చిలకలూరిపేటలో నిన్ను ఓడించి నేను గెలుస్తా అని చేసిన శపథాన్ని నిజం చేసిన మన లేడీ సూపర్ స్టార్ రజని -- సినీనటుడు ఆలీ
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ సాక్షిగా 2024 లో నిన్ను ఓడించేది నేనే -- విడదల రజని
పట్టణంలో శనివారం సాయంత్రం వైస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు కార్యకర్తలు భారీ గా తరలి వచ్చారు. MLA విడదల రజని చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సహం తీసుకువచ్చాయి. ఈ సందర్భంలో ఆమె మట్లాడుతూ "2024 లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లో జగన్ ఆశీసులతో BC మహిళగా చిలకలూరిపేట MLA అభ్యర్థి నేనే నిన్ను ఓడించేది కూడా నేనే" అని ప్రతిపక్ష నాయకులకి సవాళ్లు విసిరారు. ఒక SC వక్తి కి మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవి , ఒక మైనారిటీ వక్తికి మున్సిపల్ ఛైర్మెన్ పదవి ఒక జగన్ అన్న ప్రభుత్వం లోనే సాధ్యం అని ఆమె అన్నారు.
చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ
చిలకలూరిపేటలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా సినీ నటుడు ఆలీ
చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ విజయోత్సవ సభకు సినీ నటుడు ఆలీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. గడిచిన మున్సిపల్ ఎన్నిలలలో పట్టణములో వైస్సార్సీపీ 38 వార్డులకి గాను 30 వార్డులతో విజయఢంకా మోగించింది. ఎప్పుడు లేని విధంగా 12 వార్డులలో ముస్లిం మైనారిటీలు గెలుపు గుర్రాలు అయ్యారు. అయితే సినీనటుడు ఆలీ రావటం ప్రాధాన్యత సంతరించుకున్నది. మధ్యాన్నం 3:30 నిమిషాకి ఎన్ ఆర్ టి సెంటర్ లోని వైస్సార్సీపీ కార్యాలయము నుండి భారీ బైక్ ర్యాలీ గా కళామందిర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆలీతో పాటు జిల్లా ఇంచార్జీ , గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, MLA ముస్తఫా, మద్దాలి గిరి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. చిలకలూరిపేట వైస్సార్సీపీ నాయకులూ కార్యకర్తలు భారీ గా తరలిరావాలి అని మున్సిపల్ చైర్మెన్ రఫాని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థకు పోటీగా TDP సొంత టీమ్ ఏర్పాటుకు రంగం సిద్ధం
గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీడీపీ తన యాక్షన్ ప్లాన్ మార్పుపైన కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ వాలంటరీ వ్యవస్థకు పోటీగా టీడీపీ సొంత టీమ్ను రెడీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక కార్యకర్తను ఎంపికచేసి ఎలక్షన్ బాధ్యత అప్పగించాలి అని చూస్తుంది. ఇప్పటికే ఈ యాక్షన్ ప్లాన్కు చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలుపరచాలి అని అనుకుంటున్నట్లు సమాచారం.
చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన
చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ భూముల పరిశీలన :-
చిలకలూరిపేట లో ESI హాస్పిటల్ నిర్మాణం కోసం గురువారం మండలంలోని పోతవరం, బొప్పూడి గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు. ఆసుపత్రి ఎర్పాటు చెయ్యాలి అంటే 5 ఎకరాల భూమి అవసరం. అయితే పోతవరం గ్రామా పరిధిలోని త్రాగునీరు చెరువు సమీపం లో 275,276 సర్వ్ నంబర్లలో 15 ఎకరాలని పరిశీలించారు . అయితే ఆ భూమి ప్రజారోగ్య శాఖకు కేటాయించారు. ఆ భూమి లో నిర్మాణం చెయ్యాలి అంటే కేటాయించిన భూమిలో 5ఎకరాల భూమి కోసం చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాల్సిఉంది . లేదా బొప్పూడి గ్రామా ప్రాంతంలో బొప్పూడి రాజాపేట మార్గంలో 513 సర్వే నెంబర్ కొంత పోరంబోకులో ఉన్న 29. 04 ఎకరాలను పరిశీలించారు. ఈ సందర్భంలో తసీల్ధార్ సుజాత, మండల సర్వేయర్ , ఆర్ఐ , విఆర్వోలు పాల్గొన్నారు.
AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్
AP కొత్త SEC గా నీలం సాహ్ని- ఆమోదముద్ర వేసిన గవర్నర్ హరిచందన్
ప్రస్తుత SEC గా వున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల చివరకు ముగియనున్నది. అందువలన SEC గా ఎవరిని నియమిస్తారు అనే ప్రశ్న కు తెర దిన్చుతూ నీలం సాహ్ని గారి పేరు ఖరారు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు పేర్లను సిఫార్సు చెయ్యగా గవర్నర్ హరిచందన్ గారు నీలం సాహ్ని గా నియమిస్తూ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సీఎం జగన్ కి ముఖ్య సలహాదారుగా ఉన్న ఆమె ఆయా పదవికి రాజీనామా చేసి SEC గా బాధ్యతలు స్వకరించనున్నారు .
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్
చిలకలూరిపేట కళామందిర్ సెంటర్ లో రేపు శనివారం జరగబోవు భారీ బహిరంగ సభ పరిశీలించిన చైర్మెన్,వైస్ చైర్మెన్ :--
పట్టణంలో కళామందిర్ సెంటర్ నందు రేపు శనివారం జరగబోయే భారీ బహిరంగ సభ ఎర్పాట్లను పరిశీలించిన ఛైర్మెన్ రఫాని గారు , కొలిశెట్టి శ్రీనివాసరావు గారు, బూత్ కన్వీనర్ విడదల గోపిగారు, పట్టణ అధ్యక్షులు తలహఖాన్ గారు. ఈ సందర్భంగా రేపు జరగబోయే సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చెప్పాలి అని తెలిపారు.
చిలకలూరిపేటలో శారదా హైస్కూల్ నందు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన మున్సిపల్ ఛైర్మెన్,వైస్ ఛైర్మెన్
చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని
చిలకలూరిపేట పట్టణంలో శనివారం మున్సీపల్ కౌన్సిల్ సభ్యుల విజయోత్సవ ర్యాలీ - భారీ ఎత్తున అభిమానులు పాల్గొనాలి అని పిలుపునిచ్చారు చైర్పర్సన్ - రఫాని
చిలకలూరిపేట లో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైస్సార్సీపీ విజయఢంకా మోగించింది. మొత్తంగా 38 వార్డులకి గాను 30 వార్డులలో ఫ్యాన్ గాలి బాగా వీచింది అనే చెప్పాలి. ఆయా వియజానికి గుర్తుగా శనివారం నాడు పట్టణంలో ఒక భారీ ర్యాలీ ని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ లో పట్టణములోని వైస్సార్సీపీ అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యవలసినదిగా కోరారు మున్సిపల్ చైర్మెన్ రఫాని గారు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
చిలకలూరిపేటకు రెండవ వైస్ ఛైర్మెన్ ఎవరిని వరిస్తుంది !!! ???
26-03-2021 భారత్ బంద్ కు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మద్దతు తెలుపుతూ లేఖ విడుదల చేసింది
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో రెండవరోజు కూడా స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు :--
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ ఆత్మహత్య
చిలకలూరిపేట పసుమర్రులో సూర్యనారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం చిమటావారిపాలెం కి చెందిన సూర్యనారాయణ (61) అనే వ్యక్తి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం పైన పసుమర్రు వెళ్ళాడు. పసుమర్రు శివారుల్లో రహదారి పక్కనే ఉన్న సిమెంట్ బల్లపై గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిమటావారిపాలెం మాజీ సర్పంచ్ గా తెలుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వారు ప్రాధమిక నివేదికలో తేలిచ్చారు. మృతుడు కొంతకాలంగా చిలకలూరిపేట లో నివాసం ఉంటున్నాడు. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.