మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం

 చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - జూన్ 10 వ తారీకున సినీనటుడు, హిందుపూర్ MLA అయిన నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేట మండల గ్రామాలూ అయిన కావూరు, లింగంగుంట్ల గ్రామంలోని బాలకృష్ణ ఫాన్స్ తరుపున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు తెలిపారు.  

కరోనా వలన రక్తం ఇచ్చే వారు లేక  బ్లడ్ బ్యాంకు నందు రక్తం నిల్వలు తగ్గిపోయిన కారణంగా అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఈ రక్తం కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం అని సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ మహా రక్తదానంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.

వేదిక :- లింగంగుంట్ల, కావూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద

గమనిక :- కరోనా నియమాలు పాటిస్తూ, మాస్క్,శానిటైజేర్  వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించవల్సిందిగా కోరుతున్నాము. 


























Share:

చిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం

చిలకలూరిపేట - లాడ్జి లోని అస్థిపంజరం యెక్క ఫోరెన్సిక్ నివేదిక కోసం క్లూస్ టీం 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట - గత వారంలో ఎన్ఆర్టి సెంటర్లోని శ్రీనివాస లాడ్జి నందు బయటపడిన అస్థిపంజరం యొక్క వివరాల కోసం ఫోరెన్సిక్ నివేదిక రెడీ చెయ్యటానికి క్లూస్ టీం మరియు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. దీని వలన అస్థిపంజరం ఎవరిది, హత్య లేదా ఆత్మ హత్య, ఎన్ని రోజుల క్రితం జరిగింది అనే విషయాలు కొంతవరకు తెలుసుకొని కేసుని దర్యాప్తు చెయ్యటానికి సులభం అవుతుంది. ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. SI అజయ్ బాబు మరియు పోలీస్ సిబ్బంది వారికీ సహకరిస్తూన్నారు  



























Share:

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం

దేశంలోనే మొట్టమొదటిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి గ్రామం 

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా వ్యాక్సిన్ అంటే ఆమడ దూరం పారిపోయే గ్రామా ప్రజలకు ఈ వార్త నిజంగా ఇన్సిప్రెషన్ అవ్వాలి. మన దేశంలోని జమ్మూకాశ్మిర్లో ఒక చిన్న గ్రామం బందిపూర్ జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయిన్ గ్రామం. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి అయినది. ప్రతి రోజు వైద్య సిబ్బంది 18 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లి అందరి వ్యాక్సిన్ వెయ్యటం పూర్తి చేసారు. అలా దేశంలోనే తొలిసారిగా 100% వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న ఊరుగా  వేయిన్ గ్రామం నిలిచింది 






















Share:

చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు

చిలకలూరిపేట - పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి  - సిపిఎం పట్టణ కార్యదర్శి వేంకటేశ్వర్లు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట - రోజుల రోజుకి పెట్రోల్,డీజిల్ రేట్లు పెరిగిపోతుంటే సామాన్యులు ఎలా బ్రతకాలి అని సిపిఎం పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల జేబుకి చిల్లు పెట్టుతుంది అని. ఆయిల్ ధర పెరగటం వలన నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగిపోయాయి. అందువలన  వెంటనే పెట్రోల్,డీజిల్ లను GST పరిధిలోకి తీసుకువచ్చి సామాన్యుడి అభివృద్ధికి సాయం చెయ్యాలి అని తెలిపారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ సాతులూరి బాబు,ఎస్ కృష్ణారావు పార్టీ సభ్యులు పాల్గొన్నారు. 

























Share:

చిలకలూరిపేట 07-06-2021,సోమవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు

చిలకలూరిపేట 07-06-2021,సోమవారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట 07-06-2021, సోమవారం నాడు పట్టణంలో & మండల గ్రామాలలో మొత్తం 33 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 


చిలకలూరిపేట పట్టణంలో 12 కేసులు నమోదు అయ్యాయి, వాటి వివరాలు 

సాంబశివా నగర్ లో - 2

భావనారుషి నగర్ లో - 1

మద్ది మల్లయ్య వీధి లో - 6

పురుషోత్తమపట్నం - 2

రూత్ డైక్ మెన్ కాలనీ లో - 1 గా నమోదు అయ్యాయి. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 21 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

రామచంద్రపురం గ్రామంలో - 1

మురికిపూడి గ్రామంలో - 11

గోవిందపురం గ్రామంలో - 2

బొప్పూడి గ్రామంలో - 1

యడవల్లి గ్రామంలో - 2

వేలూరు గ్రామంలో - 4 గా నమోదు అయ్యాయి 

































 
Share:

గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి

గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు - ఇలా అప్లై చెయ్యండి 

https://chilakaluripetspeednews.blogspot.com/

గుంటూరు జిల్లా వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి. ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్,డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్తులు కలిగే ఉన్నట్లు జిల్లా DMHO యాస్మిన్ గారు తెలిపారు. 

దరఖాస్తు కోసం https://guntur.ap.gov.in/notice/recruitment-of-team-leader-and-aarogya-mithra-posts-on-outsourcing-basis-under-dr-ysr-aarogyasri-health-care-trust-in-guntur-district/ ఆ లీక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. 9 వ తారీకు లోపు ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త కార్యాలయంలో సమర్పించాలి అని తెలిపారు 










































 
Share:

ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు

 ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు - కర్ఫ్యూ సమయాలలో మార్పు 

https://chilakaluripetspeednews.blogspot.com/
ఏపీలో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. జూన్ 10 తో లాక్ డౌన్ ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే  కర్ఫ్యు సమయంలో కొన్ని మార్పులు చేసారు. ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు పని వేళల  సమయాన్ని పొడిగించారు. మధ్యాన్నం 2 గంటల నుండి తర్వాత ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు పని చేస్తాయి అని తెలిపారు.   






























Share:

చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు

చిలకలూరిపేటలో 33 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ - భారీగా దొరికిన నగదు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పండరీపురంలోని  ఒక అపార్టుమెంట్లో పేకాట ఆడుతున్న 33 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 13,50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం లో డబ్బులు , ఒకే అపార్టుమెంట్లో 33 మందిని ఒకేసారి అరెస్ట్ చెయ్యటం తో ఆ ప్రాంతం అంత ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. కుటుంబాలు నివసించే ప్రదేశాలలో ఇలాంటి కార్యాకలాపాలు చేసే వారిని కఠినంగా శిక్షించాలి అని స్థానికులు చెపుతున్నారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు హాజరుపరుస్తాం అని తెలిపారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తెనాలి, పట్టణంలోని వ్యక్తులుగా గుర్తించారు. 































Share:

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు

చిలకలూరిపేటలో ఆనందయ్య మందు లాంటి మందు పంపిణి కి సిద్ధం చేస్తున్న డాక్టర్ నుండి మందును సీజ్ చేసి మందుని పోలీస్టేషన్ కు తరలింపు  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణంలోని అమ్మ పాలిక్లినిక్ నందు కరోనా సోకినా వారికీ,కరోనా సోకకుండా ఉండేందుకు ఆనందయ్య లాంటి మందుని పంపిణి చేస్తున్నట్లు డాక్టర్ హనీఫ్ తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న చిలకలూరిపేట టౌన్ SI అనిల్ బాబు, శానిటరీ ఇన్స్పక్టర్ శ్రీనివాసరావు, మునిసిపల్ రెవెన్యూ అధికారి ఫణి కుమార్  అమ్మ పాలిక్లినిక్ కి చేరుకొని పంపిణీకి సిద్ధంగా ఉంచిన మందుని పరిశీలించి మందు పంపిణీ చెయ్యటానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అలాగే పంపిణీకి సిద్ధం గా ఉన్న మందును సీజ్ చేసి పోలీస్టేషన్ కి తరలించారు. 








































Share:

చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు

 చిలకలూరిపేట 06-06-2021,ఆదివారం నాడు పట్టణ & మండల గ్రామాలలో కరోనా కేసుల వివరాలు 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట పట్టణ & మండల పరిధిలో ఆదివారం నాడు మొత్తం 28 కేసులు నమోదు అయ్యాయి. అందులో 

చిలకలూరిపేట పట్టణం లో 3 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

సుధా వారిపాలెం లో  - 1

సుగాలి కాలనీ లో - 1

రజక వీధి లో - 1 గా నమోదు అయ్యాయి. 


చిలకలూరిపేట మండల గ్రామాలలో 25 కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు 

మురికిపూడి గ్రామంలో - 4

యడవల్లి గ్రామంలో  - 1

బొప్పూడి గ్రామంలో  - 1

గోవిందపురం గ్రామంలో  - 2

కావూరు గ్రామంలో - 9

లింగంగుంట్ల గ్రామంలో - 4

గొట్టిపాడు గ్రామంలో - 1

వేలూరు గ్రామంలో - 2

నాగబైరువారిపాలెం గ్రామంలో - 1 గా నమోదు అయ్యాయి 








































Share:

సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య

సోమవారం నుండి మందు పంపిణి షురూ చేసిన ఆనందయ్య  

https://chilakaluripetspeednews.blogspot.com/

చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న ఆనందయ్య మందు పంపిణి పైన క్లారిటీ ఇచ్చారు. ఆదివారం ఎర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆనందయ్య మాట్లాడుతూ ప్రజలు మందు కోసం వేచి చూస్తున్నారు అని అందువలన సోమవారం నుండి మందు పంపిణి జరుగుతుంది అని తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య సోదరుడు, శిష్యబృందం మందుని అందజేస్తారు అని. క్యూ లైన్ లో ఉన్న వారికి త్వరగా మందు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని ప్రాంతాల వారికీ త్వరలో మందు పంపిణి చేస్తాం అని తెలిపారు     























Share:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సతీమణి మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/


ఆంధ్రప్రదేశ్ - గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి ముఖ్యమంత్రి మరియు కేంద్ర హోమ్ శాఖా మంత్రిగా చేసిన కాసు బ్రహ్మనందరెడ్డి సతీమణి అయిన కాసు రాఘవమ్మ (96) గారు ఆదివారం హైద్రాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె స్వస్థలం చిలకలూరిపేట నియోజవర్గం అయిన నాదెండ్ల మండలం. ఆమె మరణ వార్త తెలుసుకున్న మండల ప్రజలు ఆమెకు సంతాపం తెలిపారు. అలాగే రాజకీయ నాయకులూ, ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు 

















Share:

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది - అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు

గుంటూరు జిల్లా - కంచె చేను మేసినట్లుంది -  అక్రమ మద్యం - మామూళ్లు వసూళ్లు చేస్తున్న SI లపైన వేటు 

https://chilakaluripetspeednews.blogspot.com/

కంచె చేనుని మేసినట్లు - గుంటూరు జిల్లాలో అక్రమ మద్యం కట్టడి చెయ్యాల్సిన పోలీస్ వారే ప్రోత్సహించారు. జిల్లాలోని పలనాడు ప్రాంతం మపాళ్ళ, దుర్గి SI లు ఈ ఘటనకు పాల్పడారు. ముప్పాళ్ల SI నాగేశ్వరరావు , దుర్గి SI రామాంజనేయులు  పైనా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో ఇరువురు SI లు ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకువచ్చి అమ్మే వారి దగ్గిర నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. వెంటనే పోలీసు ఉన్నత అధికారులు ఇరువురి SI ల పైన వేటు వేశారు  







































Share:

చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు

చిలకలూరిపేట - పట్టణంలోని 23 వార్డులో మంచినీటి కోసం అవస్థలు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని 23వ వార్డు లోని ప్రజలు మునిసిపాలిటీ వాటర్ రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వార్డులోని ప్రజలు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వార్డులో మంచినీటి సమస్య ఉన్నది అని, ప్రతి రోజు రాత్రి సమయాలలో నిద్రలేకుండా మంచినీటి కోసం మోటర్లు వేస్తు తెల్లవారు జామున వేచి ఉన్నకాని మునిసిపాలిటీ వాటర్ రావటం లేదుఅని, పొద్దుపొద్దున్నే లేచినప్పటి నుండి మధ్యాహ్నం వరకు కూడా మంచినీరు నిత్యావసరం అని,వార్డు ప్రజలువారి బాధను వ్యక్తం చేసారు. 23వ వార్డు లోని గౌడ పాలెం , సత్రం బజార్, దర్గ బజార్, మామిడోళ్ల బజార్లోని ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానికి వార్డు కౌన్సిలర్ కంచర్ల కరుణ గారు అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకులతో మంచి నీటిని అందించారు. గతంలో 10 రోజుల క్రితం కూడా వార్డు ఇంచార్జి శ్రీరాం శివ పార్వతి గారు కూడా ఇలాగే వాటర్ ట్యాంకులని తెపించి మంచి నీటిని అందించారు. అయితే వార్డు ప్రజలు మాత్రం వాటర్ ట్యాంకులతో కాకుండా మంచినీటిని పైపుల ద్వారా అందించటానికి, వాటి సంబందించిన అధికారులతో మాట్లాడి  మరమ్మతులు త్వరగా పూర్తి చేయించి నీటి సమస్యని పరిష్కరించాలి అని కోరారు. 




































Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.