చిలకలూరిపేటలో మంగళవారం నాడు కరోనా టెస్టుల కొరకు భారీగా వచ్చిన ప్రజలు - రిజిస్ట్రేషన్ ఫారంలు లేక ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదం
చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి
చిలకలూరిపేటలో ఇద్దరు మెప్మా ఉద్యోగులు కరొన తో మృతి
చిలకలూరిపేటలో కరొనతో ఇద్దరు మెప్మా ఉద్యోగులు మృతి. వివరాలోకి వెళ్తే గుంటూరు కార్పొరేషన్ మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పట్టణంలోని సాంబ శివ నగరులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, మంగళగిరి లో మెప్మా సిటీ మెషిన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తు మండలంలోని తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న విజయరాజులు గారు. వీరు ఇరువురు కరోనా వలన సోమవారం నాడు మృతి చెందారు.
చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ
చిలకలూరిపేటలో కరోనా టెస్టుల కధ
చిలకలూరిపేటలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు ఎవరో ఒకరు కరొనతో మృతి చెందుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అసలు టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు. సోమవారం నాడు కరోనా టెస్టులు చేపించుకుందాం అని చీరాల రోడ్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళితే " సార్ ఈ రోజు సోమవారం టెస్టులు చెయ్యరు సార్ , మంగళవారం, బుధవారం, గురువారం, శనివారం మాత్రమే చేస్తారు " అని అక్కడి సిబంది చెప్పారు. అంటే మిగిలిన రోజులలో టెస్టులు చెయ్యరా అని సామాన్య ప్రజలు వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోజు సోషల్ మీడియాలో, వార్తలలో చిలకలూరిపేటలో ప్రతి రోజు 10 కేసులు, 15 కేసులు వచ్చాయి అని వార్తలు వస్తుంటే అసలు టెస్టులు చెయ్యకుండా కేసులు ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్నారు. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ,పేదవారు ప్రైవేట్ లాబ్స్ లలో టెస్టులు చేపించుకుందాం అంటే 3000 లేనిదే RTPCR టెస్టు లేదు, 3000 లేనిదే సిటీ స్కాన్ లేదు అని అసలే కరొన వల్ల ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంది. ఇప్పుడు ఈ టెస్టులు కి అంత డబ్బులు కట్టలేక కరోనా లక్షణాలు ఉన్న కాని అలాగే జీవనం సాగిస్తున్నారు.
ఇప్పటికి అయినా ప్రతి రోజు టెస్టులు నిర్వహించాలి అని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత
చిలకలూరిపేటలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టులు నిలిపివేత
చిలకలూరిపేటలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, లెర్నింగ్ లైసెన్సులు, 27-04-2021 నుండి 31-05-2021 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి టెస్టులు నిలిపివేస్తునట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (M V I ) నాగేశ్వరరావు గారు తెలిపారు. ఏపీ రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకునట్లు చెప్పారు. 1-06-2021 న టెస్టుల నిర్వహణ ఎప్పుడు మొదలవుతుందో తెలియచేస్తాము అని చెప్పారు.
దేశంలో ఆక్సిజెన్ నిల్వలు లేక కరోనా రోగులు చనిపోతుంటే - ఎగుమతులు శాతం మాత్రం రేటింపుగా ఉంది.
చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి
చిలకలూరిపేటలో కరోనా వలన మరొకరు మృతి
చిలకలూరిపేటలో కరోనా కేసులు మాత్రమే కాదు మృతులు కూడా పెరుగుతున్నారు. ఈ రోజు పట్టణంలోని స్థానికంగా ఎన్ ఆర్ టి సెంటర్లోని ఒక అపార్టుమెంట్ నందు నివాసం ఉంటున్న పొన్నూరు గణపతి (61) కరొనతో మృతి చెందారు. గత కొన్ని రోజులగా కరొనా తో గుంటూరు లోని ప్రముఖ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటూ ఈ రోజు మృతి చెందారు.
గత కొన్ని రోజులగా ఇద్దరు పాస్టర్లు, యంగ్ గోల్డ్ వ్యాపారి, ఇప్పుడు ఇంకొకరు మృతి చెందటంతో పట్టణంలో ప్రజలు బయాందోనలో ఉన్నారు.
కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి
కరోనా రాకుండా ఉండాలి అంటే 1 సరిపోదు 2 మాస్కులు వాడాలి
చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్
చిలకలూరిపేటలో నేటి నుండి ఫుల్ లాక్ డౌన్
చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు
చిలకలూరిపేట తహసీల్దార్,కమిషనర్, MLA ను కలిసిన చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు
పట్టణంలోని చంద్రమౌళి కూరగాయల వర్తక సంఘం సభ్యులు మంగళవారం నాడు MLA , తహసీల్దార్,కమిషనర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా మార్కెట్ మూసివేసి విశాలమైన మైదానంలో స్టాల్ ఎర్పాటు చేసిన అక్కడకు కూడా ప్రజలు గుంపులు గుంపులు గా వస్తారు. గత అనుభవాల దృష్ట్యా మార్కెట్ అక్కడ ఉంచి మొత్తం 80 షాపులలో 40 ఒక రోజు 40 ఇంకొక రోజు ఎర్పాటు చేసుకుంటూ, షాప్ వదిలి షాప్ తెరచి ఆలా అమ్మకాలు సాగిస్తాం అని తెలియచేసారు. అలాగే గత లాక్ డౌన్ లో హోల్సేల్ మార్కెట్ పెద్ద మార్కెట్ యార్డ్ నందు ఎర్పాటు చేసారు. ఆ సమయంలో అక్కడ నుండి కురగాయలు కొనుగోలు చేసి సంతలో ఎర్పాటు చేసిన రిటైల్ మార్కెట్ వెళ్లే సమయంలో రోడ్డు ప్రమాదం జరిగి మార్కెట్ వ్యక్తిని కోల్పోయాము అని తెలియచేసారు. ఈసారి వ్యవసాయ చిన్న మార్కెట్ యార్డ్ నందు హోల్ సేల్ కి అనుమతి ఇచ్చి రిటైల్ ను ప్రస్తుత మార్కెట్ నందు నిర్వహించుకుంటాం అని తెలియచేసారు.
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఖాళీ చేసి 15 రోజుల పాటు శానిటైజేషన్ చెయ్యాలి అని. రిటైల్ దుకాణాలు అన్ని విశాలమైన మైదానాలలో మార్చాలి అని తెలియచేసారు. ఈ సమావేశంలో గుడిపల్లి భూషయ్య, కామయ్య, MNR శ్రీను, R శ్రీనివాసరావు, కంచర్ల ప్రసాద్, గంటల రవి, CSR, వలీ,మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలో సర్ధార్ గౌతు లచ్చన్న వర్ధంతి నిర్వహించిన గౌడ యూత్, బీసీ సంఘ నాయకులు
చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్
చిలకలూరిపేటలో పేకాటరాయుళ్ల - 16 మందిని అరెస్ట్
చిలకలూరిపేటలో రేపటి నుండి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి - కళ్యణ మండపాలు, మార్కెట్, సినిమా హాళ్లు పైన ఆంక్షలు
ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు
ఏపీలో టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు
కరోనా కారణంగా ఇప్పటికే 1-9 తరగతులకు ఎగ్జామ్స్ లేకుండా ఫై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వెయ్యకుండా వాటి టైం టేబుల్ రిలీజ్ చేసారు.
పదవ తరగతికి :- సాధారణంగా ఉండే 11 పరీక్షలను 7 పరిక్షలుగా కుదించారు.
జూన్ 7 - ఫస్ట్ లాంగ్వేజ్ ,
జూన్ 8 - సెకండ్ లాంగ్వేజ్,
జూన్ 9 - ఇంగ్లీష్,
జూన్ 10 - గణితం,
జూన్ 11 - భౌతిక శాస్త్రం,
జూన్ 12 - జీవ శాస్త్రం,
జూన్ 14 - సోషల్ ,
ఇంటర్ :- మే 5-22 వరకు ఫస్ట్ ఇయర్,
మే 5-23 వరకు సెకండ్ ఇయర్
ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు
ఏపీలో విద్యార్ధులకి రేపటి నుండి సెలవలు - టెన్త్, ఇంటర్కు మినహాయింపు
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు పాఠశాలలోని విద్యార్థులు కరోనా భారీన పడటం లేదా ఉపాధ్యాయులు కరోనా బారిన పడటం చూస్తూనే ఉంటున్నాం . వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని రేపటి నుండి అంటే మంగళవారం 19-04-2021 నుండి 1-9 తరగతుల వరకు పాఠశాలలకు సెలవలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. స్కూలు సెలవలు ఇచ్చారు కానీ కరోనా రెస్ట్ తీసుకోదు పిల్లలని బయటకి పంపకుండా ఇంటి వద్దనే ఉంచండి