చిలకలూరిపేట - నందమూరి బాలకృష్ణ పుట్టినరోజున సందర్భంగా కావూరు,లింగంగుంట్ల గ్రామంలలో మహా రక్తదానం శిబిరం
చిలకలూరిపేట - జూన్ 10 వ తారీకున సినీనటుడు, హిందుపూర్ MLA అయిన నందమూరి బాలకృష్ణ 61వ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేట మండల గ్రామాలూ అయిన కావూరు, లింగంగుంట్ల గ్రామంలోని బాలకృష్ణ ఫాన్స్ తరుపున మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు తెలిపారు.
కరోనా వలన రక్తం ఇచ్చే వారు లేక బ్లడ్ బ్యాంకు నందు రక్తం నిల్వలు తగ్గిపోయిన కారణంగా అత్యవసర సమయాలలో ఉపయోగపడే ఈ రక్తం కోసం ఈ రక్తదాన శిబిరం నిర్వహించాలి అని నిర్ణయించుకున్నాం అని సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అభిమానులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ మహా రక్తదానంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు.
వేదిక :- లింగంగుంట్ల, కావూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద
గమనిక :- కరోనా నియమాలు పాటిస్తూ, మాస్క్,శానిటైజేర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించవల్సిందిగా కోరుతున్నాము.