మురికిపూడిలో అసైన్ట్ భూముల విషయం ఒకే పార్టీ చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ
తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో కన్నుమూత
సోమవారం నుండి వ్యాపార దుకాణాలు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరచి ఉంటాయి -గుంటూరు జిల్లాలో కఠినంగా అమలు చేయాలి అని ఆదేశాలు
చిలకలూరిపేటలో శుక్రవారం నాడు మాస్క్ లేని వారి పైనా అపరాధ రుసుము వసూళ్లు
చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు
చిలకలూరిపేట పట్టణములోని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి - వ్యాక్సిన్ తీసుకోవచ్చు
రంజాన్ నెల ప్రారంభమైన సంగతి అందరికి తెలిసినదే. అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అందరూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రంజాన్ మాసం లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష పాటిస్తారు కావున వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే సందేహంలో ఉంటున్నారు. ఈ సందేహాలకు తెర దించుతూ ముస్లిం మత పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. వ్యాక్సిన్ పొట్టలోకి కాకుండా రక్తనాళాల్లో కి వెళ్తుంది కాబట్టి ఉపవాస దీక్ష భగ్నం కాదని నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని తెలిపారు. అందువలన మన పేట మరియు పరిసర ప్రాంత ముస్లిం సోదరులకు ఈ విషయాన్ని చేరవేయండి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందువలన ప్రార్ధనలో పాల్గొనే ముందు మాస్క్ ధరించి, శానిటైజర్ వాడండి.
చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు
చిలకలూరిపేటలో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లిన కారు
పట్టణంలో ఎన్ ఆర్ టి సెంటర్ నందు శుక్రవారం ఉదయం కారు అదుపుతప్పి రోడ్ పక్కనే వున్నా దుకాణం లోకివెళ్ళింది. వివరాలలోకి వెళ్తే పెదనందిపాడు మండలం అన్నారం గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా నరసరావుపేట వైపు నుండి వస్తూ ఎన్ ఆర్ టి సెంటర్ నందు రోడ్డు దాటుతున్న క్రమంలో ఒంగోలు వైపుగా వెళ్తున్న ఒక లారీ ఢీ కొనటంతో కారు అదుపుతప్పి సెంటర్ లోని రోడ్డు పక్కనే ఉన్న స్వాతి బిర్యాని పాయింట్ లోకి దూసుకువెళ్లింది. ఉదయం కావటంతో ఆ సమయంలో షాప్ తెరిచిలేదు కనుక ఆ సమయంలో ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తపింది. కారు ఒక వైపు దెబ్బతిన్నది.
నిన్న ఆ ప్రదేశానికి 10 అడుగుల దూరంలో మధ్యాహ్నం సమయంలో బైక్కు మంటలు చెలరేగాయి . ఈ రోజు కారు ప్రమాదం జరిగింది అని స్థానికులు చెప్తున్నారు.
చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం
చిలకలూరిపేటలోని టిడ్కొ ఇళ్లలో 200 పడకలతో కరోనా కేర్ సెంటర్కు రంగం సిద్ధం
కరోనా కేసులు మళ్ళి పెరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు 200 పడకలతో కరోనా కేర్ సెంటర్ను మళ్ళి ప్రారంభించబోతున్నారు. పట్టణంలో ఉన్న హాస్పిటల్స్లో బెడ్లు తక్కువ ఉనందువలన ఎమర్జెన్సీ సర్వీస్ కొరకు పేటలోని టిడ్కొ ఇళ్లను కరోనా కేర్ సెంటర్లుగా మార్చనికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 200 పడకలను తరలించి ఆప్రాంతాన్ని శానిటేషన్ చేపిస్తున్నారు అధికారులు.
చిలకలూరిపేటలోని రాగన్నపాలెం నందు డాక్టర్ గోపీనాయక్ గారి ఆధ్వర్యంలో కరోనా టెస్టులు నిర్వహించారు
అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!
అసలు చిలకలూరిపేటలో వచ్చే కరోనా కేసుల వివరాలు నిజమైనవేన !!!
చిలకలూరిపేట పట్టణములో కరోనా కేసుల వివరాలు నిజమైనవేన అంటే కాదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లోనో లేక రజక కాలనీ లోని ఆరోగ్య కేంద్రం లోనో లేక పద్మా సాలిపేట డిస్పెన్సరీ నందు అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు ఎక్కడ టెస్టులు చేస్తున్నారో కూడా సరిఅయిన ఇన్ఫర్మేషన్ లేదు. కరోనా అనుమానం ఉన్నవారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ నందు టెస్టులు చేపించుకుంటున్నారు. అసలు అవన్నీ లెక్కలోకి వస్తాయా అంటే అదీలేదు. కానీ మనకి మాత్రం ఒక్కటి తెలుసు ఏదో ఒక న్యూస్ వెబ్సైట్స్ లో పేటలో అన్ని కేసులు, ఇన్ని కేసులకు అని లేదా ఎవరో ఒకరు ఆ న్యూస్ ని వాట్సాప్ స్టేటస్ గా పెడితే తెలుసుకుంటున్నాం. పేట లో ఏ వీధి లో వెతికిన వీధికి ఇద్దరు చొప్పున హోమ్ కోరంటైన్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇవ్వని తెలియకుండా పేటలో 9 కేసులు వచ్చాయిట , 20 వచ్చాయట అని మాస్కలు వేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కరోనా వాహకాలుగా మారుతున్నారు ప్రజలు.
ఆక్సిజెన్ అంధక చనిపోయారు పాపం, ఇంటి మొత్తానికి ఒకడే అబ్బాయి కరోనా వలన చనిపోయాడు అనే మాటలు చెప్పుకుంటూ బాధపడతాం కానీ ఎవ్వరు సరిగ్గా కరోనా నియమాలు పాటించటంలేదు.మీరు ఈ రోజు మాస్క్ లేకుండా మీరు తిరిగితే ఒకరి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. రెండు సంవత్సరాలో విద్య దూరం అయ్యారు విద్యార్థులు. సరిగ్గా జాబ్ కి వెళ్లే సమయానికి ఈ రెండు సంవత్సరాల విలువ అప్పుడు వారికీ అర్ధం అవుతుంది వారికీ. దయచేసి మనం మన చిలకలూరిపేటని కరోనా ఫ్రీ గా మార్చుకోవటానికి కృషి చేయాలి. దేశం మొత్తం లాక్ డౌన్ పెట్టిన మన పేట లో మాత్రం కరోనా జోన్ లేని ఊరుగా తయారు చేసి బాధ్యత మన అందరిపైనా ఉంది.
చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు
చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు ద్విచక్ర వాహనానికి మంటలు వ్యాపించాయి. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి నరసరావుపేట సెంటర్ నందు కిచిడి తినేందుకు వచ్చి వాహనాన్ని కిచిడి సెంటర్ ముందు పార్క్ చేసి వెళ్లి వచ్చిన క్రమంలో సదరు వాహనదారుడు ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకి వెళ్లే సమయంలో అనూహ్యంగా వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనదారుడు బైక్ ను క్రిందపడ వేసి భయంతో దూరంగా పరుగుతీసాడు.ఇదంతా చుసిన స్థానికులు వాహనం పైన నీరు చల్లి మంటలు అదుపుచేశారు.
చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం ఈ ప్రాంతాల వారికి కరెంటు కోత
చిలకలూరిపేటలో రేపు 15-04-2021 గురువారం ఈ ప్రాంతాల వారికి కరెంటు కోత
పట్టణంలో రేపు గురువారం 15-04-2021న మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం ఎర్పడుతుంది. పట్టణంలోని చౌత్రసెంటర్ , షరాఫ్ బజార్,యల్లయ్య హోటల్ రోడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్,పద్మసాలిపేట , గబ్బిటివారి వీధి, హైస్కూల్ రోడ్ , శివాలయం బజార్,మెయిన్ రోడ్ నందు రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఎర్పడుతుంది.
చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు
చిలకలూరిపేట టీడీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు
పట్టణంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకలు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తేళ్ల సుబ్బారావు గారు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ గారు మాట్లాడుతూ న్యాయవాదిగా,ఆర్ధికవేత్తగా,రాజ్యాంగ నిర్మాతగా భారతీయ్యుల గుండెలో ఎప్పటికి చెరగని ముద్రవేసుకున్నారు అన్నారు. అలాగే ఈరోజు రిజర్వేషన్ ద్వారా వెనకబడిన వర్గాల ప్రజలు ఎంత లబ్ది పొందుతున్నారో అవన్నీ అంబెడ్కర్ గారి వలన అని ఆయనని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులూ, పెద్దలు, పాల్గొని జయప్రదం చేసారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు.
చిలకలూరిపేటలో కరోనా వాక్సిన్ ఎక్కడ వేస్తున్నారు అంటే !!!
చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన
చిలకలూరిపేట రంగన్నపాలెంలోని వాసులకి కరోనా కలకలం - పాస్టర్ మృతితో చర్చి వెళ్లిన వాళ్లలో భయాందోలన
పట్టణములోని రాగన్నపాలెంలో స్థానికంగా ఉన్న ఒక చర్చ్ నందు పాస్టర్గ్ ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈస్టర్ పండుగ నాడు రాగన్నపాలెం చర్చ్ నందు ప్రార్ధన నిర్వహించటానికి వచ్చిన వేలూరు గ్రామానికి చెందిన పాస్టర్ పని ముగించుకొని రాగన్నపాలెం ఉన్న పాస్టర్ని పలకరించి వేలూరు వెళ్లిపోయారు. శనివారం నాడు రాగన్నపాలెం పాస్టర్ కరొనతో మృతి చెందారు. ఆయన స్వగ్రామం వూనురు. అంతిమసంస్కారాలకి ఆయనను పూనూరుకి తరలించారు. ఆయన అంతిమసంస్కరరాలకి రాగన్నపాలెం నుండి 50 మందికి పైగా పాల్గొన్నారు. వేలూరు పాస్టర్ కి ఆరోగ్యం బాగోలేక మంగళవారం నాడు మృతి చెందారు. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది.ఇక రాగన్నపాళెం వాసులకి భయం పట్టుకుంది.స్థానికులు రాగన్నపాలెం నందు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి శానిటైజ్ చెయ్యాలి అని అధికారులని కోరారు.