చిలకలూరిపేట - నిరుపేదల జేబులుకొడుతున్న ఆధార్ సెంటర్ - ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు
చిలకలూరిపేట - కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు అందాలి అంటే మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ చేసి ఉండాలి అని పేద ప్రజలు ఆధార్ వెరిఫికేషన్ సెంటర్లకు వెళ్తే అక్కడ సిబ్బంది తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చిలకలూరిపేట పట్టణంలోని RVSCVS హైస్కూల్ ముందు ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్ నందు సిబ్బంది ఆధార్ రీవెరిఫికేషన్ కోసం వచ్చిన నిరుపేదల వద్ద నుండి ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు బయటపడింది. ఆధార్ కార్డులోని మార్పుల కోసం 50 రూపాయలు చెలించవలసి ఉంది. కానీ సదరు సిబ్బంది పేద ప్రజల నుండి 200 రూపాయలు వసూళ్లు పాల్పడుతున్నారు అని అక్కడికి వచ్చిన బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 200 ఇవ్వకపోతే రెండు రోజులు ఆగాక రావాలి అని చెపుతున్నారు అని బాధితులు వాపోయ్యరు. అదేంటి అని గట్టిగ ప్రశ్నించినందుకు సర్వర్ పని చెయ్యటం లేదు అని చెప్పి మధ్యాహ్నం 1:30 నిమిషాలకల్లా షాప్ మూసి వెళ్లిపోయారు. పొద్దున్నే 7 గంటలకు వచ్చాము అని తమది చుట్టుపక్కగా గ్రామాలు అని పొద్దున నుండి తిండి తిప్పలు లేకుండా లైన్లో వేచి ఉంటే ఇప్పుడు ఆన్లైన్ పని చెయ్యటం లేదు అని చెప్పి షాపు మూసివేశారు అని తెలిపారు.