ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు పాఠశాలలోని విద్యార్థులు కరోనా భారీన పడటం లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం చూస్తూనే ఉంటున్నాం . వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి నుండి అంటే మంగళవారం 19-04-2021 నుండి 1-9 తరగతుల వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. స్కూలు సెలవలు ఇచ్చారు కానీ కరోనా రెస్ట్ తీసుకోదు పిల్లలని బయటకి పంపకుండా ఇంటి వద్దనే ఉంచండి