రత తగ్గించగలిగితే ఎవరి వ్యాపారాలు వారు కొనసాగించుకోవచ్చు అని వారు తెలిపారు. 





























 
Share:

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు - మధ్యాహ్నం 2 వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి.

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు - మధ్యాహ్నం 2 వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట RTC బస్సు వేళలలో మార్పులు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్.సుజాత తెలిపారు. చిలకలూరిపేట నుండి మాచర్ల,చీరాల,గుంటూరు విజయవాడ, నరసరావుపేట,ఒంగోలు వేళ్ళ మార్గాలలో మధ్యాహ్నం 2 గంటల వరకే బస్సులు తిరుగుతాయి అని ఆమె తెలిపారు. ప్రయాణికులు గమనించి డిపో వారికీ సహారించాలి అని ఆమె కోరారు.అధికారుల నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సు వేళలు ఇలాగే కొనసాగుతాయి అని ఆమె తెలిపారు.  


























Share:

చిలకలూరిపేట పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ - 2గంటలకల్లా మార్కెట్,పట్టణ నలుమూలలా వ్యాపారాలు బంద్

చిలకలూరిపేట పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ - 2గంటలకల్లా మార్కెట్,పట్టణ నలుమూలలా వ్యాపారాలు బంద్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళా మన చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం కరోనా కేసులు విపరీతంగా పెరిగితున్నాయి. ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు ఆదేశాల మేరకు పట్టణంలో కర్ఫ్యూ సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసారు.ఉదయం 6 గంటల నుండి మధ్యాహనం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంటాయి అని తెలిపారు.అలాగే మంగళవారం నాడు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు.పట్టణంలోని టౌన్ పోలీసు వారు పలు సెంటర్లలో షాపులను 2 గంటలకల్లా మూపించారు.ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ కరోనా తీవ్రత తగ్గించాలి అని తెలిపారు 

































Share:

చిలకలూరిపేట - ఆస్థి తగాదా విషయంలో ఘర్షణ - ఒకరు మృతి

చిలకలూరిపేట - ఆస్థి తగాదా విషయంలో ఘర్షణ - ఒకరు మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని వైస్సార్ కాలనిలో ఆస్థి తగాదా ఒకరిని బలి తీసుకుంది. వివరాలలోకి వెళ్తే పట్టణంలోని వైస్సార్ కాలనిలో నివాసం ఉంటున్న జానీ బాషా అంతని బావమరిది సుభాని స్థలం విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ ముదరటంతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో జానీ భాషా తండ్రి సుభాని అడ్డురాగా సుభాని(68) తీవ్రమ్గా గాయపడి అక్కడే మృతి చెందారు. జానీ భాషా బావమరిది సుభాని కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికుల వలన సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 




















Share:

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.

చిలకలూరిపేటలో NRT సెంటర్లో మద్యం మత్తులో లారీతో కారు ఢీ - తృటిలో తప్పిన ఘోర ప్రమాదం. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది.ఒంగోలు నుండి విజయవాడ వైపు వెళ్తున్న చక్క దుంగల లోడుతో వెళ్తున్న లారీ కారుని NRT సెంటర్లో ఢీ కొన్నది. ఈ సమయంలో కారులో వారికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చెయ్యటం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వ్యక్తులు నరసరావుపేట వైపు నుండి రోడ్డు దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

https://chilakaluripetspeednews.blogspot.com/



















































Share:

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని

చిలకలూరిపేట - ప్రభుత్వం గ్యారెంటీ ఉంటూ లోను చెల్లిస్తుంది - పురప్రజల పై ఎటువంటి భారం పడదు - టీడీపీ కౌన్సిలర్లు అనవసరపు రాదంతం చేస్తున్నారు - ఛైర్మెన్ రఫాని 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - గత ప్రభుత్వంలో చేసిన అప్పులు వలన మునిసిపాలిటీ రెవిన్యూ పూర్తిగా లోటు బడ్జెట్ లోకి వెళ్ళింది అని.గత ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన అమృత్ పధకంలో మునిసిపాలిటీ వాటా 82 కోట్లుగా ఉంది.ఏడాది మునిసిపాలిటీ ఆదాయం మాత్రం 8 కోట్లు మాత్రమే. అయితే  MLA రజిని అమృత్ పధకం లోటు బడ్జెట్ను ముఖ్యమంత్రికి విన్నవించగా మునిసిపాలిటీలో ఉన్న ఆదాయ వనరులను చూపించి బ్యాంకులో ఋణం పొందండి. ఆయా నిధులకు సంబంధించిన లోనును మునిసిపాలిటీ ప్రజలపైన ఈ భారం పడకుండా ప్రభుత్వమే చెలిస్తుంది అని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించాలి అని చూస్తుంటే టీడీపీ కౌన్సిలర్లు మాత్రం మా పైన బురద చల్లుతూ ప్రజలను ప్రక్కదోవ పాటిస్తున్నారు అని మునిసిపల్ ఛైర్మెన్ రఫాని తెలిపారు. 

మార్కెట్ యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు తమ పైనే దుష్ప్రభావం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది - ఎంత అభివృద్ధి జరిగింది అనే దాని పైన బహిరంగ చర్చకు రావాలి అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఛైర్మెన్ రఫాని, యార్డు ఛైర్మెన్ బొల్లెద్దు చిన్న,వైస్ ఛైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  



































Share:

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్

06-07-2021,మంగళవారం నుండి చిలకలూరిపేటలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు,బ్యాంకు కార్యకలాపాలు జరుగుతాయి - ఇన్సిడెంట్ కమాండర్ 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంల,మండల గ్రామాలలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ 06-07-2021 మంగళవారం నుండి కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తూ వ్యాపారాలు, దుకాణాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయి అని కరోనా నియమాలు పాటించనివారి పైనా కఠిన చర్యలు తప్పవు అని ఇన్సిడెంట్ కమాండర్ మల్లిఖార్జునరావు తెలిపారు.సోమవారం జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో కరోనా తీవ్రత తగ్గించటానికి కర్ఫ్యూ సమయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కరోనా నియమాలు కఠినంగా అమలు చేయాలి అని కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ సమావేశంలో కమిషనర్ రవీంద్ర,నోడల్ డాక్టర్ గోపీనాయక్, SI నరసాదాసు,ఎంపీడీఓ హేమలతా దేవి, శివ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.  
































Share:

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు నమోదు ఐన కరోనా కేసుల వివరాలు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట నియోజకవర్గంలో 05-07-2021,సోమవారం నాడు మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 

పట్టణంలో 2 కేసులు నమోదు అయ్యాయి. 

సుబ్బయ్యతోట లో - 1

బొందిలిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి. 

నాదెండ్ల మండల గ్రామాలలో మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి. 

గణపవరం గ్రామంలో - 4

సంక్రాంతిపాడు గ్రామంలో - 2

నాదెండ్ల గ్రామంలో - 1

గిరిజవోలు గ్రామంలో - 2 గా నమోదు అయ్యాయి. 

ఈ రోజు చిలకలూరిపేట మండల గ్రామాలలో గాని, యడ్లపాడు మండలంలో కానీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 



























Share:

చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు.

చిలకలూరిపేట పట్టణంలోని పలు సెంటర్లలో ఉన్న అల్లూరిసీతారామరాజు,వంగవీటి విగ్రహాలకు ఘన నివాళి తెలిపిన నాయకులు. 

https://chilakaluripetspeednews.blogspot.com/

మన్యం దొర అల్లూరి సీతారామరాజు & వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా పట్టణంలోని పలు సెంటర్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు పట్టణ నాయకులు.బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెటించిన మన అల్లూరి యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పారు. ఆనాడు అల్లూరి లాంటి వారి చేసిన ప్రాణ త్యాగాలకు ఈ రోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అని తెలిపారు.అలాగే వంగవీటి మోహన రంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం అయన చేసిన చర్యలను తలుచుకున్నారు. ఈ కార్యక్రమాలలో వైస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

శ్రీ అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట లోని ఎన్నార్టీ సెంటర్లో ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు చెరుకూరి కాంతయ్య గారు మరియు రోటరీ క్లబ్ సభ్యులు మరియు భగవద్గీత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడిపల్లి నాగభూషణం గారు అల్లూరికి కి ఘన నివాళి అర్పించారు. అనంతరం బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపర్తి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి తన్నీరు రామారావు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పులుగుజ్జు మహేష్ వంకాయలపాటి వంశీ మరియు ఇతర పార్టీ నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహ వ్యవస్థాపకులు వేగేశ్న అంజి రాజు వివిధ స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొని నివాళులర్పించారు. 






































Share:

చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు

చిలకలూరిపేట - 30కోట్ల రూపాయలకు గాంధీపార్కు తాకట్టు పెట్టటం ఏంటి ! - మునిసిపల్ కౌన్సిల్ హాలును కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాలను చెట్ల క్రింద నిర్వహించండి - టీడీపీ కౌన్సిలర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఆదివారం నాడు చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు వైస్సార్సీపీ పట్టణంలో చేస్తున్న చర్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.57 సంవత్సరాల చరిత్ర ఉన్న చిలకలూరిపేట మునిసిపాలిటీ ఆస్తులను బ్యాంకులకు తాకట్టుపెట్టాన్ని వైస్సార్సీపీ చేతకాని తనంగా అభివర్ణించారు. అలాగే గాంధీ పార్కు మరియు పార్కు బయటఉన్న మునిసిపల్ కాంప్లెక్స్ లను తాకట్టు పెట్టటం సిగ్గు చేటు అని తెలిపారు. పార్క్ మరియు కంప్లెక్సలను బ్యాంకులో 50 కోట్లకి తాకట్టు పెడదాం అని అడిగితే దానికి సదరు బ్యాంకు అధికారులు వ్యాల్యూవేషన్ వేసి 30 కోట్లు మాత్రమే ఇస్తాము అని తెలపగా 30 కోట్ల రూపాయలకి తాకట్టు మాకు సమ్మతమే అని తెలిపారు అని విశ్వసనీయత సమాచారం అని తెలిపారు.పట్టణంలో ఎంత మంది MLA , మినిస్టర్ అయిన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సమీకరించారు కానీ ఇలా  ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని అన్నారు.మునిసిపల్ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి కౌన్సిల్ సమావేశాని చెట్టు క్రింద నిర్వహించామని అన్నారు. అలా మునిస్పల్ ఆస్తులన్నీ అమ్మిన తరువాత మనుషులను కూడా తాకట్టు పెట్టండి అని అన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తూ ఇలా మునిసిపల్ ఆస్తులన్నీ తాకట్టు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే ఎలాంటి కార్యకలాపాలన్నీ విరమించుకోవాలి. లేదు అంటే ఉద్యమం చేసి ఆస్తులను కాపాడుకుంటాం అని తెలిపారు.ఈ సమావేశంలో 8 మంది టీడీపీ కౌన్సిలర్లు,టీడీపీ నాయకులూ పాల్గొన్నారు.    



























Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.