చిలకలూరిపేటలో ఈ రోజు సోమవారం నాడు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం - సామాన్య ప్రజలకి కాదు
చిలకలూరిపేటలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు నోడల్ అధికారి గోపి నాయక్ గారు. పట్టణంలోని పోలీస్,ఎంపీడీఓ,ఎంఆర్ఓ, మున్సిపల్,ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులకి,ప్రైవేట్ ఆరోగ్య సిబందికి సాయంత్రం 7 గంటల వరకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలకి ఈ రోజు ఇవ్వటం లేదు అని స్పష్టం చేసారు. అలాగే సామాన్యులు కరోనా దృష్ట్యా ఆయా ప్రదేశాల వైపు రావొద్దు అని సూచించారు పట్టణములోని రజక కాలనీ లోని ఆరోగ్యకేంద్రం, నాదెండ్ల, యడ్లపాడు, పీ హెచ్ సి లలో ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment