చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనానికిలో చెలరేగిన మంటలు
చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్ నందు ద్విచక్ర వాహనానికి మంటలు వ్యాపించాయి. స్థానికంగా ఉండే ఒక వ్యక్తి నరసరావుపేట సెంటర్ నందు కిచిడి తినేందుకు వచ్చి వాహనాన్ని కిచిడి సెంటర్ ముందు పార్క్ చేసి వెళ్లి వచ్చిన క్రమంలో సదరు వాహనదారుడు ద్విచక్ర వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకి వెళ్లే సమయంలో అనూహ్యంగా వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనదారుడు బైక్ ను క్రిందపడ వేసి భయంతో దూరంగా పరుగుతీసాడు.ఇదంతా చుసిన స్థానికులు వాహనం పైన నీరు చల్లి మంటలు అదుపుచేశారు.
No comments:
Post a Comment