చిలకలూరిపేట నియోజవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో బ్లాక్ ఫంగస్ తో అన్నదాత మృతి చెందారు. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ గ్రామంలో బ్లాక్ ఫంగస్ వాళ్ళ చనిపోవటం బాధకరం అని గ్రామ పెద్దలు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే సాతులూరు గ్రామానికి చెందిన రైతు (68) గత కొన్ని రోజుల క్రితం కరోనా బారి నుండి కోలుకున్నాడు. మళ్లీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరి వైద్య పరిక్షలు చెయ్యగా అతనికి బ్లాక్ ఫంగస్ గా గుర్తించారు. వెంటనే GGH కి తరలించి చికిత్స అందిస్తుండగా పక్షవాతం వచ్చి శరీరంలోని అవయవాలు పని చెయ్యక, వైద్యానికి సహకరించక ఆరోగ్యం క్షిణించి మృతి చెందారు.
No comments:
Post a Comment