మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్

చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్ 


https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేటలో కరోనా కేసులు రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ రోజు అనగా 21-04-2021 బుధవారం నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలి కమిషనర్, ఎంపీడివో, పోలీసుశాఖ వారికీ  ఆదేశాలు జారీ చేసారు తసీల్ధార్ సుజాత గారు. 

 * పట్టణములోని, మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న దుకాణాలు అన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాన్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంచాలి అని,
 * రెస్టారెంట్, హోటల్స్ పార్సెల్ మాత్రమే అనుమతి. 
 * టీ షాప్స్ కు అనుమతులు లేవు కావున తెరవకూడదు. 
 * శ్రీ రామ నవమి పండుగను ఎవరి ఇంటిలో వారే చేసుకోవాలి, పబ్లిక్ లో చేసుకోవటానికి అనుమతులు లేవు. 
 * పట్టణంలో,గ్రామాలలో జాతరలు,తిరునాళ్లలు  జరుపుకోవటానికి అనుమతులు లేవు. 
 * ముఖ్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయల అపరాధ రుసుము వసూళ్లు చేస్తారు. 
 * తోపుడు బళ్ళు ఒకే చోట ఉండకుడదు. 
* ఫంక్షన్స్ , ఇతర కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. 

     పైన నిబంధనలు పాటించనివారు IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు. 













Share:

చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

 చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు. 

కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R  శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.    





















Share:

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు

చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట పట్టణంలోని గౌడ కళ్యాణ మండపం నందు స్వతంత్ర సమర యోధుడు, బీసీ వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన శ్రీ సర్ధార్ గౌతు లచ్చన్న గారి 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సర్ధార్ అంటే గుర్తు వచ్చేది రెండే పేర్లు 1 సర్ధార్ వల్లభాయ్ పటేల్, 2 సర్ధార్ గౌతు లచ్చన్న గారు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పలు సార్లు మంత్రిగా చేసారు. బ్రిటిష్ వారికీ వ్వతిరేకంగా 1932 లో జరిగిన శాసన ఉల్లంఘన  ఉద్యమాల్లో పాల్గొని 5 నెలల పటు జైలు జీతాన్ని గడిపారు. 1930 లో గాంధీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహము లో పాల్గొని బారువా సమీపంలో ఉన్న ఉప్పు నీటితో ఉప్పు తయారు చేసి ఆ డబ్బులతో ఉద్యమాన్ని నడిపారు. తన  96 వ ఏటా కన్నుమూశారు  అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యకమాలొ చిలకలూరిపేట గౌడ్ యూత్, బీసీ సంఘ నాయకులూ పాల్గొన్నారు 













Share:

చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్

 చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్  

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో పేకాట స్థావరాల పైనా సీఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో  దాడులు నిర్వహించారు . వివరాల్లోకి వెళితే పట్టణములోని పండరీపురంలోని ఒక అపార్టుమెంట్ నందు పేకాట ఆడుతున్నారు అని సమాచారంతో సీఐ ఆ ప్రాంతాన్ని చేరుకొని తనిఖీలు చేసారు. ఆ సమయంలో 16 మంది పేకాట రాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.6 లక్షల నగదు ,16 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిలాలుద్దీన్ గారు మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. 























Share:

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు

చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు 
https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా ఆంక్షలు పైన నోటీసు రిలీజ్ చేసారు తసీల్ధార్ సుజాత గారు . తక్షణమే ఆంక్షలు అమలులోకి రావని అని చెప్పారు. పట్టణంలోని రురల్,అర్బన్, పరిధిలో గల కళ్యాణ మండపాలను తక్షణమే మూసివేయ్యాలి అని, అలాగే సినిమా హాళ్లలో 50% సీట్ ఆక్యుపెన్సీ తో కొనసాగించాలి అని. మార్కెట్ ను తక్షణమే మూసివేసి విశాలంగా ఉండే మైదానాలో స్టాల్స్ ఎర్పాటు చెయ్యాలి అని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్క్ వాడాలి అని సూచించారు.  





















Share:

ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

 ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు

https://chilakaluripetspeednews.blogspot.com/

కరోనా కారణంగా ఇప్పటికే 1-9 తరగతులకు ఎగ్జామ్స్ లేకుండా ఫై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వెయ్యకుండా వాటి టైం టేబుల్ రిలీజ్ చేసారు. 

పదవ తరగతికి :- సాధారణంగా ఉండే 11 పరీక్షలను 7 పరిక్షలుగా కుదించారు. 

జూన్ 7 - ఫస్ట్ లాంగ్వేజ్ ,

జూన్ 8 - సెకండ్ లాంగ్వేజ్,

జూన్ 9 - ఇంగ్లీష్,

జూన్ 10 - గణితం,

జూన్ 11 - భౌతిక శాస్త్రం,

జూన్ 12 - జీవ శాస్త్రం,

జూన్ 14 - సోషల్ ,

ఇంటర్ :- మే 5-22 వరకు ఫస్ట్ ఇయర్,

                  మే 5-23 వరకు సెకండ్ ఇయర్ 

















Share:

ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు

 ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు 

https://chilakaluripetspeednews.blogspot.com/

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు పాఠశాలలోని విద్యార్థులు కరోనా భారీన పడటం లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం చూస్తూనే ఉంటున్నాం . వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి నుండి అంటే మంగళవారం 19-04-2021 నుండి 1-9 తరగతుల వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.  స్కూలు సెలవలు ఇచ్చారు కానీ కరోనా రెస్ట్ తీసుకోదు పిల్లలని బయటకి పంపకుండా ఇంటి వద్దనే  ఉంచండి  














Share:

చిలకలూరిపేటలో ఈ రోజు సోమవారం నాడు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం - సామాన్య ప్రజలకి కాదు

చిలకలూరిపేటలో ఈ రోజు సోమవారం నాడు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం  - సామాన్య ప్రజలకి కాదు 


https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  ఈ రోజు కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు నోడల్ అధికారి గోపి నాయక్ గారు. పట్టణంలోని పోలీస్,ఎంపీడీఓ,ఎంఆర్ఓ, మున్సిపల్,ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులకి,ప్రైవేట్ ఆరోగ్య సిబందికి సాయంత్రం 7 గంటల వరకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలకి ఈ రోజు ఇవ్వటం లేదు అని స్పష్టం చేసారు. అలాగే సామాన్యులు కరోనా దృష్ట్యా ఆయా ప్రదేశాల వైపు రావొద్దు అని సూచించారు పట్టణములోని రజక కాలనీ లోని ఆరోగ్యకేంద్రం, నాదెండ్ల, యడ్లపాడు, పీ హెచ్ సి లలో ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. 























Share:

రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి

రేపు 19-04-2021 ఫీజు రేయింబర్సమెంట్ డబ్బులు విడుదల - నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలోకి 


https://chilakaluripetspeednews.blogspot.com/


ఎప్పటి నుండో విద్యార్థులు ఎదురు చూస్తున్నా జగనన్న విద్య దీవెన పధకం కింద ఫీజు రేయింబర్స్మెంట్ డబ్బులను రేపు అనగా 19-04-2021 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీ, స్కూల్ యాజమాన్యాలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతా కి తరలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే కాలేజీల యాజమాన్యం పలు సార్లు విద్యార్ధులకి ఫీజు కట్టమని నోటీసులు పంపించారు.














Share:

చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం

చిలకలూరిపేట- మురికి కాలవలో పసిపాప మృతుదేహం కలకలం 


https://chilakaluripetspeednews.blogspot.com/


పట్టణంలోని పోలిరెడ్డిపాలెం మదర్ థెరిస్సా కాలనీ లోని ఒక మురికి కాల్వలో పసిపాప మృతుదేహం కలచివేసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు, మున్సిపల్ సిబ్బంది మృతుదేహాన్ని బయటకు తీశారు. నెలల పాప ని ఇలా కాలవలో పడేయటం స్థానికులని కలచివేసింది. ఈ దుర్మార్గపు చర్యకు కారణం కనుకునే పనిలో పడ్డారు స్థానికులు. 
















Share:

చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు

చిలకలూరిపేట విద్య సంఘం అధ్యక్షులుగా ఎన్నిక అయిన కార్యవర్గాన్ని గారిని సత్కరించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట లో  గడిచిన విద్య సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని సత్కరించారు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. అధ్యక్షునిగా తేళ్ల సుబ్బారావు గారు, ఉపాధ్యక్షునిగా ఘంటా జగన్నాధం గారు, సెక్రెటరీ గా మైలవరపు శివానంద కుమార్ గారు, సంయుక్త కార్యదర్శి గా బేతంచర్ల రామకోటీశ్వరావు గారు, కోశాధికారిగా బచ్చు రామలింగేశ్వరావు గారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.  ఈ సందర్భంగా పుల్లరావు గారు మాట్లాడుతూ 5 సార్లు ఎన్నిక అయిన 14 సంవత్సరాల నుండి విద్య సంఘం అధ్యక్షునిగా ఎన్నిక అయిన తేళ్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సేవలు గుర్తు చేసుకొని ఇలాగే మరింత అభివృద్ధి పధంలో ముందుకి సాగాలి అని తెలిపారు.  
















Share:

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా

బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద కూరగాయలతో లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా 

https://chilakaluripetspeednews.blogspot.com/


చిలకలూరిపేట బొప్పూడి ఆంజనేయస్వామి గుడి వద్ద  కూరగాయలతో వెళ్తున్న అప్పి ఆటో బోల్తా పడింది. వివరాలలోకి వెళ్తే గోవింద పురం కి చెందిన పెద్ద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొలం లో పండిన కూరగాయలను తీసుకొని మార్టూరు మార్కెట్ కి వెళ్లే దారిలో ఆంజనేయస్వామి గుడి వద్ద జాతీయ రహదారి పైన ఒంగోలు వైపు వెళ్తున్న లారీ అప్పి ఆటోని ఢీ కొన్నది. ఆటో అదుపుతప్పి రోడ్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటో లో ప్రయాణిస్తున్న వ్యక్తి మరియు డ్రైవర్ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం సిబ్బంది అక్కడకి వచ్చి గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. 



















Share:

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి

చిలకలూరిపేటలో సోమవారం నుండి 9 నుండి 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయి 

https://chilakaluripetspeednews.blogspot.com/

పట్టంలోని మునిసిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విషయాలు చర్చించారు. ఈ సమావేశంలో చైర్మెన్ రఫాని గారు, వైస్ చైర్మెన్ కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, కమిష్నర్ రవీంద్ర గారు,ది  ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షులు కూనల సుబ్రమణ్యం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న క్రమంలో పట్టణంలోని అన్ని వ్యాపార దుకాణాలు స్వచ్చందంగా  సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం  6 గంటల వరకు మాత్రమే తెరిచివుంటాము అని తెలిపారు. పట్టణ ప్రజలు ఇది గమనించి సహకరించవలసినదిగా కోరారు. అలాగే ప్రతి దుకాణంలో నో మాస్క్ నో సేల్ బోర్డు పెట్టాలి తెలిపారు . కరోనా నియమాలి తప్పకుండా పాటించాలి అని తెలిపారు. 

















 
Share:

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

https://chilakaluripetspeednews.blogspot.com/

చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామము నందు శుక్రవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని జమ్మలమడక ఆదిబాబు అసైన్ట్ భూముల విషయం మాట్లాడటానికి అదే గ్రామాని చెందిన ఆరుమళ్ల వెంకట శివ అనే వ్వక్తి  ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో భూముల విషయం అడగగా వారి మధ్య మాటలు దాటి వెంకటశివ ఆదిబాబుని నెట్టాడు. ఆ సమయంలో ఆదిబాబు పక్కనే ఉన్న కాలవలో పడ్డాడు. దీనితో ఇరువర్గాల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరం నెలకొన్నది. ఇరువర్గాలు రురల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువర్గాలు ఒకే పార్టీ కావటం విశేషం. 


















 
Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.