ఏపీలో చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మంగళవారం నాడు సాధన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. అలాగే రెండు సంవత్సరాల క్రితం పూర్తి చేసిన టిడ్కొ ఇళ్లను ఎంత వరకు ప్రజలకు అందజేయలేదు అని,ఇళ్ల స్థలాల్లో ఘరానా మోసం జరిగింది అని దాని పైన సిబిఐ ఎంక్వీయిరి వెయ్యాలి అని అన్నారు. కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి అని., అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 10 వేల ఆర్ధిక సాయం చెయ్యాలి అని, అమరావతి రైతు దీక్షను పట్టించుకోవటం లేదు అని, పోలీసులు MLA కనుసైగలలో మెలుగుతూ అన్యాయాన్ని ప్రశ్నించిన వారి పైన కేసులు పెడుతున్నారు అని, రాష్ట్రము మొత్తం పేకాట క్లబ్బులతో కళకళలాడుతుంది అని అన్నారు.అసలు జగన్ మోహనరెడ్డికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కూడా లేదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి పుల్లారావు తో పటు జివి ఆంజనేయులు,యరపతినేని శ్రీనివాస్, శ్రావణకుమార్,పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాస్, రవీంద్ర, పార్టీ జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు
Home »
» ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి
ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి
ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు - పత్తిపాటి
No comments:
Post a Comment