మన ఊరు మన వార్తలు

Advertisement - 1

Image3

........

ప్రకటనల కోసం 8121277231 నెంబర్ కు సంప్రదించండి.

మన వెబ్సైట్ వాట్సాప్ గ్రూపు కోసం క్రింది వాట్సప్ ఐకాన్ పైన క్లిక్ చెయ్యండి

Whatsapp

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

MLA ఆధ్వర్యంలో వైద్యులకు సత్కారం - కరోన మృతుల కుటుంబాలకు 50,000 - ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం - కలెక్టర్ వివేక్ యాదవ్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు కరోన విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందించిన డాక్టర్లకు  MLA విడుదల రజిని ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ :-

కోవిడ్ సమయంలో ఎనలేని సేవలందించిన డాక్టర్లకు సత్కారం చేయటం మంచి ఆలోచన అని ముఖ్యంగా సెకండ్ వేవ్ నందు కొత్త వైద్య సిబ్బందిని, తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు ఏర్పాటు చేశామని. అలాగే ప్రభుత్వం కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్య సదుపాయాలను అందించిందని. అలాగే కోవిడ్ టీకాలను అందించామని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలను అందించమని వెంటనే మీ సమీప ANMలను సంప్రదించాలని అని ఆయన తెలిపారు. కోవిడ్ వలన చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఆదేశించారని ఆయన తెలిపారు.

MLA మాట్లాడుతూ :-

MLA విడుదల రజనీ మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ & కొరత బెడ్లు కొరత లేకుండా చేశామని -  క్లిష్ట సమయాల్లో కలెక్టర్ గారిని సంప్రదించగా వెంటనే అన్ని సమకూర్చారని ఆమె తెలిపారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఉచితంగా బియ్యం & ఆర్థిక సాయం అందజేశామని ఆమె గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా మన రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రులకు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పని చేశాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషిరెడ్డి, క‌మిష‌న‌ర్ ర‌వీంద్ర‌,తహసీల్దార్ సుజాత,సురేష్ నాయక్,డిప్యూటీ డి.యం.హెచ్.ఓ,వైద్యులు గోపినాయ‌క్,లక్ష్మ నాయక్,సోమల నాయక్,కీర్తి,రాజేష్,శ్యాంసోన్. ప్రియాంక,భాగ్యలక్ష్మి,సీనియర్ డాక్టర్స్ కొల్లా అమర్,కొమ్మినేని వీరశంకరరావు, మక్కెన వంశీ, గరికపాటి వరలక్ష్మి,కందిమల్ల వాసు, వెల్లటూరి పెద్దబ్బాయి,రామకృష్ణ,మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్లు కొలిశెట్టి శ్రీనివాసరావు, వలేటి వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, జడ్పీటీసీలు కాట్రగడ్డ మస్తాన్ రావు,ముక్తా వాసు,కోడె సుధారాణి,ఎంపీపీ లు దేవినేని శంకరరావు, పిడతల ఘాన్సీ,తలతోటి రాణి,నాదెండ్ల మండల అధ్యక్షుడు గొంటు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,విడదల గోపి, తులం సుధాకర్,పిల్లి సాగర్,షేక్ ఆదం వలి, చేమిటిగంటి పార్వతి,చింతపల్లి విల్సన్,షేక్ మీరాబి, షేక్ జమీలా, పుల్లగూర అనురాధ,నాయబ్ సైదాబి,షేక్ నసీమా బేగం,చెంబేటీ భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,ములకలూరి బాజి మున్నీ,యూసుబ్, షేక్ ఖాజా భాను,కొచ్చెర్ల విజయలక్ష్మి, బిట్రా రాజేంద్ర,వడితే కోట నాయక్,రమణి బాయ్, కో ఆప్షన్ సభ్యులు పొలిశెట్టి మస్తాన్,బక్షు మేస్ట్రీ,మరియు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



Share:

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

బద్వేల్లో YSRCP భారీ కాదు అతి భారి విజయం - భర్త కన్న భార్యకి డబల్ మెజారిటీ

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ వీచిన ఫ్యాన్ గాలి - అందరూ అనుకున్నట్లే YSRCP విజయ ఢంకా మోగించింది. గత ఎన్నికల్లో భర్త వెంకటసుబ్బయ్యకు 44,000 మెజారిటీతో గెలుపొందితే. ఇప్పుడు సుబ్బయ్య భార్య దాసరి సుధా కు 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పి సురేష్ కు  21,612 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ కు 6,191 ఓట్లు వచ్చాయి. దీంతో బద్వేల్ ఎన్నికల్లో YSRCP 90,089 ఓట్ల మెజారిటీతో అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంచెం తక్కువగా నమోదు అయినా కూడా భర్త వెంకట సుబ్బయ్య కన్నా డబల్ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో టిడిపి పాల్గొనలేదు.



Share:

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

బద్వేల్ ఉపఎన్నికల్లో సూపర్ స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ - ఎంత స్పీడుగా అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


బద్వేలు ఉపఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం మొదలైంది. అయితే ఇప్పటివరకు జరిగిన మూడవ రౌండ్ కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా 23,700 భారీ ఆదిత్యంలో కొనసాగుతున్నారు, తరువాత బిజెపి అభ్యర్థి పి సురేష్ 1688 ఓట్లతో, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ 580 ఓట్లు పొందారు. ప్రత్యర్థులకు అందనంత ఆదిత్యం లో ఉండటంతో YSRCPపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.



Share:

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

చిలకలూరిపేట:- లారీ బోల్తా - ఇద్దరికి తీవ్రగాయాలు

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట:- చిలకలూరిపేట మండలం పరిధిలోని లింగంగుంట్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం - ఇద్దరికి గాయాలయ్యాయ.

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు ప్రత్తి లోడుతో లారీ వస్తోంది.  లారీ డ్రైవర్ విశ్రాంతి తీసుకోవడంతో.... ఆ  సమయంలో క్లీనర్ డ్రైవ్ చేస్తూ ఉండగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకుతీవ్ర గాయాలు అయ్యాయి. ఇతనిది కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పాసపుల్ల గ్రామం. లారీ క్లీనర్ జమాల్ బాషాకు స్వల్పగాయాలయ్యాయి. ఇతనిది కడప జిల్లా జమ్మలమడుగు. తెల్లవారు జాము 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ సంఘటన జరిగింది.. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ నాగిరెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు.



Share:

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

రోజు పెరిగే పెట్రోల్ రేటు కన్నా ఈరోజు రికార్డు స్థాయిలో పెరుగుదల - ఎంత అంటే ?

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1


గత కొంత కాలంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో వీర విహారంగా ఎగిరిపోతున్నాయి. ప్రతిరోజు 30 నుండి 35 పైసల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేవి. అలాంటివి మొట్టమొదటిసారిగా 40 పైసల పైకి ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా సోమవారం నాడు పెట్రోల్ పై 41 పైసా డీజిల్ పై 42 పైసలు పెరిగాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మెట్రో నగరాల్లో వాహనదారులు ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.



Share:

చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి

చిలకలూరిపేట :- బైక్ పై నుండి లారీ క్రింద పడి మహిళ మృతి 

https://chilakaluripetspeednews.blogspot.com/

చిల‌క‌లూరిపేట - కోట‌ప్ప‌కొండ మార్గంలో శ‌నివారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతి చెందింది. సేక‌రించిన వివ‌రాల మేర‌కు చిల‌క‌లూరిపేట మండ‌లంలోని క‌ట్టుబ‌డివారిపాలెం యూటీకి చెందిన కామ‌కూరి అనంత‌ల‌క్ష్మి(50) త‌న కుమార్తె విజ‌య‌దుర్గ‌కు ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో ప్ర‌త్తిపాడు మండ‌లం య‌న‌మ‌ద‌ల‌లోని కుమార్తె వ‌ద్ద ఉంటోంది. శ‌నివారం డ్వాక్రా ప‌ని ఉండ‌టంతో అల్లుడు భ‌లే వెంక‌టేశ్వ‌ర్లు ద్విచ‌క్ర‌వాహ‌నంపై యూటీ వ‌స్తోంది. పురుషోత్త‌మ‌ప‌ట్నం బొడ్డురాయి వ‌ద్ద  ముందు వెళుతున్న లారీని క్రాస్ చేయ‌బోతున్న స‌మ‌యంలో అనంత‌ల‌క్ష్మి ద్విచ‌క్ర‌వాహ‌నం పై నుంచి జారి లారీ కింద ప‌డింది. దీనితో ఆమె అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. అనంత‌ల‌క్ష్మి పుట్టిన ఊరు పురుషోత్త‌మ‌ప‌ట్నం. యూటీకి చెందిన అచ్చిబాబుతో ఆమె వివాహం జ‌రిగింది. పుట్టిన ఊరులోనే రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో రెండు గ్రామాల‌లోని ఆమె కుటుంబ స‌భ్యుల ఇళ్ల‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.


Share:

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ  - మూడు రోజులపాటు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపులు స్వచ్ఛందంగా బంద్

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

నాటి కన్నడ సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను కనుసైగలతో శాసించిన కంఠీరవ రాజ్ కుమార్ మూడవ కుమారుడు కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్‌కుమార్ అకస్మాత్తుగా నిన్న మరణించడంతో యావత్ కర్ణాటక రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సాధారణంగా ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులు చాలా యాటిట్యూడ్, రిచ్నెస్ మెయిటింగ్ చేస్తూ ఉంటారు. అయితే అది ఏమీ తనకు వంట పట్టించుకోకుండా చాలా సింపుల్ గా జీవితం సాగిస్తూ కన్నడ మరియు దక్షిణ భారతదేశం ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన మరణ వార్త విన్న భారతదేశం చిత్ర పరిశ్రమ అతనితో ఉన్నా అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అలాగే తమిళం, తెలుగు లో ఉన్న స్టార్ హీరోలతో మంచి సంబంధాలను ఏర్పరుచుకున్నారు. అయితే ఈరోజు నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహాన్ని చూడటానికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అయితే అక్కడ విగతజీవిగా ఉన్న పునీత్ ను చూసి ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. సాయంత్రానికి తెలుగు పరిశ్రమ నుండి ఎన్టీఆర్, చిరంజీవి,రాణా లాంటి ప్రముఖులు పునీత్ అంతిమయాత్ర లో పాల్గొననున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మోహన్ బాబు మరియు చాలామంది ఇది సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంఘీభావం తెలిపారు.

ఆయన మృతి పట్ల కన్నడ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బెంగళూరు వ్యాప్తంగా వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. పునీత్ కుమార్తె అమెరికాలో చదువుతున్న కారణంగా ఆమె ఈరోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకొన్నది. నిన్నటి సాయంత్రం నుండి కంఠీరవ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసి పోయింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సినీ ప్రముఖులు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖులు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.







Share:

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ఖరారు చేశారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాలుగు గంటల క్రితమే పునీత్ రాజ్ కుమార్ బజరంగీ-2 సినిమా సూపర్ హిట్ అయినందుకు చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా విక్రమ్ ఆసుపత్రికి చేరుకోవడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. సీనియర్ పోలీస్ అధికారులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.. అలాగే పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు.. పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని పునీత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్.. యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పునీత్.



Share:

చిలకలూరిపేట:- భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

చిలకలూరిపేట:- భార్య పుట్టింటికి వెళ్ళింది అని మనస్తాపంతో భర్త ఆత్మహత్య

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి గ్రామం నందు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య - వివరాల్లోకి వెళితే బొప్పూడి గ్రామంలోని ఖాదర్ మస్తాన్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యతో గోడవ పడుతూ కొట్లాటలు జరుగుతుంటాయి. వేధింపులకు భరించలేని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఖాదర్ మస్తాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు చేరుకొని మస్తాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో వారు గుంటూరు ఆస్పత్రికి తరలించారు చివరికి చికిత్స పొందుతూ గురువారం నాడు మృతి చెందాడు.



Share:

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే

చిలకలూరిపేట - పట్టణంలో ఆపరేషన్ జీరో వేస్టేజ్ - ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ / డ్రై డే - ఫ్రైడే 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ ఆదేశాల మేరకు స్వచ్ఛ చిలకలూరిపేట సాధించాలని ప్రతిరోజు ఒక వార్డుని ఎంచుకొని వార్డు పరిసరాలలో చెత్తాచెదారం, పాడుబడ్డ బావులు, డ్రైనేజీ కాలువలు, మురికి కాల్వలను, క్లీన్ చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ప్రజలందరూ కచ్చితంగా డ్రై డే - ఫ్రైడే పాటించాలని కోరారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉంచే ప్రదేశాలను వారానికి ఒకరోజు పొడిగా ఉంచాలని వారు కోరారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం కోసం ఇల్లల్లో ఉండే చెత్తను పరిసరాలలో వేయకుండా మున్సిపాలిటీ చెత్త వాహనాలను ఉపయోగించుకోవాలని అని కోరారు. అలాగే డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పుర ప్రజలందరూ సహకరించాలని కోరారు. వార్డులోని పాడుపడ్డ బావులను శుభ్రపరిచి అందులో గంబూష చేపలను ఏర్పాటు చేసి దోమల బెడద లేకుండా చేస్తామని అని వారు తెలిపారు. ఈ చేపల వలన దోమల లార్వా ను (గుడ్డు) అది తిని వేస్తుందని. తద్వారా దోమల వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని వారు తెలిపారు.

             * VIDEO*



Share:

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు

దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్రోల్ పై 7రూ , డీజిల్ పై 8రూ‌ ల బాదుడు 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా ఫస్ట్ లాక్ డౌన్ తరువాత నుండి దేశంలో ఇంధనం రేట్లు ఆకాశానికి వెళ్తున్నాయి. అయితే గత నెల సెప్టెంబర్ 28 నుండి ఈనెల అక్టోబర్ 28 వరకు మొత్తం 24 సార్లు ఇంధనం రేట్లు పెరిగాయి. అందులో పెట్రోల్ పైన 7.11రూ  డీజల్ పైన 8.43రూ పెరిగాయి. దేశంలో ఒక్క నెలలో ఇన్ని సార్లు ఇంత మొత్తంలో ఇంధనం రేట్లు పెరగటం ఇదే మొదటిసారి. చమురు రేట్లు ఈ విధంగా పెరగటంతో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇంధనం రేట్లకి అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు అని సామాన్యులు లబోదిబో మంటున్నారు.



Share:

చిలకలూరిపేట:- టౌన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

చిలకలూరిపేట:-  టౌన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ 

చిలకలూరిపేట అర్బన్ & రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భాగంగా ఈరోజు విద్యార్థులతో పట్టణంలోని ప్రధాన కుడళ్ళు అయిన NRT సెంటర్ నుండి చౌత్ర సెంటర్ మీదగా కళామందిర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నరసరావుపేట డి.ఎస్.పి విజయ భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అమరవీరుల త్యాగాలను కొనియాడారు విద్యార్థులు అందరూ కార్యక్రమానికి సహకరించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ రాజేశ్వరరావు, రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సైలు మోహన్, ఫిరోజ్, రాజేష్ మరియు హోం గార్డ్లు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.



Share:

చిలకలూరిపేట స్క్రబ్ మెంటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం

చిలకలూరిపేట స్క్రబ్ మెంటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం 

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

చిలకలూరిపేట పట్టణంలోని NRT సెంటర్ నందు ఉన్న ఒక స్క్రబ్ మెటల్ డీలర్ స్టోరేజ్ నందు అగ్ని ప్రమాదం సంభవించింది. Nrt సెంటర్ లోని నవయుగ వైన్స్ పక్కనే ఉన్న స్క్రబ్ స్టోరేజ్ నందు మంగళవారం ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు యజమానికి మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే అక్కడ ఉన్నటువంటి పాత సామాను, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, సీసాలు, చాలా వరకు దగ్ధమయ్యాయి. అయితే భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.



Share:

చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన

చెలరేగిన పాకిస్తాన్ - తడబడిన కోహ్లీ సేన

https://chilakaluripetspeednews.blogspot.com/?m=1

భారత్ పై పాకిస్తాన్ భారీ విజయం. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో తడబడింది. రోహిత్ శర్మ డెకౌట్ అవగా వెంటనే కేఎల్ రాహుల్ (3) తో వెనుదిరిగాడు. వెంటనే సూర్యకుమార్ యాదవ్(11) అవుటయ్యాడు. కోహ్లీ(57) పంత్ కొంచెం సేపు మెరిపించినా భారత్ 20 ఓవర్లకు గాను 151-7 వికెట్లు నష్టంతో మొదటి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుంది.

తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ బాబర్ ఆజం(68) రిజ్వాన్(79) చెలరేగిపోయారు. పాకిస్తాన్ ఆట ముందు భారత్ బౌలర్లు తేలిపోయారు. షమ్మీ, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, జడేజా, వరుణ్ చక్రవర్తి ఎవరిని వదలకుండా వీర బాదుడు బాధి పారేశారు పాకిస్తాన్ బ్యాట్స్‌మన్స్. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 13 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ పై పాకిస్తాన్ విజయం సాధించింది.



Share:

WISH చై గురూ

పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయండి. మొదటి 10 మందికి మాత్రమే. ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు ఫోటో, పేరు మా ఫేస్ బుక్ మెసెంజర్ నందు పంపగలరు

ADVERTISEMENT

చంద్రమౌళి కూరగాయల మార్కెట్, నాగేశ్వరావు

...
CHILAKALURIPET SPEED NEWS

Popular Posts

Recent Posts

Blog Archive

Powered by Blogger.